YS Jagan: పులివెందులలో నందీశ్వర ఆలయంలో హోమం - కల్తీ నెయ్యి వివాదం సమయంలో జగన్ ప్రత్యేక పూజలు
Pulivendula: పులివెందుల పర్యటనలో నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో జగన్ పాల్గొన్నారు. హోమం చేశారు.

Jagan participated in the Nandeeshwara temple program : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రెండు రోజుల పులివెందుల పర్యటనలో భాగంగా బుధవారం వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలోని నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. జగన్ రాకతో నందిపల్లి పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న శాస్త్రోక్త కార్యక్రమాల్లో భాగంగా జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించిన హోమంలో ఆయన పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. నందీశ్వరుడి విగ్రహ ప్రతిష్టాపన క్రతువును దగ్గరుండి వీక్షించిన ఆయన, ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. మొత్తం రూ. 6 కోట్ల వ్యయంతో ఈ ఆలయం రూపుదిద్దుకుంది.
నందిపల్లిలో నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలలో @ysjagan అన్న 🙏 pic.twitter.com/n1jbtchFNT
— Madhu🕷️♥️ (@ysj_madhureddy) February 25, 2026
ఆలయ పర్యటన అనంతరం అర్చకులు జగన్ కు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు జగన్ను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆయన స్థానిక ప్రజలతో మమేకమయ్యారు.
నందిపల్లిలోని శ్రీ నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ పాల్గొన్నారు.
— Harsha Vardhan Reddy (@hvrysrcp) February 25, 2026
ఆలయ అర్చకులు, వేదపండితులు నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొని, స్వామివారికి… pic.twitter.com/kAOKzASuww
నందిపల్లి కార్యక్రమం ముగిసిన అనంతరం జగన్ తిరిగి పులివెందులకు చేరుకున్నారు. అక్కడ భాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలనుంచి వచ్చిన బాధితులు, నాయకులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రికి పులివెందుల నివాసంలోనే బస చేసి గురువారం బెంగళూరు వెళ్తారు.























