BRS Politics: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
KTR And Kaviha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు విషయంలో కేటీఆర్ ట్వీట్.. కవితను ఆగ్రహానికి గురి చేసింది. డియర్ బ్రదర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Delhi Liquor Scam Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేయడం బీఆర్ఎస్ పార్టీలో కొత్త చిక్కులు రావడానికి కారణం అవుతోంది. లిక్కర్ స్కామ్ కేసు కొట్టివేతపై స్పందించిన కేటీఆర్ , ఈ కేసు కేవలం రాజకీయ కక్ష సాధింపు అని పేర్కొంటూనే, దీనివల్ల బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా నష్టపోయిందని ట్వీట్ చేశారు. ఈ స్కామ్ అనే నరేటివ్ వల్ల పార్టీ రాజకీయంగా బలి అయిందని ఆయన చేసిన విశ్లేషణ, పరోక్షంగా ఈ కేసు వల్లనే పార్టీ ఓడిపోయిందనే అర్థాన్ని స్ఫురింపజేసింది. ఇదే ట్వీట్లో తన సోదరి కవితకు న్యాయం జరిగిందన్నారు.
The AAP Govt led by Kejriwal was brought down in the name of the so-called liquor scam, and the political casualty of that narrative was the Bharat Rashtra Samithi in both the Assembly & Parliament elections
— KTR (@KTRBRS) February 27, 2026
Kavita Garu got justice in court today and In the same manner, every…
కేటీఆర్ ట్వట్ పై కవిత తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ ఓటమిని తన మెడకు చుట్టడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తనపై నమోదైన కేసు పార్టీ కోసమేనని, అది వ్యక్తిగతమైనది కాదని కవిత స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆమె కేసీఆర్ , కేటీఆర్ వైఖరిని తప్పుబట్టారు. తాను జైలులో ఉన్న సమయంలో కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా తనకు మద్దతుగా నిలవలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాల కోసం తాను ఇబ్బందులు పడితే, ఇప్పుడు ఓటమిని తన ఖాతాలో వేయడం అన్యాయమని ఆమె భావిస్తున్నారు.
కేటీఆర్ నాటకాలకు గట్టి కౌంటర్ ఇచ్చిన కవిత
— Telangana365 (@Telangana365) February 27, 2026
కేటీఆర్ నీ అహంకారం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది..
బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం నీ అహంకారం.
ఇప్పటికైన నీ బుద్ధి మార్చుకో బీఆర్ఎస్ ఓటమికి నేను కరణం అని ఇంకా దొంగ ప్రచారాలు చేస్తున్నావు అది బంద్ పెట్టు.
మీరు ఉద్యోగాలు ఇవ్వనందుకు,మీరు… pic.twitter.com/BVU5gHTriV
కేటీఆర్ తన విశ్లేషణలో వ్యవస్థల తీరును ఎండగట్టారు. సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, మీడియా ట్రయల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. న్యూ ఇండియా లో ఆధారాలు లేకుండానే రాజకీయ నేతలను అప్రతిష్టపాలు చేయడం ఒక అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. కవితకు కోర్టులో న్యాయం జరిగిందని, భవిష్యత్తులో మిగిలిన నాయకులపై ఉన్న తప్పుడు కేసులు కూడా వీగిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కోర్టు తీర్పు కవితకు వ్యక్తిగతంగా ఊరటనిచ్చినప్పటికీ, అన్నాచెల్లెళ్ల మధ్య తలెత్తిన ఈ వాగ్వాదం బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో గందరగోళానికి దారితీస్తోంది. ఒకవైపు రాజకీయ విజయం సాధించామనే సంతోషం ఉన్నా, మరోవైపు ఓటమికి బాధ్యత ఎవరిదనే విషయంలో కుటుంబం ,పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడం చర్చనీయాంశంగా మారింది. కవిత రెండు నెలల్లో పార్టీ పెట్టబోతున్నారు. ఈ క్రమంలో ఆమెను బలపరిస్తే.. అది బీఆర్ఎస్ కు నష్టమని .. వీలైనంత వరకూ సైలెన్స్ పాటిస్తున్నారు.























