India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన భారత్ ( India vs Zimbabwe ) సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 256 పరుగుల స్కోరును నమోదు చేసింది. జింబాబ్వే 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్రియాన్ బెన్నెట్ 97 పరుగులు చేశాడు. కానీ తన జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు.
ఈ మ్యాచ్లో, జింబాబ్వే టాస్ గెలిచి, టీమ్ ఇండియాను ముందుగా బ్యాటింగ్కు ఆహ్వానించింది. ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చిన సంజు శాంసన్ ( Sanju Samson ) 24 పరుగులకే ఔటయ్యాడు. కంటిన్యూగా విఫలమైన అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) చివరకు 55 పరుగులతో అర్ధ సెంచరీతో మంచి ప్రదర్శన చేశాడు. హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) కూడా 50 పరుగులు చేశాడు, తిలక్ వర్మ ( Tilak Verma ) కూడా 44 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ 2026 T20 ప్రపంచ కప్లో ( T20 World Cup ) అత్యధిక స్కోరు, T20 ప్రపంచ కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది.
జింబాబ్వే ఇప్పుడు ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది. బౌలింగ్ విభాగంలో భారత్ తరపున అర్ష్దీప్ సింగ్ అత్యధిక వికెట్లు పడగొట్టాడు, మూడు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, శివం దూబే, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు.























