అన్వేషించండి

New Delhi Stampede Compensation: న్యూఢిల్లీలో తొక్కిసలాట, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ భారీ పరిహారం- గాయపడితే రూ.2.5 లక్షలు

Compensation in New Delhi Railway Station stampede | న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం తొక్కిసలాట జరిగి 18 మంది మృతిచెందారు, మరికొందరు గాయపడ్డారు. వీరికి రైల్వే శాఖ భారీ పరిహారం ప్రకటించింది.

ఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతి చెందారు. ఎంతో మంది లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాట మృతుల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన వారికి సైతం రూ.2.5 లక్షల చొప్పున పరిహారం, స్వల్ప గాయాలైన వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

 

మహా కుంభమేళాకు వెళ్దామనుకుంటే మహా విషాదం..
వీకెండ్ కావడం, అందులోనూ త్వరలో మహా కుంభమేళా ముగియనుందని భక్తులు ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్‌ వెళ్లాలని రైల్వేష్టేషన్‌కు వచ్చారు. శనివారం రాత్రి రైలెక్కి ఆదివారం ఉదయం కుంభమేళాకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిద్దామనుకున్నారు. కానీ రైల్వేస్టేషన్లో ప్రయాగ్ రాజ్ వెళ్లే రెండు రైళ్లు ఆలస్యం కావడం, వేరే ప్లాట్‌ఫాం మీద రైలు ఉందని వదంతులు ప్రచారం కావడం తొక్కిసలాటకు దారితీసింది. ఎలాగైనా రైలు క్యాచ్ చేయాలని 12, 13 ప్లాట్‌ఫాంలతో పాటు స్టేషన్ కు వస్తున్న వారు ఒక్కసారిగా ప్లాట్‌ఫాం 14, 15 మీదకు చొచ్చుకురావడంతో తొక్కిసలాట జరిగింది. రైలు ఎక్కాలని తోటి వారిని తొక్కుకుంటూ కొందరు రైలు అందుకున్నారు. ఈ క్రమంలో ఊపిరాడక కొందరు అక్కడికక్కడే స్పృహ కోల్పోయి తరువాత మృతిచెందారు.

రైల్వే కూలీలు, సిబ్బంది అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే అంబులెన్సులలో బాధితులను లో‌క్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో మహిళలు 14 మంది ఉన్నారని అధికారులు, ఢిల్లీ పోలీసులు తెలిపారు. మొదట రైల్వే సీపీఆర్వో అసలు తొక్కిసలాటే జరగలేదని.. అంతా ప్రశాంతంగా ఉందని ప్రకటించారు. విషయం గమనించాక తొక్కిసలాట నిజమేనని కొందరు ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. ఆదివారం ఉదయానికి మృతుల సంఖ్య పద్దెనిమికి చేరినట్లు వెల్లడించారు.

ఢిల్లీ రైల్వే స్టేషన్లో భారీగా జనాలున్న ఫొటోలు, వీడియోలు.. తొక్కిసలాట అనంతరం హృదయ విదారకర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంత రద్దీ వస్తుంటే అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఆప్ నేతలతో పాటు ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడం కాదు, ప్రాణాలు పోకుండా చూడాలి కదా అని మోదీ ప్రభుత్వంపై, రైల్వే శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క, శాఖలవారీగా కేటాయింపుల పూర్తి వివరాలు
తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క, శాఖలవారీగా కేటాయింపుల పూర్తి వివరాలు
Marri Rajasekhar: వైసీపీకి మరో షాక్‌, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా
వైసీపీకి మరో షాక్‌, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా
Sunita Williams Smiles: సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
Bank Strike: సమ్మె + సెలవులతో బ్యాంక్‌లు వరుసగా 4 రోజులు బంద్‌
సమ్మె + సెలవులతో బ్యాంక్‌లు వరుసగా 4 రోజులు బంద్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP DesamSunita Williams Crew 9 Dragon Capsule Splash Down | భూమిపైకి క్షేమంగా సునీతా విలియమ్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క, శాఖలవారీగా కేటాయింపుల పూర్తి వివరాలు
తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క, శాఖలవారీగా కేటాయింపుల పూర్తి వివరాలు
Marri Rajasekhar: వైసీపీకి మరో షాక్‌, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా
వైసీపీకి మరో షాక్‌, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా
Sunita Williams Smiles: సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
Bank Strike: సమ్మె + సెలవులతో బ్యాంక్‌లు వరుసగా 4 రోజులు బంద్‌
సమ్మె + సెలవులతో బ్యాంక్‌లు వరుసగా 4 రోజులు బంద్‌
పదమూడేళ్లకే ఇంట్లోంచి పారిపోయి పెళ్లి... 18 ఏళ్లకు 50 ఏళ్ల సీఎంతో రెండో పెళ్లి, విడాకులు... సినిమాలు వదిలేసిన హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
పదమూడేళ్లకే ఇంట్లోంచి పారిపోయి పెళ్లి... 18 ఏళ్లకు 50 ఏళ్ల సీఎంతో రెండో పెళ్లి, విడాకులు... సినిమాలు వదిలేసిన హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
Sunita Williams: మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
WhatsApp Governance Mana Mitra: గేమ్ ఛేంజర్‌గా వాట్సాప్‌ గవర్నెన్స్‌, మన మిత్ర ద్వారా త్వరలో 500 రకాల ప్రభుత్వ సేవలు: నారా లోకేష్
వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా 500 రకాల ప్రభుత్వ సేవలు, అది నిరూపిస్తే రూ.10 కోట్లు ఇస్తా: నారా లోకేష్
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Embed widget