అన్వేషించండి

Chalo Delhi March: ఢిల్లీ బోర్డర్‌కు పొక్లెయిన్‌లు, భారీ ట్రాక్టర్‌లు! ఛలో ఢిల్లీకి రైతుల సన్నాహాలు

Farmers Protest: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు మరోసారి శంభు సరిహద్దులో ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌కు సన్నాహాలు చేస్తున్నారు.

Chalo Delhi: మొక్కజొన్న, పత్తి లాంటి పంటలను పాత మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ఐదేళ్ల కాంట్రాక్ట్‌ను కేంద్రం తిరస్కరించడంతో రైతులు మరోసారి కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు మరోసారి పంజాబ్ లోని శంభు సరిహద్దులో ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం (ఫిబ్రవరి 19) సాయంత్రం ఫిబ్రవరి 21 నుంచి ఢిల్లీకి తమ పాదయాత్రను పునఃప్రారంభించాలని రైతుల సంఘం సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించిన సంగతి తెలిసిందే.

మళ్లీ పూర్తి స్థాయిలో నిరసనలు కొనసాగించేందుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటిని బద్దలు కొట్టేందుకు రైతులు పొక్లెయిన్ లాంటి యంత్రాలను కూడా ఢిల్లీ సరిహద్దులకు చేర్చుతున్నారు. మరోవైపు, పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, రబ్బర్ బుల్లెట్లను రెడీ చేస్తున్నారు. వాటి నుంచి ఎదుర్కోవడానికి రైతులు ఆ మెషిన్ల క్యాబిన్లకు మందపాటి ఐరన్ షీట్లతో కవర్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇలాంటి మరిన్ని యంత్రాలు త్వరలో నిరసన తెలిపే రైతుల వద్దకు చేరుకుంటాయని భావిస్తున్నారు. అవసరమైనప్పుడు పోలీసులు, భద్రతా సిబ్బంది ఉంచిన బారికేడ్లను బద్దలు కొట్టడానికి వారు ట్రాక్టర్లను కూడా తీసుకువస్తున్నారు. రైతులు ఢిల్లీ వైపు పాదయాత్ర చేసేందుకు రేపు ఉదయం 11 గంటల వరకు గడువు ఇచ్చారు.

సోమవారం నాలుగో విడత చర్చలు విఫలం
కిసాన్ మోర్చా చీఫ్ జగ్జీత్ సింగ్ దల్లేవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు రైతులకు ప్రయోజనం కలిగించబోవని తేల్చి చెప్పారు. దీంతో తాము నిరసన కొనసాగించాలని అనుకుంటున్నామని.. కానీ, ప్రభుత్వం రైతుల డిమాండ్లను దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. రైతుల నిరసనను కూడా పలుచన చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. స్వామినాథన్ కమిషన్ రిపోర్టులో సిఫార్సు చేసిన మద్దతు ధరకు సంబంధించిన ‘సీ-2 ప్లస్ 50 పర్సెంట్’ ఫార్ములా కంటే తక్కువ కాకుండా.. రైతులు దేనికీ అంగీకరించబోరని ఆయన తేల్చి చెప్పారు.

అంతకుముందు రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చల సందర్భంగా.. ముగ్గురు కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, నిత్యానంద రాయ్, పీయూష్ గోయల్‌లు ప్రభుత్వం తరపున చర్చల్లో పాల్గొన్నారు. కేంద్రం ఇచ్చిన ప్రతిపాదనలను రైతులు తిరస్కరించారు. తమ డిమాండ్లను ఆమోదించకుంటే ఫిబ్రవరి 21న ఢిల్లీకి పాదయాత్ర చేస్తామని రైతు నాయకులు ప్రకటించారు.

అయితే, నాలుగు పంటలకు ఎంఎస్‌పీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. వరి, గోధుమలతో పాటు, కందిపప్పు, మినపప్పు, మొక్కజొన్న, పత్తి పంటలపై కూడా MSP ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని అన్నారు. అయితే దీని కోసం రైతులు నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED), కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) నుంచి అనుమతి పొందాలని.. వారు ఐదు సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో ఆందోళన విరమించాలని పీయూష్ గోయల్ రైతుల సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. దాన్ని రైతులు ఒప్పుకోకుండా ఫిబ్రవరి 21 నుంచి ఛలో ఢిల్లీకి పిలుపు ఇచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP DesamFlash Floods in Kullu Manali | బియాస్ నదికి ఆకస్మిక వరదలు | ABP DesamSuriya Jyothika With Kids First Time | సూర్య, జ్యోతిక పిల్లలు ఎంత పెద్ద వాళ్లైపోయారో | ABP DesamSLBC Tunnel Incident vs Uttarakhand Tunnel | ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ సక్సెస్..SLBC లో దేనికి ఆటంకం.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
Rambha Re Entry: రీ ఎంట్రీకి రెడీ... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన రంభ... సెకండ్ ఇన్నింగ్స్ షురూ!
రీ ఎంట్రీకి రెడీ... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన రంభ... సెకండ్ ఇన్నింగ్స్ షురూ!
SBI PO: ఎస్‌బీఐ పీవో-2024 ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఎస్‌బీఐ పీవో-2024 ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Crime News: తోటి డాన్సర్ జీవితంతో ఆడుకున్న ఢీ డాన్సర్ -ఆత్మహత్య - కన్నీరు పెట్టిస్తున్న చివరి వీడియో
తోటి డాన్సర్ జీవితంతో ఆడుకున్న ఢీ డాన్సర్ -ఆత్మహత్య - కన్నీరు పెట్టిస్తున్న చివరి వీడియో
Skype: చరిత్రలో కలిసిపోతున్న స్కైప్ - డిస్‌కంటిన్యూ చేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం
చరిత్రలో కలిసిపోతున్న స్కైప్ - డిస్‌కంటిన్యూ చేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం
Embed widget