అన్వేషించండి

Mortal Remains : 56 ఏళ్ల తర్వాత సైనికుడి మతదేహం లభ్యం - మరో 93 మంది శరీరాల కోసం కొనసాగుతోన్న గాలింపు

Dogra Scouts Expedition: రోహటంగ్‌ పాస్‌లో 56 ఏళ్ల క్రితం జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన సైనికుడి మృతదేహం లభ్యమైంది. 2003 నుంచి రెస్య్కూ ఆపరేషన్ చేస్తున్న డోంగ్రా స్కౌట్స్ 9 శవాలను వెలికి తీశారు.

Family 'sad and happy' over recovery of mortal remains of soldier after 56 years: 1968 నాటి విమాన ప్రమాదంలో మరణించిన కేరళ సైనికుడి మృతదేహాన్ని సైన్యం వారి కుటుంబానికి అందించనుంది. ఆ ప్రమాదంలో మొత్తం 102 మంది చనిపోయారు. అప్పట్లో ఆ ప్రమాద స్థలాన్ని కూడా గుర్తించ లేకపోయారు. 2003లో డోగ్రా స్కౌట్స్‌ ప్రమాద స్థలాన్ని గుర్తించారు. అప్పటి నుంచి చనిపోయిన వారి కోసం గాలిస్తున్న డోగ్రా స్కౌట్స్‌ ఇప్పటివరకూ 9 మంది మృతదేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అందించింది.

2003 నుంచి మారథాన్ ఆపరేషన్‌:

1968లో ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ఒక విమానం హిమాచల్ ప్రదేశ్‌లోని రోహటంగ్ పాస్ సమీపంలో కూలిపోయింది. చంఢీగడ్‌ నుంచి లేహ్‌కు వెళ్తున్న ఆ విమానంలో కేరళకు చెందిన సైనికుడు థామస్ చెరియన్‌తో పాటు 102 మంది ప్రయాణిస్తున్నారు. AN-12గా పిలిచే ఆ ఎయిర్‌ క్రాప్ట్‌ ట్విన్ ఇంజిన్ టర్బోప్రాప్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌ క్రాఫ్ట్‌. ఆ విమానం 1968 ఫిబ్రవరి 7న రోహటంగ్ పాస్ సమీపంలో మిస్‌ అయింది. దశాబ్దాల పాటు ఆ విమానం ఆచూకీ ఆ హిమాలయ సానువుల్లో కనిట్టలేకపోయారు. అయితే సైన్యంలోని ఒక భాగమైన అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మౌంటేనీరింగ్ సంస్థకు చెందిన వాళ్లు 2003లో మొట్టమొదటిసారి AN-12 శిథిలాలను గుర్తించారు. అప్పటి నుంచి డోగ్రా స్కౌట్స్‌తో కలిసి తిరంగా మౌంటేన్ రెస్క్యూ టీమ్ సంయుక్తంగా ఆ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల గాలింపును ముమ్మరం చేశారు. 2003 నుంచి కొనసాగుతున్న ఈ మారథాన్ ఆపరేషన్‌లో 2019 వరకు ఐదుగురి మృతదేహాలే లభ్యమయ్యాయి. 2005, 2006,2013, 2019లో మొత్తంగా ఐదుగురి మృతదేహాలను మంచు పర్వతాల్లో వెలికితీశారు. ఇప్పుడు నలుగురి శవాలు దొరకగా.. ఆ సంఖ్య 9కి చేరింది. మరో 93 మృతదేహాలు దొరకాల్సి ఉంది. చంద్ర భగ పర్వతంపై వీరందరినీ కనిపెట్టినట్లు సైన్యం తెలిపింది. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతుందని సైన్యం స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ నలుగురు మృతదేహాలు దొరకడంతో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలు చివరి సంస్కారాలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడినట్లు తెలిపారు.

56 ఏళ్ల తర్వాత అంతిమ సంస్కారాలు:

తమ ప్రియమైన అన్నయ్య పార్థివ దేహం 56 ఏళ్ల తర్వాత సైన్యం వెలికి తీసి ఇస్తుండడం గొప్పగా అనిపిస్తోందని కేరళకు చెందిన థామస్‌ చెరియన్ కుటుంబ సభ్యులు తెలిపారు. చెరియన్ చనిపోయినప్పటికి తన వయస్సు 12 సంవత్సరాలుగా చెప్పిన ఆయన సోదరి.. సైన్యం నుంచి ఎప్పుడు వచ్చినా తమ కోసం చాలా బొమ్మలు తెచ్చేవాడని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 56 ఏళ్ల తర్వాతైనా తమ అన్నయ్యకు అంతిమ సంస్కారాలు నిర్వహించే అవకాశం కల్పించిన సైన్యానికి చెరియన్ సోదరి, తమ్ముడు కృతజ్ఞతలు తెలిపారు. చెరియన్ సొంత ఊరు పత్తనమిట్టలోని ఎలత్తూర్‌. అక్కడే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని చెప్పారు. ఆ దేవుడి కృప వల్లే తమకు కనీసం ఈ పాటి అదృష్టమైన దక్కుతోందన్నారు. అయితే తమ అన్నయ్య ఫొటో ఒక్కటి కూడా తమ వద్ద లేదని చెప్పిన చెరియన్‌ కుటుంబ సభ్యులు ,సైన్యం తమ రికార్డుల నుంచి ఒకటి ఇప్పించే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Death Penalty: తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IND vs BAN 2nd Test Day 5 Highlights: రెండో టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియాSircilla Weavers: 18 లక్షల చీర చూశారా? సిరిసిల్లలోనే తయారీSrikakulam Fisherman Boats Fire: నడిసంద్రంలో అగ్ని ప్రమాదాలు, వణికిపోతున్న మత్స్యకారులుTiger in Konaseema: చిరుత కోసం డ్రోన్లతో వేట - కోనసీమ DFOతో ఫేస్ టూ ఫేస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Death Penalty: తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
I Phone Murder : ఐ ఫోన్ కోసం డెలివరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
ఐ ఫోన్ కోసం డెలివరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
Pawan Kalyan: 'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
Kothagudem News: సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
Embed widget