By: ABP Desam | Updated at : 10 Sep 2021 06:38 PM (IST)
Edited By: Murali Krishna
అఫ్గాన్- లగాన్'కి లింకేంటి.. తాలిబన్లపై భారత్ 'స్టాండ్' ఏంటి?
అఫ్గానిస్థాన్ తో భారత్ కు చాలా బలమైన బంధం ఉంది. ముఖ్యంగా అఫ్గాన్ వాసులతో భారత్ స్నేహం ఈనాటిది కాదు. కానీ ప్రస్తుతం అదే అఫ్గాన్ వాసులు తాలిబన్ల పాలనలో మరోసారి బందీలైపోయారు. ముఖ్యంగా మహిళలపై తాలిబన్ల అరాచకాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. తమ హక్కుల కోసం పోరాడుతోన్న మహిళలపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. మరి అఫ్గాన్ తో ఇన్నేళ్లు దోస్తీ చేసిన భారత్.. ఏం చేస్తుంది? అసలు తాలిబన్ల సర్కార్ పై భారత్ స్టాండేంటి?
తాలిబన్లకు నేరుగా పాకిస్థాన్ సాయం చేస్తుంది. ఇది భారత్ కు కాస్త ఇబ్బంది కలిగే విషయమే.. అలా అనీ అఫ్గాన్ వాసులను గాలికొదిలేసి భారత్ నాకెందుకులే అనుకోవడానికి లేదు. ఎందుకంటే అఫ్గానిస్థాన్ అభివృద్ధిలో భారత్ పాత్ర కీలకం. అందుకే అఫ్గానిస్థాన్ పై భారత్ ప్రస్తుతం వైఖరిపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టత ఇచ్చారు.
తాలిబన్లు లేదా తాలిబన్ సర్కార్ తో భారత ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తుందా అన్న ప్రశ్నకు సమాధానంగా జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సమాధానం బట్టి అఫ్గాన్ లో ఎలాంటి సర్కార్ ఉన్నా అక్కడి పౌరులతో భారత్ బంధం కొనసాగుతుందని జైశంకర్ చెప్పకనే చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి కూడా సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్ కు సమస్య వస్తే వెంటనే స్పందించే సరిహద్దు దేశం భారత్ మాత్రమేనని, అక్కడి ప్రజలు భారత్ స్నేహితులని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల దోహాలో తాలిబన్లతో భారత్ జరిపిన చర్చల్లో కూడా ఇదే స్పష్టమైంది. అఫ్గానిస్థాన్ ను ఆక్రమించి సర్కార్ ఏర్పాటు చేసిన తాలిబన్లను, అమాయకులైన అక్కడి పౌరులను భారత్ వేరువేరు కోణాల్లో చూస్తోంది. ఎందుకంటే ఇటీవల చర్చల్లో కూడా తాలిబన్లు.. అఫ్గాన్ లో ఉన్న పౌరుల క్షేమం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. పాస్తున్ వర్గం పరిస్థితి ఏంటో కూడా వెల్లడించలేదు. అఫ్గాన్ మాజీ అధ్యక్షులు హమిద్ కర్జాయ్, అష్రఫ్ ఘనీ ఈ వర్గానికి చెందినవాళ్లే.
లగాన్ సీడీలు..
అఫ్గానిస్థాన్.. భారత్ కు పెట్టుబడి వేదిక కాదని ఇప్పటికే చాలాసార్లు జైశంకర్ అన్నారు. వారితో బంధం గురించే ఎక్కువగా మాట్లాడారు. 2001 నవంబర్ 21న తాలిబన్లు గద్దె దిగిన సమయంలో ప్రత్యేక రాయబారి సతీశ్ లాంబా నేతృత్వంలో భారత బృందం కాబూల్ వెళ్లింది. ఆ సమయంలో భారత బృందం ఎయిర్ క్రాఫ్ట్ లో అప్గాన్ వాసులకు ప్రత్యేక బహుమతిని తీసుకువెళ్లింది. ఆ సమయంలో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన 'లగాన్' చిత్రం డీవీడీలను అఫ్గాన్ వాసులకు పంచిపెట్టారు. ఇప్పటికీ బాలీవుడ్ మూవీలను అఫ్గాన్ వాసులు బాగా ఇష్టపడతారు.
20 ఏళ్లలో..
గత 20 ఏళ్లలో అఫ్గాన్ లో భారత్ పెట్టిన పెట్టుబడులు, చేసిన అభివృద్ధి అంతాఇంతా కాదు. దాదాపు రూ.22 వేల కోట్లు అఫ్గాన్ లో ఖర్చు పెట్టింది భారత్.
అఫ్గాన్ లో భారత్ చేసిన నిర్మణాలు..
అంతా వృథానేనా..
తాలిబన్లు వచ్చిన తర్వాత భారత్ చేసిన అభివృద్ధి, పెట్టిన ఖర్చు మొత్తం వృథాగా మారింది. రూ. 22వేల కోట్ల ప్రజల డబ్బుకు, 20 ఏళ్ల విలువైన సమయానికి ఫలితం లేకుండా పోయింది. మరి ఇప్పుడు తాలిబన్లతో జాగ్రత్తగా ఉంటూ అఫ్గాన్ ప్రజలకు సాయం చేయడం భారత్ ముందున్న అతిపెద్ద సవాల్.
Petrol Diesel Price Today 11th December: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Sugar Stock: వారంలో దాదాపు 17% పతనమైన చక్కెర స్టాక్స్, ఇది 'బయ్ ఆన్ డిప్స్' అవకాశమా?
Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్- తప్పులేదన్న సజ్జనార్
Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్లో ఉండే 'కీ స్టాక్స్' Mazagon, Tata Moto, REC, Blue Dart
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య
Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్కు అర్థం ఏమిటీ?
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
/body>