అన్వేషించండి

Rates Hike: ఓటింగ్‌ పూర్తికాగానే ధరాఘాతం - పెరిగిన పాల రేట్లు - పెరగనున్న పెట్రోల్‌, మొబైల్‌ బిల్లులు!

Inflation Effect: జాతీయ రహదారులపై టోల్ రేట్ల పెంపు రూపంలో తొలి ధరాఘాతం తగిలింది. జూన్ నుంచి టోల్ టాక్స్ భారం 5 శాతం వరకు పెరిగింది.

Inflation Effect After Elections: ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జూన్‌ 01వ తేదీతో ముగిసింది. జూన్‌ 04న ఓట్ల లెక్కింపు జరిగింది, ఎన్‌డీఏ కూటమి 293 సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రి అవుతున్నారు. 

ఎన్నికలు ముగిసిన వెంటనే ధరాఘాతం
జూన్‌ 01న, చివరి విడత పోలింగ్‌ ముగిసిన వెంటనే సాధారణ ప్రజల నెత్తిన ధరల పిడుగులు పడడం ప్రారంభమైంది. జాతీయ రహదారులపై టోల్ రేట్ల పెంపు రూపంలో తొలి ధరాఘాతం తగిలింది. జూన్ నుంచి టోల్ టాక్స్ భారం 5 శాతం వరకు పెరిగింది. టోల్ ట్యాక్స్ పెంచుతూ గతంలోనే నిర్ణయం తీసుకున్నామని, జూన్ నుంచి అమలు చేస్తున్నామని NHAI అధికారి చెప్పారు.

పాల ధరలు పెంచిన పెద్ద కంపెనీలు
దేశంలో రెండు అతి పెద్ద పాల ఉత్పత్తి కంపెనీలు పాల ధరలు పెంచాయి. పాల రేటును లీటరుకు రూ. 2 పెంచుతున్నామని, ఆదివారం అర్థరాత్రి నుంచి ఇది అమల్లోకి వచ్చిందని ఇప్పటికే అమూల్ ప్రకటించగా, జూన్ 03వ తేదీన (సోమవారం) మదర్ డెయిరీ మరో షాకింగ్‌ న్యూస్‌ వెల్లడించింది. పాల ధరను లీటరుకు రూ.2 పెంచినట్లు ఆ సంస్థ కూడా ప్రకటించింది.

అమూల్‌ కొత్త ధరలు
జూన్ 03 నుంచి, దేశవ్యాప్తంగా అమూల్ గోల్డ్ లీటర్‌ ప్యాకెట్‌ రేటు రూ. 64 నుంచి రూ. 66కి పెరిగింది. అమూల్ టీ స్పెషల్ రూ. 62 నుంచి రూ. 64కు, అమూల్ శక్తి లీటర్ ప్యాకెట్‌ రూ. 60 నుంచి రూ. 62కు పెరిగింది. 500 మిల్లీలీటర్ల (అర లీటర్‌) అమూల్ గేదె పాల ప్యాకెట్‌ ధర ఇప్పుడు రూ. 35కు బదులుగా రూ. 37 అయింది, ఒక లీటర్ ప్యాక్ ధర రూ. 70కు బదులు రూ. 72కు చేరింది. అమూల్ పెరుగు ధర కూడా పెరిగింది.

మదర్ డెయిరీ కొత్త ధరలు
మదర్ డెయిరీ కూడా పాల రేటును లీటరుకు రూ. 2 పెంచడంతో... బల్క్ వెండెడ్ పాల ధరలు రూ. 52 నుంచి రూ. 54కు; టోన్డ్ మిల్క్ రూ. 54 నుంచి రూ.56కు; ఆవు పాలు రూ. 56 నుంచి రూ. 58కు; ఫుల్ క్రీమ్ మిల్క్ రూ. 66 నుంచి రూ.68కు; గేదె పాలు లీటర్‌కు రూ. 70 నుంచి రూ. 72కు; డబుల్ టోన్డ్ పాలు రూ. 48 నుంచి రూ. 50కు పెరిగాయి.

చమురు ధరలు పెరుగుతాయని అంచనా
OPEC+ దేశాలు ముడి చమురు సరఫరాను తగ్గించాలని నిర్ణయించినందున గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం సరఫరాపై కనిపిస్తుంది, ముడి చమురు దిగుమతి బిల్లు పెరుగుతుంది. సహజంగానే, ఆ ప్రభావం మన దేశంలో చమురు ధరలపై ఉండొచ్చు, ఇక్కడ ధరలు పెరగవచ్చు.

టారిఫ్‌ పెంచే ప్లాన్‌లో టెలికాం కంపెనీలు!
మన దేశంలో ప్రధాన టెలికాం కంపెనీలు రిలయన్స్‌ జియో ‍‌(Reliance Jio), భారతి ఎయిర్‌టెల్‌ (Bharati Airtel) తమ టారిఫ్‌లు పెంచే యోచనలో ఉన్నాయని సమాచారం. వాస్తవానికి, మన దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే ఇవి రేట్లు పెంచాల్సి ఉంది. ఎన్నికల నేపథ్యంలో, ప్రజా వ్యతిరేకత రాకుండా టారిఫ్‌ పెంపును కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి, ఈ కంపెనీలు ఏ నిమిషంలోనైనా ప్రకటన చేయవచ్చు. 15 నుంచి 17 శాతం వరకు టారిఫ్‌లు పెంచే అవకాశం ఉంది. అయితే, టెలికాం కంపెనీలు దీనిపై ఇంకా అధికారిక ప్రకటనలు విడుదల చేయలేదు. 

మరో ఆసక్తిర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR BRS Meeting: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. ఘనంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు
బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. ఘనంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు
Andhra Pradesh and Telangana: కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
Anil Ravipudi: మెగాస్టార్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అనిల్ రావిపూడి... బిగ్ లీగ్‌లో చేరినట్టేనా?
మెగాస్టార్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అనిల్ రావిపూడి... బిగ్ లీగ్‌లో చేరినట్టేనా?
Tirumala News: తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం, శ్రీవారి భక్తులు షాక్
Tirumala News: తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం, శ్రీవారి భక్తులు షాక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABPSunita Williams Coming back to Earth | Gravity లేకపోతే మన బతుకులు అథోగతేనా | ABP DesamAdilabad Bala Yesu Festival | క్రిస్మస్ కన్నా ఘనంగా చేసుకునే బాల యేసు పండుగ | ABP DesamPawan Kalyan Maha kumbh 2025 | ప్రయాగ్ రాజ్ లో ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR BRS Meeting: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. ఘనంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు
బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. ఘనంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు
Andhra Pradesh and Telangana: కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
Anil Ravipudi: మెగాస్టార్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అనిల్ రావిపూడి... బిగ్ లీగ్‌లో చేరినట్టేనా?
మెగాస్టార్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అనిల్ రావిపూడి... బిగ్ లీగ్‌లో చేరినట్టేనా?
Tirumala News: తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం, శ్రీవారి భక్తులు షాక్
Tirumala News: తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం, శ్రీవారి భక్తులు షాక్
OTT Telugu Movie: వెన్నెల కిషోర్ కామెడీ సినిమా... ఇవాళ్టి నుంచి మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ - లాఫింగ్ ధమాకా ఎక్కడ చూడొచ్చంటే?
వెన్నెల కిషోర్ కామెడీ సినిమా... ఇవాళ్టి నుంచి మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ - లాఫింగ్ ధమాకా ఎక్కడ చూడొచ్చంటే?
Bandi Sanjay Sensational Comments: కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది! ఆరు నెలల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం: బండి సంజయ్
కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది! ఆరు నెలల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం: బండి సంజయ్
Chhatrapati Shivaji Jayanti 2025:  పదహారేళ్లకే కత్తి పట్టిన వీర యోధుడు ఛత్రపతి శివాజీ, మొఘలుల్ని వణికించిన రియల్ వారియర్
 పదహారేళ్లకే కత్తి పట్టిన వీర యోధుడు ఛత్రపతి శివాజీ, మొఘలుల్ని వణికించిన రియల్ వారియర్
Aadi Saikumar: ఆది సాయికుమార్ సినిమాకు రిలీజ్‌కు ముందే ఆరేడు కోట్లు... 'ఎస్ఐ యుగంధర్' డిజిటల్ డీల్ క్లోజ్, ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?
ఆది సాయికుమార్ సినిమాకు రిలీజ్‌కు ముందే ఆరేడు కోట్లు... 'ఎస్ఐ యుగంధర్' డిజిటల్ డీల్ క్లోజ్, ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.