Breaking News Live Telugu Updates: తెలంగాణలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పర్యటన
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE

Background
తెలంగాణాలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పర్యటన
రేపు తెలంగాణాలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పర్యటన
ఇవాళ రాత్రి హైదరాబాద్ కు చేరుకోనున్న పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.
సీఎం కేసీఆర్ తో కలిసి రేపు సిద్దిపేట జిల్లా సందర్శించనున్న పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.
కొండపోచమ్మ సాగర్ తో పాటు కూడవెళ్లి వాగుపై నిర్మించిన చెక్ డాంలను పరిశీలించనున్న ఇద్దరు సీఎంలు.
సిద్దిపేట జిల్లాతోపాటు, గజ్వేల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన.
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.
సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరో లేఖ
సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరో లేఖ
తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి
అన్ని అనుమతులున్న ఆదిలాబాద్, జక్రాన్ పల్లి, వరంగల్ విమానాశ్రయాల నిర్మాణానికి ముందుకు రావాలని సూచన
గతంలో విమానయాన శాఖ మంత్రి, లేఖ రాసినా, తాను లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కేంద్రప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి
15 నెలల్లో 1110 పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్: వైవీ.సుబ్బారెడ్డి
తిరుపతి : టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మీడియా పాయింట్స్..
రాష్ట్రంలోనే తొలి సారిగా హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ డాక్టర్లు బృందం విజయవంతం అయ్యారు..
వారికి నా ప్రత్యేక అభినందనలు..
సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా 2021 అక్టోబర్ 11 నాడు ఈ హాస్పిటల్ ప్రారంభించారు..
15 నెలలు కాలంలో 1110 పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేసి పునర్జన్మ ప్రసాదించారు..
గుండె సంబంధిత చిన్నారులకు పైసా ఖర్చు లేకుండనే ఆరోగ్య శ్రీ ద్వారా మెరుగైన వైద్యం ఇక్కడ అందిస్తున్నాం..
గుండె మార్పిడి చేయించుకున్న విశ్వేశ్వర్ అన్నమయ్య జిల్లా చిట్ వేలు మండలం కే. ఎస్.ఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన వాడు..
పూర్తి స్థాయిలో కోలుకున్నాడు, వారం రోజుల్లో డిశ్చార్జి చేస్తారు..
తిరుపతి సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా శ్రీ పద్మావతి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 300 కోట్లతో నిర్మిస్తున్నాం..
ఇక్కడ హెలి లిఫ్టింగ్ అందుబాటులో విధంగా ఈ హాస్పిటల్ లో పైన హెలిప్యాడ్ నిర్మిస్తున్నాం..
సీఎం జగన్ కు సంక్షేమానికి, ఉచితాలకు తేడా తెలియదు: ఎంపీ లక్ష్మణ్
ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ లక్ష్మణ్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న బీజేపీ నేత లక్ష్మణ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ రెడ్డికి సంక్షేమానికి, ఉచితాలకు తేడా తెలియకుండా పోవటంతో ఆంధ్రప్రదేశ్ సంపదను విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నారని ఆరోపించారు. నిన్నటి వరకు మూడు రాజధానుల గురించి మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం నేడు విశాఖ మాత్రమే రాజధానిగా చెబుతున్నారని ప్రశ్నించారు.
పురానాపూల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఇంకా అదుపులోకి రాని మంటలు
హైదరాబాద్: కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పురానాపూల్లో ఓ గోదాములో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఆరు ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ గోదాములో కూలర్ల తయారీకి సంబంధించిన సామగ్రి నిల్వ చేసినట్టు తెలుస్తోంది. ఎక్కువగా ప్లాస్టిక్ సామగ్రి ఉండటంతో దట్టమైన పొగతో పాటు మంటలు కూడా భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

