అన్వేషించండి

75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?

75th Constitution Day Of India: ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటాం. కానీ భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. ఎందుకిలా చేస్తున్నారు.. చరిత్ర ఏంటీ?

Constitution Day Of India: దాదాపు పదేళ్ల నుంచి మనం ప్రతి సంవత్సరం నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటాం. రాజ్యాంగం గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ప్రాముఖ్యత, అంబేద్కర్ ఆలోచనలు, భావనలు వ్యాప్తి చేసే లక్ష్యంతో ఈ వేడుక ప్రతి ఏటా చేసుకుంటాం. అసలు రాజ్యాంగం అమలులోకి వచ్చింది జనవరి 26 కానీ మనం నవంబర్‌ 26న ఈ వేడుక చేసుకోవడం వెనుక పెద్ద చరిత్రే ఉంది. 

భారత రాజ్యాంగ దినోత్సవం చరిత్ర ఏమిటి?
మనం ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1949లో ఇదే రోజున అంటే నవంబర్ 26న  భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఈ రాజ్యాంగం అధికారికంగా అమలులోకి వచ్చింది మాత్రం 26 జనవరి 1950న. అందుకే ఆ రోజును మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం.

2015 నుంచే ఎందుకు?
నవంబర్ 26న రాజ్యాంగాన్ని అనధికారికంగా ఎందుకు అమలు చేశారో తెలుసా? రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సీనియర్ సభ్యుడు డాక్టర్ సర్ హరిసింగ్ గౌర్ పుట్టినరోజు. ఆ రోజున 2015లో మొదటిసారిగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ 125వ జయంతి 2015లో జరిగింది. అందుకే ఆ సంవత్సరం నుంచి అంబేద్కర్‌కు నివాళులర్పించేందుకు రాజ్యాంగ దినోత్సవాన్ని అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. 

75 వసంతాల రాజ్యాంగం 
ఇప్పుడు రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్నందున కేంద్రం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. పాత పార్లమెంటు భవనంలో జరిగే కార్యక్రమాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా ప్రముఖులు పాల్గొంటారు. రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ దివస్ అని కూడా పిలుస్తారు. 

ముందుగా ఈ వేడుకల్లో పాల్గొంటున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ప్రత్యేక నాణెం, తపాలా బిళ్ల, కొన్ని పుస్తకాలు విడుదలు చేస్తారు. అన్నింటి కంటే ముఖ్యంగా సంస్కృత, మైథిలీ లిపిలో రాసిన రాజ్యాంగ ప్రతిని రాజ్యాంగ సభ సెంట్రల్ హాల్‌లో విడుదల చేయనున్నారు. ముందుగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభోపన్యాసం చేస్తారు. కార్యక్రమంలో భారత రాజ్యాంగ వైభవం, ఆవిర్భావం, చారిత్రను తెలియజేసే వీడియోను ప్లే చేస్తారు. 

భారత రాజ్యాంగ 75 వసంతాల కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఢిల్లీలో ఉన్న వివిధ శాఖల అధిపతులు పాల్గొంటారు. 

కార్యక్రమంలో విడుదల చేసే పుస్తకాలు ఇవే 
'ది క్రియేషన్ ఆఫ్ ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా: ఎ గ్లింప్స్'. 'ది క్రియేషన్ ఆఫ్ ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ గ్లోరియస్ జర్నీ' పేరుతో రెండు పుస్తకాలు విడుదల చేయనున్నారు. 

Also Read: మన రాజ్యాంగం గురించి 10 ఆసక్తికర విశేషాలివే, ప్రస్తుతం ఒరిజినల్ కాపీ అక్కడ చాలా సేఫ్ !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget