అన్వేషించండి

Constitution Day 2022: మన రాజ్యాంగం గురించి 10 ఆసక్తికర విశేషాలివే, ప్రస్తుతం ఒరిజినల్ కాపీ అక్కడ చాలా సేఫ్ !

Interesting Facts About Indian Constitution: రాజ్యాంగ పరిషత్ సభ్యులు 1949 నవంబరు 26న రాజ్యాంగానికి ఆమోదం తెలిపారు. అయితే 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది.

Constitution Day 2022: నేడు (నవంబర్ 26న) భారతదేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. రాజ్యాంగ పరిషత్ సభ్యులు 1949 నవంబరు 26న రాజ్యాంగానికి ఆమోదం తెలిపారు. అయితే 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును రాజ్యాంగ దినోత్సవంగా, అమలులోకి వచ్చిన రోజును గణతంత్య్ర దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నాం. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు.
 దాదాపు మూడేళ్ల పాటు 1946 నుంచి 1949 వరకూ ఈ బృందం భారత పార్లమెంటు హాలులో సమావేశమై చర్చలు చేశారు. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత రాజ్యాంగాన్ని బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందింది. స్వాతంత్ర్యం వచ్చిన రెండున్నరేళ్లకే సొంతంగా పరిపాలన సాగించేందుకు రూపకల్పన చేసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. బానిస పాలనకు ముగింపు పలికిన భారత్, రాజ్యాంగం అమలుతో సర్వసత్తాక, గణతంత్య్ర రాజ్యంగా అవతరించింది. ఎన్నో దేశాల రాజ్యాంగాలలోని పలు అంశాలను పరిశీలించి మన రాజ్యాంగంలో చేర్చారు.

భారత రాజ్యాంగం గురించి 10 విశేషాలు..
- ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. అయితే 
1930లో జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్‌ తీర్మానం చేయడంతో 1950లో అదే రోజున రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 
-  2015లో అంబేడ్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకుని నవంబర్‌ 26ని రాజ్యాంగ దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. అంతకుముందు వరకు నవంబర్ 26ను జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకునేవాళ్లం. 2015 నుంచి నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన్ దివస్, జాతీయ చట్ట దినోత్సవం పేర్లతోనూ వేడుకలను నిర్వహిస్తున్నాం.
-  భారత రాజ్యాంగ రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది.
-  భారత రాజ్యాంగ పరిషత్ కు తొలి అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆగస్టు 29, 1947న రాజ్యాంగాన్ని రచించేందుకు బీఆర్ అంబేద్కర్ చైర్మన్ గా ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు.  
- రాజ్యాంగ ముసాయిదా కమిటీ 165 రోజుల్లో 11సార్లు సమావేశమైంది. ఇందులో కేవలం రాజ్యాంగం కోసం 114 రోజులు సమావేశమయ్యారు.
- మొత్తం 299 సభ్యులుండగా, 284 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఆమోదం తెలుపుతూ సంతకం చేశారు. 1949లో నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందింది.
-  భారత రాజ్యాంగంలో 22 భాగాలు, 448 ప్రకరణలు, 12 షెడ్యూల్స్, 115 సవరణలు ఉన్నాయి.
-  భారత రాజ్యాంగం రచించడానికి అయిన మొత్తం ఖర్చు రూ.64 లక్షలు.
-  రాజ్యాంగం అమలోకి రావడంతో మహిళలకు దేశంలో అన్నిచోట్లా ఓటు హక్కు లభించింది. అంతకుముందు పురుషులకు మాత్రమే ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉండేవారు.
- భారత రాజ్యాంగం ఒరిజినల్ కాపీని పార్లమెంట్ లైబ్రరీలో భద్రంగా ఉంచారు. హీలియం నింపిన ఓ పెట్టెలో, నాఫ్తలీన్ బాల్స్‌తో ఫ్లాన్నెల్ గుడ్డలో చుట్టి భద్రపరిచారు.

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget