అన్వేషించండి

India China Clash: నెహ్రూ అందరినీ సంప్రదించిన తరవాతే చైనాతో యుద్ధానికి దిగారు - 1962 నాటి రోజుల్ని గుర్తు చేసిన శశిథరూర్

India China Clash: 1962లో నెహ్రూ సభలో అందరితో చర్చించాకే చైనాతో యుద్ధానికి అంగీకరించారని శశి థరూర్ అన్నారు.

India China Clash:

అందరి మాటా విన్నారు: శశి థరూర్

తవాంగ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం కొనసాగుతోంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన వివరణపై అసంతృప్తిగా ఉన్నామని కాంగ్రెస్ మండి పడుతోంది. పార్లమెంట్‌లో ఈ విషయమై పెద్ద ఎత్తు వాగ్వాదం జరగ్గా..కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఈ క్రమంలోనే...కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశి థరూర్ ఈ పరిణామాలపై స్పందించారు. చైనా విషయంలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వ్యవహరించిన తీరుని గుర్తు  చేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. "1962లో చైనాతో యుద్ధం జరిగిన సయయంలో పార్లమెంట్‌లోని అందరి సభ్యులతో మాట్లాడారు. సభ సజావుగా సాగేలా చూశారు. అందరి మాటా విన్నారు. దాదాపు 100 మంది ఎంపీలు ఆయనతో చర్చించారు. ఆ తరవాతే పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్చలు అవసరం అని ఆయన అప్పట్లోనే చెప్పారు. బీజేపీ మాత్రం కాంగ్రెస్‌పై దాడి చేయడమే పనిగా పెట్టుకుంటోంది. నెహ్రూ చైనా విషయంలో చాలా సాఫ్ట్‌గా ఉన్నారని విమర్శిస్తోంది. యుద్ధం వల్ల అప్పట్లో భారత్ బాగా నష్టపోయిందని ఏదో సాకులు చెబుతోంది. ఈ రెండు కారణాలు చూపించి కాంగ్రెస్‌పై దాడికి దిగుతోంది" అని అసహనం వ్యక్తం చేశారు శశి థరూర్. పార్లమెంట్‌లో జవాబుదారీతనం ఉండాలని అన్నారు. జాతీయ భద్రత అంశమైనా, అందులో కొన్ని రహస్యంగా ఉంచాల్సినవైనా...కొన్నింటిపై మాత్రం తప్పకుండా చర్చించే అవకాశం కల్పించాలని సూచించారు. రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేదని అన్నారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, ఏదో పొడిపొడిగా వివరణ ఇచ్చారని..ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదని మండి పడ్డారు. 

తవాంగ్‌పై డ్రాగన్ కన్ను..

గతేడాది అక్టోబర్‌లో తవాంగ్‌లోనూ కవ్వింపు చర్యలకు పాల్పడింది చైనా. దాదాపు 200 మంది చైనా సైనికులు భారత భూభాగమైన తవాంగ్‌లోకి చొచ్చుకుని వచ్చారు. అటు భూటాన్, ఇటు టిబెట్‌తో సరిహద్దు పంచుకుంటోంది తవాంగ్. తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణలు జరిగినప్పటి నుంచే వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి భారత్ భద్రతను కట్టుదిట్టం చేసింది. అటు చైనా కూడా అదే స్థాయిలో సైనికులను మోహరించింది. వాస్తవానికి...అరుణాచల్‌ ప్రదేశ్‌ను "దక్షిణ టిబెట్" అని క్లెయిమ్ చేసుకుంటోంది చైనా. అందులోనూ తవాంగ్‌ను ఆక్రమించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇక్కడ భారత సైన్యం కదలికలు చాలా చురుగ్గా ఉంటాయి. అందుకే...తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు తరచూ గొడవలకు దిగుతూ ఉంటుంది చైనా సైన్యం. ఈ ప్రాంతం భారత్‌కు భద్రత పరంగా ఎంతో వ్యూహాత్మకం. ఇక భారత్‌ వైపు చూస్తే...తవాంగ్‌తో పాటు చంబా వ్యాలీ కూడా కీలకమే. చైనా భూటన్ సరిహద్దుకి సమీపంలో తవాంగ్ ఉండగా...నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో చంబా ఉంది. అరుణాచల్ మాదే అనే మొండి వాదన చేస్తున్న చైనా...ఈ రెండు ప్రాంతాలనూ సొంతం చేసుకుంటే..దాదాపు విజయం సాధించినట్టే. కానీ...భారత్ మాత్రం చైనా కలను కలగానే మిగిల్చే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది.

Also Read: India China Clash: చైనా సైన్యాన్ని తరిమికొట్టిన భారత జవాన్లు- ఇదిగో వీడియో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana VS Andhra Pradesh: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
APPSC Group -2 Results : ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్ ఫలితాలు విడుదల- 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్ ఫలితాలు విడుదల- 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
TTD  News Guidelines: తెలంగాణలో తిరుమలేశుడి భక్తులకు బిగ్ అలర్ట్- సిఫార్సు లేఖలపై ప్రత్యేక మార్గదర్శకాలు
తెలంగాణలో తిరుమలేశుడి భక్తులకు బిగ్ అలర్ట్- సిఫార్సు లేఖలపై ప్రత్యేక మార్గదర్శకాలు
HCU Land Dispute: ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs MI Match Highlights IPL 2025 | ముంబై పై 12పరుగుల తేడాతో లక్నో ఘన విజయం | ABP DesamAngkrish Raghuvanshi 50 vs SRH | ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసిన రఘువంశీKamindu Mendis Ambidextrous Bowling vs KKR | IPL 2025 లో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ ప్లేయర్Sunrisers Flat Pitches Fantasy | IPL 2025 లో టర్నింగ్ పిచ్ లపై సన్ రైజర్స్ బోర్లా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana VS Andhra Pradesh: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
APPSC Group -2 Results : ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్ ఫలితాలు విడుదల- 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్ ఫలితాలు విడుదల- 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
TTD  News Guidelines: తెలంగాణలో తిరుమలేశుడి భక్తులకు బిగ్ అలర్ట్- సిఫార్సు లేఖలపై ప్రత్యేక మార్గదర్శకాలు
తెలంగాణలో తిరుమలేశుడి భక్తులకు బిగ్ అలర్ట్- సిఫార్సు లేఖలపై ప్రత్యేక మార్గదర్శకాలు
HCU Land Dispute: ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
AP Nominated posts: కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
CSK Captain MS Dhoni:  చెన్నై కెప్టెన్ గా ధోనీ..! మ‌ళ్లీ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న వెట‌ర‌న్ ప్లేయ‌ర్..!! శ‌నివారం చెపాక్ లో ఢిల్లీతో మ్యాచ్
చెన్నై కెప్టెన్ గా ధోనీ..! మ‌ళ్లీ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న వెట‌ర‌న్ ప్లేయ‌ర్..!! శ‌నివారం చెపాక్ లో ఢిల్లీతో మ్యాచ్
Nagababu : పిఠాపురం ప్రజల అతి పెద్ద సమస్యకు పవన్ పరిష్కారం - స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన నాగబాబు
పిఠాపురం ప్రజల అతి పెద్ద సమస్యకు పవన్ పరిష్కారం - స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన నాగబాబు
YS Sharmila : అసలు విషయం వదిలేస్తున్నారు, నచ్చినట్టు వాడుకుంటున్నారు- మీడియాపై షర్మిల ఆగ్రహం
అసలు విషయం వదిలేస్తున్నారు, నచ్చినట్టు వాడుకుంటున్నారు- మీడియాపై షర్మిల ఆగ్రహం
Embed widget