అన్వేషించండి

Indian National Flag: జాతీయ జెండా గురించి మహాత్మా గాంధీజీ ఏం చెప్పారో తెలుసా?

Indian National Flag: మన త్రివర్ణ పతాకం తుది రూపు వచ్చే ముందు ఎన్నో విధాలుగా మార్పులు చేర్పులు చేశారు.

History Of Indian National Flag: 

జాతీయ జెండా అంటే ఓ ఎమోషన్. జెండాని గౌరవంగా ఎగరేసి ముందు నించుని సెల్యూట్ చేసినప్పుడు వచ్చే ఫీలింగ్‌కు ఏదీ సాటి రాదు. అంత భావోద్వేగాన్ని కలిగించే జాతీయ జెండాతో మన అనుబంధాన్ని ఇంకా పెంచేందుకు ప్రధాని మోదీ హర్ ఘర్ తిరంగా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. కొందరు సోషల్ మీడియాలోనూ జెండాను డీపీగా పెట్టుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో...ఓ సారి మన త్రివర్ణ పతాక చరిత్రను మననం చేసుకుందాం. 

1.మన జాతీయ జెండాను తొలిసారి 1906లో ఆగస్టు 7వ తేదీన ఆవిష్కరించారు. పశ్చిమ బెంగాల్‌లోని కోలకత్తాలో పార్సీ బగన్ స్క్వేర్‌ వద్ద జెండా ఎగరేశారు. అప్పటికి త్రివర్ణ పతాకంలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులున్నాయి. 

2.భారత్‌కు ప్రత్యేకంగా జెండా ఎందుకు ఉండాలో, అది ఎంత కీలకమో గాంధీజీ అప్పట్లో వివరించారు. "జాతీయ జెండా అనేది అన్ని దేశాలకూ కీలకం. లక్షలాది మంది ఆ జెండా కోసమే ప్రాణాలర్పించారు. భారతీయులకు, ముస్లింలకు,క్రిస్టియన్లకు, పార్సీలకు...ఇలా ప్రజలందరి అస్తిత్వానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే జెండా చాలా అవసరం" అని బాపూజీ అన్నారు. 

3.ఆ తరవాత జెండాలో మార్పులు చేశారు. ఈ రెండో త్రివర్ణ పతాకాన్ని 1907లో మేడమ్ కామా పారిస్‌లో ఆవిష్కరించారు. అయితే ఈ జెండా..దాదాపు మొదటి జెండాను పోలి ఉండేది. అంతకు ముందు జెండాలో ఉన్న కమలం పువ్వు స్థానంలో నక్షత్రాలను చేర్చారు. సప్తరుషులకు సంకేతంగా ఇలా మార్పులు చేశారు. 

4.ఇక మూడో జాతీయ జెండాను 1917లో డాక్టర్ అనీబిసెంట్, లోకమాన్య తిలక్ కలిసి ఆవిష్కరించారు. హోమ్ రూల్‌ ఉద్యమంలో భాగంగా ఇలా జెండా ఎగరేశారు. మొదటి రెండు జెండాల కన్నా ఇది చాలా విభిన్నంగా ఉండేది. ఎరుపు, ఆకుపచ్చ రంగులతోపాటు యూనియన్ జాక్ కూడా జోడించారు. ఏడు నక్షత్రాలను సప్తరుషులకు సంకేతంగా ఉంచారు. 

5. 1921లో నాలుగో జెండాను పింగళి వెంకయ్య రూపొందించారు. ఆల్‌ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మహాత్మా గాంధీని కలిసి ఆ జెండాను చూపించారు. ఈ పతాకంలో ఎరుపు, ఆకుపచ్చ రంగులు మాత్రమే ఉండేవి. హిందు, ముస్లింలకు సంకేతంగా ఉన్న ఈ రంగులకు తెలుపు రంగునీ జోడించారు మహాత్మా గాంధీ. దేశ అభివృద్ధికి చిహ్నంగా జెండా మధ్యలో అశోక చక్రాన్ని జోడించారు. 

6. త్రివర్ణపతాక చరిత్రలో 1931 ఏడాదిని కీలక మలుపుగా చెప్పుకోవాలి. ఆ ఏడాదే మన మూడు రంగుల జెండాను అధికారికంగా ఆమోదించాలని తీర్మానించారు. ఎరుపు రంగు స్థానంలో కాషాయాన్ని చేర్చారు. ఇన్ని మార్పుల తరవాత మనం ఇప్పుడు చూస్తున్న త్రివర్ణ పతాకానికి రూపకల్పన జరిగింది. 

కచ్చితంగా ఫ్లాగ్ కోడ్ నియాలను పాటిస్తూనే జెండా ఎగురవేయాలి. జాతీయ జెండా పట్ల పూర్తి గౌరవంతో ప్రజలు మెలగవలసి ఉంటుంది. అంతే జెండాను అవమానించే ప్రవర్తిస్తే మాత్రం భారీ జరిమానాతో పాటూ మూడేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. 2002 జనవరి 26 కొత్త ఫ్లాగ్ కోడ్ అమల్లోకి వచ్చింది. 2022న జూలైలో సవరణలు కూడా చేశారు. వాటి ప్రకారం జాతీయ జెండాను ఏ సమయంలోనైనా ఎగురవేయచ్చు. ఇంటి మీద కూడా ఎగురవేసుకోవచ్చు. కాబట్టి మీకు ఆసక్తి ఉంటే మీ ఇంటిపై నిరభ్యంతరంగా జాతీయ జెండా ఎగురవేయండి. 

Also Read: India National Anthem: జాతీయగీతాన్ని తొలిసారి ఎక్కడ ఆలపించారు? సింధు పదంపై వివాదమెందుకు?

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
ABP Desam Top 10, 12 May 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 12 May 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
IPL 2026 Playoffs Scenario: రసవత్తరంగా మారిన ఐపీఎల్ ఫ్లే ఆఫ్ రేసు.. 4 స్థానాల కోసం 8 జట్ల మధ్య పోటీ
రసవత్తరంగా మారిన ఐపీఎల్ ఫ్లే ఆఫ్ రేసు.. 4 స్థానాల కోసం 8 జట్ల మధ్య పోటీ

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Revanth Friendship With Modi: రేవంత్ కావాలా మోదీ..! పొలిటికల్ హీట్ రేపుతున్న మోదీతో సాన్నిహిత్యం..! హస్తం పార్టీలో చిచ్చుపెడతారా..?
రేవంత్ కావాలా మోదీ..! పొలిటికల్ హీట్ రేపుతున్న మోదీతో సాన్నిహిత్యం..! హస్తం పార్టీలో చిచ్చుపెడతారా..?
Hyderabad Crime News: బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
Kadapa Tipu Sultan Row: కడపలో టిప్పు సుల్తాన్ వివాదం వెనుక నిషేధిత సంస్థల కుట్ర - సిట్ ఏర్పాటుకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
కడపలో టిప్పు సుల్తాన్ వివాదం వెనుక నిషేధిత సంస్థల కుట్ర - సిట్ ఏర్పాటుకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
Embed widget