అన్వేషించండి

Independence Day:1947 స్వాతంత్య్ర వేడుకల్లో మహాత్మా గాంధీ ఎందుకు లేరు.. అప్పుడు జరిగిన ఇంట్రస్టింగ్ సంగతులు ఇవే..

భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించింది మహాత్మా గాంధీ. కానీ, ఆయన మెుదటి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనలేదు.అది ఎందుకో తెలుసా?

 

భారత స్వాతంత్య్ర ఉద్యమం అని పేరు చెప్పగానే.. ఠక్కున గుర్తొచ్చే పేరు మహాత్మా గాంధీ. భారతదేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి.. ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఎన్నో ఉద్యమాలు చేశారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. మెుదటి వేడుకల్లో ఆయన పాల్గొనలేదు. అప్పుడు దీక్షలోనే ఉన్నారు. అలాంటి.. ఆసక్తికర పది పాయింట్లు ఓ సారి చదవండి.. 

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15న మెుదటి వేడుకల్లో గాంధీ పాల్గొనలేదు. దిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలోని బెంగాల్ లోని నోవాకలీలో ఉన్నారు. అక్కడ హిందూ.. ముస్లింల మధ్య మత ఘర్షణలను జరగకుండా ఉండాలని నిరాహార దీక్ష చేశారు.

Also Read: 1906లో మన జాతీయ జెండా ఎలా ఉండేదో తెలుసా? చూస్తే.. ఆశ్చర్యపోతారు!

ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వస్తుందనే విషయం జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ కు పక్కాగా ముందే తెలిసింది. వెంటనే మహాత్మాగాంధీకి లేఖ రాశారు. ఆగస్టు 15 మన మొదటి స్వాతంత్య్రం దినోత్సవం అవుతుంది. మీరు కచ్చితంగా ఉండాలి. మీ ఆశీస్సులు అందించాలని కోరారు.

గాంధీ కూడా ఆ లేఖకు సమాధానం పంపారు. బెంగాల్ లోని హిందూ-ముస్లింలు మధ్య గొడవ జరుగుతుంది. వాళ్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ సమయంలో నేను సంబరాలు జరుపుకోలేను అని చెప్పారు. ఈ ఘర్షణలు ఆపేందుకు ప్రాణాలైనా ఇస్తానని లేఖ పంపారు.

Also Read: Independence Day quotes: స్వాతంత్య్ర సమరయోధుల స్పూర్తిదాయక సూక్తులు

జవహర్ లాల్ నెహ్రూ తన చారిత్రక ప్రసంగం ట్రిస్ట్ విత్ డెస్టినీని ఆగస్టు 14న అర్ధరాత్రి వైస్రాయ్ లాంజ్ నుంచి ఇచ్చారు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా విన్నది. కానీ.. మహాత్మా గాంధీ ఆరోజు 9 గంటలకే నిద్రపోయారు.

లార్డ్ మౌంట్‌బాటన్ 1947 ఆగస్టు 15న తన ఆఫీసులో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ ఆయనకు తన మంత్రిమండలి సభ్యుల జాబితాను ఇచ్చారు. తర్వాత ఇండియా గేట్ దగ్గర ప్రిన్సెస్ గార్డెన్‌లో బహిరంగ సభలో మాట్లాడారు.

Also Read: జయహో భారత్.. ఈ దేశభక్తి కోట్స్‌తో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి

మనకు తెలిసి.. ప్రతి స్వాతంత్య్రం దినోత్సవం రోజున భారత ప్రధాన మంత్రి ఎర్రకోటపై జెండా ఎగరేస్తారు. 1947 ఆగస్టు 15న మాత్రం అలా జరగలేదు. లోక్‌సభ సెక్రటేరియట్‌లోని పత్రాల ప్రకారం.. 1947 ఆగస్టు 16న నెహ్రూ ఎర్రకోటపై భారత జెండాను ఎగురవేశారు.
భారత అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ ప్రెస్ సెక్రటరీ కాంప్‌బెల్ జాన్సన్ వివరాల ప్రకారం మిత్ర దేశాల సేనల ముందు జపాన్ లొంగిపోయి, 1947 ఆగస్టుకు రెండేళ్లైన సందర్భంగా భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని నిర్ణయించారు.

ఆగస్టు 15 వరకూ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించలేదు. దానిని ఆగస్టు 17న రాడ్‌క్లిఫ్ లైన్‌గా ప్రకటించారు. ఆగస్టు 15న భారతదేశానికి విముక్తి లభించింది. అయినా.. దేశానికి అప్పటివరకూ జాతీయ గీతం అంటూ ఏదీ లేదు. జన గణ మణ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లోనే రాసి పెట్టారు. అది 1950లో జాతీయగీతం గౌరవాన్ని పొందినట్లు తెలుస్తోంది.

Also Read: Independence Day Special: కరోనా కారణంగా బయట అడుగు పెట్టే పరిస్థితి లేదంటారా…అయితే ఇంట్లోనే స్వాతంత్య్ర వేడుకలు చేసుకోండిలా


ఆగస్టు 15న భారత్‌తోపాటు మరో మూడు దేశాలు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటాయి. దక్షిణకొరియా జపాన్ నుంచి 1945 ఆగస్టు 15న స్వతంత్రం పొందింది. బహరీన్‌కు 1971 ఆగస్టు 15న బ్రిటన్ నుంచి విముక్తి దొరికింది. కాంగో 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం పొందింది.

Also Read: Independence Day: రండి.. అంతా కలిసి జాతీయ గీతం పాడదాం.. వాట్ యాన్ ఐడియా..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget