అన్వేషించండి

ఇకపై GPS ఆధారంగా టోల్ వసూళ్లు, త్వరలోనే అమల్లోకి - కేంద్రం కీలక ప్రకటన

Toll Collection: ఇకపై జీపీఎస్ ఆధారంగా టోల్ వసూలు చేసేలా కొత్త విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకురానుంది.

GPS Based Toll Collection: ఇకపై టోల్ ప్లాజాల వద్ద పెద్ద పెద్ద క్యూలు కనిపించకుండా చేసే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. టోల్‌ వసూలు చేసే విధానాన్ని మార్చనుంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయం వెల్లడించారు. GPS ఆధారిత టోల్‌ వసూలు విధానాన్ని త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న టోల్‌ ప్లాజా సిస్టమ్‌ స్థానంలో ఈ కొత్త సిస్టమ్ అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ మార్పులు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.  GPS-based toll collection system ని అమలు చేసేందుకు అవసరమైన కన్సల్టెంట్‌నీ ఇప్పటికీ నియమించింది. FASTags తో పాటు ఈ సిస్టమ్ కూడా కొనసాగుతుందని, ముందుగా పైలట్ ప్రాజెక్ట్‌లా చేపడతామని నితిన్ గడ్కరీ తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ఎంత దూరం ప్రయాణిస్తే అంత వరకే టోల్ వసూలు చేయాలనే లక్ష్యంతో ఈ కొత్త సిస్టమ్‌ని తీసుకురానుంది కేంద్రం. టోల్‌ వసూళ్ల ద్వారా ఎంత ఆదాయం వస్తోందో ఇప్పటికే లెక్కలు చెప్పారు గడ్కరీ. NHAIకి టోల్ వసూళ్ల ద్వారా రూ.40 వేల కోట్లు వచ్చాయని వెల్లడించారు. మరో రెండు మూడేళ్లలో ఈ ఆదాయం రూ.1.40 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. దేశంలోని టోల్‌ ప్లాజాల స్థానంలో GPS-based toll systems ని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఆరు నెలల్లో ఈ కొత్త టెక్నాలజీని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2018-19 మధ్య కాలంలో టోల్‌ ప్లాజాల వద్ద యావరేజ్ వెయిటింగ్ టైమ్ 8 నిముషాలుగా ఉంది. FASTags ని అమల్లోకి తీసుకొచ్చాక 2020-21, 2021-22 మధ్య కాలంలో ఈ వెయిటింగ్ టైమ్ 47 సెకన్లకు తగ్గింది. 2021లో ఈ ఫాస్టాగ్ అమల్లోకి వచ్చింది. 

హైవేలపై ప్రయాణించే వాహనదారులు ఫాస్టాగ్ ద్వారా టోల్ కట్టేలా కేంద్రం ఏర్పాటు చేసింది. ఫాస్టాగ్ లేకపోతే రెట్టింపు టోల్ వసూలు చేస్తోంది. అయితే...ఫాస్టాగ్‌లతో వెయిటింగ్ టైమ్ తగ్గినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల బిజీగానే ఉంటోంది. ఎక్కువ సమయం ఎదురు చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే..జీపీఎస్ ఆధారంగా టోల్ వసూలు చేయనుంది కేంద్రం. ఇందులో automatic number plate recognition (ANPR) సిస్టమ్ ఉంటుంది. హైవేస్‌పై ఉన్న కెమెరాల ద్వారా వీటిని డిటెక్ట్ చేస్తారు. ఎంత దూరం ప్రయాణించారనే దాన్ని బట్టి టోల్ వసూలు చేస్తారు. ప్రస్తుతం ఫాస్టాగ్‌లో RFID ఆధారంగా టోల్ వసూలు చేస్తున్నారు. టోల్‌ పరిధిలో ఓ వాహనం ఎక్కడ ఎంట్రీ ఇచ్చింది..? ఎక్కడ ఎగ్జిట్ అయింది..? ఎంత దూరం ప్రయాణించింది లాంటి వివరాలన్నీ నంబర్ ప్లేట్‌ని స్కాన్ చేసి తెలుసుకుంటారు. వాటి ఆధారంగానే వసూలు చేస్తారు. చిన్న చిన్న దూరాలకూ ఎక్కువ మొత్తంలో టోల్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఆ మేరకు భారం తగ్గినట్టే. electronic payment system ద్వారా ఆటోమెటిక్‌గా మనీ డెబిట్ అవుతుంది. ఫలితంగా ఎక్కువ సేపు టోల్‌ ప్లాజాల వద్ద ఎదురు చూడాల్సిన తిప్పలు తప్పుతాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget