అన్వేషించండి

ఇకపై GPS ఆధారంగా టోల్ వసూళ్లు, త్వరలోనే అమల్లోకి - కేంద్రం కీలక ప్రకటన

Toll Collection: ఇకపై జీపీఎస్ ఆధారంగా టోల్ వసూలు చేసేలా కొత్త విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకురానుంది.

GPS Based Toll Collection: ఇకపై టోల్ ప్లాజాల వద్ద పెద్ద పెద్ద క్యూలు కనిపించకుండా చేసే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. టోల్‌ వసూలు చేసే విధానాన్ని మార్చనుంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయం వెల్లడించారు. GPS ఆధారిత టోల్‌ వసూలు విధానాన్ని త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న టోల్‌ ప్లాజా సిస్టమ్‌ స్థానంలో ఈ కొత్త సిస్టమ్ అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ మార్పులు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.  GPS-based toll collection system ని అమలు చేసేందుకు అవసరమైన కన్సల్టెంట్‌నీ ఇప్పటికీ నియమించింది. FASTags తో పాటు ఈ సిస్టమ్ కూడా కొనసాగుతుందని, ముందుగా పైలట్ ప్రాజెక్ట్‌లా చేపడతామని నితిన్ గడ్కరీ తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ఎంత దూరం ప్రయాణిస్తే అంత వరకే టోల్ వసూలు చేయాలనే లక్ష్యంతో ఈ కొత్త సిస్టమ్‌ని తీసుకురానుంది కేంద్రం. టోల్‌ వసూళ్ల ద్వారా ఎంత ఆదాయం వస్తోందో ఇప్పటికే లెక్కలు చెప్పారు గడ్కరీ. NHAIకి టోల్ వసూళ్ల ద్వారా రూ.40 వేల కోట్లు వచ్చాయని వెల్లడించారు. మరో రెండు మూడేళ్లలో ఈ ఆదాయం రూ.1.40 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. దేశంలోని టోల్‌ ప్లాజాల స్థానంలో GPS-based toll systems ని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఆరు నెలల్లో ఈ కొత్త టెక్నాలజీని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2018-19 మధ్య కాలంలో టోల్‌ ప్లాజాల వద్ద యావరేజ్ వెయిటింగ్ టైమ్ 8 నిముషాలుగా ఉంది. FASTags ని అమల్లోకి తీసుకొచ్చాక 2020-21, 2021-22 మధ్య కాలంలో ఈ వెయిటింగ్ టైమ్ 47 సెకన్లకు తగ్గింది. 2021లో ఈ ఫాస్టాగ్ అమల్లోకి వచ్చింది. 

హైవేలపై ప్రయాణించే వాహనదారులు ఫాస్టాగ్ ద్వారా టోల్ కట్టేలా కేంద్రం ఏర్పాటు చేసింది. ఫాస్టాగ్ లేకపోతే రెట్టింపు టోల్ వసూలు చేస్తోంది. అయితే...ఫాస్టాగ్‌లతో వెయిటింగ్ టైమ్ తగ్గినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల బిజీగానే ఉంటోంది. ఎక్కువ సమయం ఎదురు చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే..జీపీఎస్ ఆధారంగా టోల్ వసూలు చేయనుంది కేంద్రం. ఇందులో automatic number plate recognition (ANPR) సిస్టమ్ ఉంటుంది. హైవేస్‌పై ఉన్న కెమెరాల ద్వారా వీటిని డిటెక్ట్ చేస్తారు. ఎంత దూరం ప్రయాణించారనే దాన్ని బట్టి టోల్ వసూలు చేస్తారు. ప్రస్తుతం ఫాస్టాగ్‌లో RFID ఆధారంగా టోల్ వసూలు చేస్తున్నారు. టోల్‌ పరిధిలో ఓ వాహనం ఎక్కడ ఎంట్రీ ఇచ్చింది..? ఎక్కడ ఎగ్జిట్ అయింది..? ఎంత దూరం ప్రయాణించింది లాంటి వివరాలన్నీ నంబర్ ప్లేట్‌ని స్కాన్ చేసి తెలుసుకుంటారు. వాటి ఆధారంగానే వసూలు చేస్తారు. చిన్న చిన్న దూరాలకూ ఎక్కువ మొత్తంలో టోల్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఆ మేరకు భారం తగ్గినట్టే. electronic payment system ద్వారా ఆటోమెటిక్‌గా మనీ డెబిట్ అవుతుంది. ఫలితంగా ఎక్కువ సేపు టోల్‌ ప్లాజాల వద్ద ఎదురు చూడాల్సిన తిప్పలు తప్పుతాయి. 

టాప్ హెడ్ లైన్స్

Noida Mamura Village Fire: చార్జింగ్‌లో పేలిన ఎలక్ట్రిక్ బైక్ - ఐదు అంతస్తుల భవనం బుగ్గి - భారీ ప్రాణనష్టం
చార్జింగ్‌లో పేలిన ఎలక్ట్రిక్ బైక్ - ఐదు అంతస్తుల భవనం బుగ్గి - భారీ ప్రాణనష్టం
Breaking News: ఎలక్ట్రిక్ స్కూటిలో మంటలు! నొయిడాలోని బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం! ఇద్దరు మృతి!
ఎలక్ట్రిక్ స్కూటిలో మంటలు! నొయిడాలోని బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం! ఇద్దరు మృతి!
2027 ODI World Cup Plan: వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
FIFA World Cup ENG VS ARG Semis: ఆర్జెంటీనాతో సెమీస్ కు ముందు ఇంగ్లాండ్ కి గుడ్ న్యూస్.. డెక్లాన్ రైస్ కంబ్యాక్ తో పటిష్టంగా ఇంగ్లీష్ టీమ్.. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆస‌క్తిక‌ర పోరు
ఆర్జెంటీనాతో సెమీస్ కు ముందు ఇంగ్లాండ్ కి గుడ్ న్యూస్.. డెక్లాన్ రైస్ కంబ్యాక్ తో పటిష్టంగా ఇంగ్లీష్ టీమ్.. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆస‌క్తిక‌ర పోరు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
Varanasi Update : స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
Pallichattambi OTT : పళ్లిచట్టంబి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
పళ్లిచట్టంబి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
2027 ODI World Cup Plan: వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
Posani Krishna Murali : మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Eesha OTT : మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 నెలల తర్వాత స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 నెలల తర్వాత స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Embed widget