అన్వేషించండి

KTR : ఒకే తప్పును మళ్లీ చేయవద్దు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Telangana News: తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మి తీవ్రంగా నష్టపోయారని, రాష్ట్రం ఇప్పుడు చిప్ప చేతికి తీసుకున్నట్లుగా తయారైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

Revanth Reddy :  తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి వంటి మోసగాడిని నమ్మి తీవ్రంగా నష్టపోయారని, రాష్ట్రం ఇప్పుడు చిప్ప చేతికి తీసుకున్నట్లుగా తయారైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అబద్ధపు హామీలతో ప్రజల జీవితాలు ఛిద్రం 
రేవంత్ రెడ్డి ఇచ్చిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ హామీలు ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఒక్కసారి మోసపోతే మోసగాడి తప్పు, కానీ మళ్లీ మళ్లీ మోసపోతే అది మన తప్పే. ఈసారి ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను ఓడించాలి" అని ప్రజలను హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలు కష్టాల్లో కూరుకుపోయారని, హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు.

జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు 
"ఒకే తప్పును మళ్లీ చేయకండి. జీహెచ్‌ఎంసీతో పాటు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తరిమికొట్టండి" అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం చీకటిలోకి వెళ్తున్నా, రేవంత్ రెడ్డి మాత్రం ఆనందంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. "రేవంత్ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వారి వైఫల్య పాలన" అని ఆయన నిప్పులు చెరిగారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

రాజశేఖర్ రెడ్డి కృషిని కొనియాడిన కేటీఆర్ 
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని కేటీఆర్ ప్రశంసించారు. "డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే మార్పు సాధ్యమని ఆయన నిరూపించారు" అని కేటీఆర్ పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను పరిష్కరించడానికి శ్రమిస్తున్నారని తెలిపారు.

కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఇదే 
"ఏ ఎన్నికైనా, ఏ సందర్భమైనా, ఈసారి కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే" అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును కాపాడాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు ఘనంగా పిలుపు 
పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. "ఈ నెల 27న పార్టీ 25 ఏళ్ల ప్రయాణాన్ని ఘనంగా జరుపుకుందాం. ఇది తెలుగు రాష్ట్రాల్లో రెండో ఘనత సాధించిన పార్టీగా మన గర్వం" అని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ సభకు ముందు భారీ ర్యాలీ జరిగింది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

టాప్ హెడ్ లైన్స్

Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget