అన్వేషించండి

AB Venakateswara Rao on Jagan: జగన్‌ నెవర్‌ ఎగైన్‌.. ఇదే నా నినాదం, పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఫిక్స్ - ఇంటిలెజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు

జ‌గ‌న్ గ‌త అయిదేళ్ల పాల‌న‌లో విధ్వంసం సృష్టించాడ‌ని, జ‌గ‌న్ మ‌ళ్లీ రాకూడ‌ద‌ని ఏపీ మాజీ ఇంటిలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు అన్నారు. అందుకే జ‌గ‌న్ నెవ‌ర్ ఎగైన్ అనే నినాదంతో ముందుకు వెళ్తాన‌న్నారు.

అమలాపురం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజావ్యతిరేక విధానాలు వల్ల అనేక వ్యవస్థలు, ఎంతో మంది తీవ్రంగా నష్టపోయారని అందుకే ఇకపై జగన్‌ నెవర్‌ ఎగైన్‌ అన్న తన నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు ఏపీ ఇంటిలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. అమలాపురం ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన అంశాలు ప్రస్తావించారు. జగన్‌ మళ్లీ వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతోందన్నారు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెంకటేశ్వరరావు ప్రకటించారు. తన జీవితంలో కాళ్లు, చేతులు ఆడినంత వరకు సమాజంకోసం పనిచేస్తానని తన రిటైర్మెంట్‌ పంక్షన్‌లో చెప్పానని, అదే కొనసాగిస్తానన్నారు. రాజకీయాల్లోకి రావడం వెనుక ప్రజల మెరుగైన భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తానన్నారు.

జగన్‌ పారీ విధ్వంసం సృష్టించింది..

గత అయిదేళ్లపాలనలో జగన్‌ పార్టీ విధ్వంసం సృష్టించిందని మాజీ ఏపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రం కోలుకోలేని దెబ్బతిన్నాడని, ఆర్దీక సామాజిక విధ్వంసం కొనసాగిందన్నారు. వైసీపీ వాళ్లకు సంఘంలో ఏమాత్రం గౌరవం లేదన్నారు. జగన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ రాకూడదని, ప్రజల అయిదేళ్ల ఎంతో పోగొట్టుకున్నారన్నారు. రాజకీయాలు అంటే కేవలం సంపాదన అనుకనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జగన్‌ అంటూ విమర్శించారు. జగన్‌ ఒక మోనాస్టార్‌ అంటూ అక్రమాలు చేసే వారికి ఆయన పెద్దపీట వేశారని తెలిపారు. కులాలు, వర్గాలుగా ప్రజలను విడదీశాడని, కేవలం తన స్వార్ధం కోసం బలిపెడతాడని ఇంతటి విపరీత మనస్తత్వం కలిగిన జనగ్‌ను ఆయన వెంట ఉన్న నేతలు వీడాలని సూచించారు. తను ప్రస్తుతం ఏపార్టీలోనూ లేనని, అలా అని పార్టీ పెట్టే ఆలోచన కూడా లేదన్నారు.

కోడికత్తి శ్రీనుకు అన్యాయం జరుగుతోంది..

జనుపల్లి శ్రీనివాసరావు అలియాస్‌ కోడికత్తి శ్రీను జగన్‌ వీరాభిమాని అని, అయితే ఆయన కోసం బలి అయిన మొదటి వ్యక్తి కోడికత్తి శ్రీను అని అన్నారు. జగన్‌ అధికారంలో వచ్చేందుకు సానుభూతికోసమే ఆయనపై దాడికి పాల్పడినట్లు శ్రీను విచారణలో తెలిపాడని, అయితే 5 సంవత్సరాలు జైలులో పెట్టించి అతని జీవితాన్ని నాశనం చేశాడని, ఇప్పటికీ కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నాడన్నారు. కోర్టుకు హాజరు కాకుండా, సాక్షం చెప్పకుండా కేసును నీరుగార్చే యత్నం జగన్‌ చేస్తున్నాడన్నారు. కోడికత్తి శ్రీనుకు న్యాయస్థానంలో కూడా అన్యాయం జరుగుతోందన్నారు.  కోడికత్తి శ్రీనుకు తన వంతు సహకారాన్ని అందిస్తానన్నారు. తన అనుభవంతో నిలబెడతానని, జగన్‌ బాధితులకు అండగా ఉండడంతోపాటు జగన్‌ అక్రమాలు, అన్యాయాలు బట్టబయలు చేస్తానన్నారు.

జగన్‌ ఆస్తులన్నీ అక్రమమే..

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సహకారంతో రూ.25 కోట్లతో మొదలు అయిన సండూర్‌ పవర్‌ ప్రాజెక్టు నెడు రూ.759 కోట్లకు చేరిందని, ఆతరువాత సాక్షి ఛానెల్‌, భారతి సిమెంట్స్‌ ఇంకా అనేక అక్రమ కంపెనీలకు పెట్టుబడులు ఇప్పటికే బయటపడ్డాయని, మరిన్ని అక్రమాలు బట్టబయలవుతాయన్నారు. అయితే దీంట్లో తన ప్రయత్నాలకు అంతా సహకరించాలన్నారు. కోకొల్లలుగా ఉన్న జగన్‌ కేసులపై పోరాడతానన్నారు. జగన్‌ తనకు వ్యక్తిగతంగా నష్టం చేశాడు.. ఆ అకౌంట్‌ క్లోజ్‌ అయ్యింది.. జగన్‌పై పోరాడే విషయంలో వ్యక్తిగతం ఏమీ లేదని, జగన్‌ సమాజానికి చేసిన కీడుపై మాత్రమే పోరాటం చేస్తానన్నారు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget