అన్వేషించండి

TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

మొయినాబాద్‌లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్

మొయినాబాద్: హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ టెస్టులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ (ఏలూరు)తో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా మొత్తం ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నమిత్‌, రితేష్ రెడ్డి, కౌశిక్‌ రవి, అర్జున్‌రెడ్డిలకు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌గా తేలింది. డ్రగ్స్ టెస్టులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు నెగటివ్ రాగా, బ్లడ్ టెస్టు చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో డ్రగ్ టెస్టులో మొత్తం ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని ప్రకటించారు.

ఈగల్ (EAGLE) ఫోర్స్ నిర్వహించిన మెరుపు దాడుల్లో నిందితులు తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పోలీసులను భయపెట్టే ప్రయత్నం చేశారని తెలిపారు. ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీపై దాడులకు సంబంధించి ఈగల్ ఫోర్స్ ఎస్పీ ఆర్. గిరిధర్ మీడియాకు వివరాలను వెల్లడించారు.


TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

"డ్రగ్స్ పార్టీ జరగుతుందని సమాచారం మేరకు మేం రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌పై దాడి చేశాము. లోపలికి ప్రవేశించిన సమయంలో మా అధికారులకు కొన్ని శబ్దాలు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడికి చేరుకోగా, ఒక వ్యక్తి పిస్టల్ పట్టుకుని కనిపించాడు. మరొకరి వద్ద ఖాళీ తూటాలు ఉన్నాయి. వెంటనే అక్కడ ఉన్న 11 మందిని అదుపులోకి తీసుకున్నాం. వారికి నిర్వహించిన ప్రాథమిక డ్రగ్ టెస్టులో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ఆసుపత్రిలో నిర్వహించిన రక్త నమూనాల పరీక్షల్లో మరో వ్యక్తి (టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్)కి కూడా పాజిటివ్ రావడంతో, మొత్తం ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది" అని ఈగల్ ఫోర్స్ ఎస్సీ గిరిధర్ తెలిపారు.

ముఖ్య నేతలు అరెస్ట్ 
పోలీసులు అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తొలుత పుట్టా మహేష్ యాదవ్‌కు నెగిటివ్ వచ్చినట్లు ప్రచారం జరిగినప్పటికీ, రక్త నమూనాల (Blood Sample) నివేదికలో ఆయనకు డ్రగ్స్ పాజిటివ్ అని తేలిందని ఎస్పీ గిరిధర్ స్పష్టం చేశారు. 


TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

పోలీసులపై కాల్పులు జరిపారు.. చేవెళ్ల డిసిపి యోగేష్ గౌతమ్
మొయినాబాద్: అనుమతి లేకుండా ఒక ఫామ్‌హౌస్‌లో పార్టీ జరుగుతుందనే సమాచారంతో పోలీసులు శనివారం రాత్రి 9:30 గంటలకు రోహిత్ రెడ్డి ఫాం హౌస్‌కు వెళ్లి ఆకస్మిక దాడలు నిర్వహించారని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ‘పోలీసులు అక్కడికి చేరుకోగానే, ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ గన్‌తో ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డికి చెందిన ఆ తుపాకీకి లైసెన్స్ ఉంది.  అయితే, కాల్పులు జరిపింది మాత్రం నమిత్ శర్మ. 

పార్టీలో 2 గ్రాముల తెల్లటి పొడి (డ్రగ్స్) కూడా పోలీసులకు లభ్యమైంది. అక్కడ ఒక మహిళ సహా మొత్తం 10 మంది ఉన్నారు. వారిలో ప్రజా ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. ఆ 10 మందిలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, రితేష్ రెడ్డి, శ్రవణ్ కుమార్,  నమిత్ మిశ్రా, ఎం. రమేష్, విజయ్ కృష్ణ, రవి, అర్జున్ రెడ్డి ఉన్నారు. వీరిలో ఐదుగురు రోహిత్ రెడ్డి, నమిత్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి,  అర్జున్ రెడ్డిలకు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. తదుపరి విచారణ నిమిత్తం వారందరినీ అదనపు శాంపిల్ పరీక్షలకు పంపాం. పూర్తి నివేదికలు వచ్చాక చట్టపరమైన చర్యలు ఉంటాయని’ చేవెళ్ల డిసిపి యోగేష్ గౌతమ్ పేర్కొన్నారు.

కేసులో ముఖ్యాంశాలు..

మొత్తం అరెస్టులు: 11 మంది కస్టడీలో ఉండగా, ఆరుగురికి డ్రగ్ పాజిటివ్.

కాల్పుల కలకలం: పోలీసులను అడ్డుకునేందుకు ఒక వ్యక్తి పిస్టల్‌తో గాలిలోకి కాల్పులు జరిపారు.

రికవరీ: ఫామ్‌హౌస్ నుండి పిస్టల్, ఖాళీ తూటాలు, డ్రగ్స్ స్వాధీనం.

నిందితులను వైద్య పరీక్షల అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు. వారిని నేడు కోర్టులో హాజరుపరచనున్నారు.ఈ దాడిలో పట్టుబడిన వారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక రాజకీయ నేతలు కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

TDP SC Cell Leader Wife Assault Complaint:ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget