అన్వేషించండి

AP High Court: ఏపీ పరిషత్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు అనుమతిస్తూ.. హైకోర్టు తీర్పు వెలువరించింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు అనుమతిస్తూ.. హైకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు వెల్లడించింది.  ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 8న జరిగిన పరిషత్ ఎన్నికల నిర్వహణలో నిబంధనలు పాటించలేదని.. ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి మే 21వ తేదీన తీర్పు వెలువరించిన విషయం విదితమే. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎస్‌ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు హైకోర్టులో అప్పీళ్లు వేశారు. వీటిపై ఆగస్టు 5న విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. 

ఏం జరిగిందంటే?
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఏప్రిల్ 1న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ఆధారంగా పరిషత్ ఎన్నికలు జరిగాయి. పరిషత్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ జడ్జి.. ఈ ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు మే 21న కీలక తీర్పు ఇచ్చారు. పోలింగ్ నిర్వహణ తేదీకి సరిగ్గా నాలుగు వారాల ముందు కోడ్ విధించాలని సుప్రీంకోర్టు సూచించిందని.. ఈ ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉందని పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే తిరిగి నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. దీని కోసం కొత్తగా మరో నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఈసారి ఎన్నికలను సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి నిర్వహించాలని స్పష్టం చేసింది. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు తిరిగి ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించాలని ఆదేశాల్లో తెలిపింది.

తీర్పును సవాల్ చేసిన ఎన్నికల సంఘం..
ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఎన్నికల కోసం దాదాపు రూ.165 కోట్లు ఖర్చు చేశామని, బ్యాలెట్ బాక్సుల నిర్వహణ భారమవుతుందని ఎస్​ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. 4 వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలనే నిబంధన లేదని పేర్కొన్నారు. దీనిపై ఆగస్టు 3న విచారణ ముగించిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. తాజాగా తన తీర్పును వెలువరించింది.

Also Read: MPTC ZPTC Elections : ఎన్నో వివాదాలు.. పిటిషన్లు ! ఇక పరిషత్ ఎన్నికల వివాదం సుప్రీంకోర్టుకు చేరుతుందా..? 

Also Read: Saidabad Case: సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య!... ఘట్ కేసర్ -వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహం గుర్తింపు

టాప్ హెడ్ లైన్స్

Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Manav Suthar Test Debut: అఫ్గాన్ తో మ్యాచ్ లో డెబ్యూ చేసిన మానవ్ సుతార్ ఎవరు?: ప్లేయింగ్ ఎలెవెన్ లోకి గుజరాత్ టైటాన్స్ స్టార్.. 15 ఏళ్ల తర్వాత అశ్విన్, జడేజా లేకుండానే బరిలోకి..
అఫ్గాన్ తో మ్యాచ్ లో డెబ్యూ చేసిన మానవ్ సుతార్ ఎవరు?: ప్లేయింగ్ ఎలెవెన్ లోకి గుజరాత్ టైటాన్స్ స్టార్.. 15 ఏళ్ల తర్వాత అశ్విన్, జడేజా లేకుండానే బరిలోకి..
Annamalai Real Name: అన్నామలైకు రజనీకాంత్ భాషాకు ఉన్నంత ఫ్లాష్ బ్యాక్ ఉంది - ఆయన అసలు పేరు శివ సెంథిల్ కుమార్ - ఇదిగో ఫుల్ స్టోరీ
అన్నామలైకు రజనీకాంత్ భాషాకు ఉన్నంత ఫ్లాష్ బ్యాక్ ఉంది - ఆయన అసలు పేరు శివ సెంథిల్ కుమార్ - ఇదిగో ఫుల్ స్టోరీ
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget