అన్వేషించండి

Saidabad Case: సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య... ఘట్ కేసర్ -వరంగల్ రైల్వే ట్రాక్ పై మృతదేహం గుర్తింపు

సైదాబాద్ బాలిక అత్యాచార నిందితుడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘట్ కేసర్ -వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని గుర్తించారు.

 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ బాలిక అత్యాచార, హత్య కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, అత్యంత దారుణంగా హత్య చేసిన తప్పించుకు తిరిగిన రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్ కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.  సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి అత్యాచార, హత్య ఘటనలో  నిందితుడైన రాజు మృతదేహంగా పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు. తెలంగాణ డీజీపీ మహేంద్ర రెడ్డి ఈ విషయాన్ని ట్విట్టర్ ఖాతా ద్వారా ధ్రువీకరించారు.  


Saidabad Case: సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య... ఘట్ కేసర్ -వరంగల్ రైల్వే ట్రాక్ పై మృతదేహం గుర్తింపు

కేటీఆర్ ట్వీట్ 

సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన మానవ మృగం రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. డీజీపీ మహేంద్రరెడ్డి ఈ విషయాన్ని నిర్థారణ చేశారని ఆయన తెలిపారు. 

 

డీజీపీ ధ్రువీకరణ 

నిందితుడు రాజు చేతిపై మౌనిక అనే టాటూ ఆధారంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి ఫొటోలను డీజీపీ తెలంగాణ పోలీసు ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 

పోలీసుల తనిఖీలు

అంతకు ముందు సైదాబాద్ బాలిక అత్యాచార నిందితుడి కోసం పోలీసుల ముమ్మర గాలింపు చేపట్టారు. ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజ్‌ పరిశీలిస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద మఫ్టీలో నిఘా పెట్టారు. చివరగా ఉప్పల్‌లో రాజు కనిపించినట్లు తెలుస్తోంది.  నిందితుడిని త్వరగా పట్టుకోవాలని హోంమంత్రి, డీజీపీ ఆదేశాలు ఇచ్చారు.  ఆంధ్రా-తెలంగాణ బోర్డర్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 

ప్రత్యక్ష సాక్షులు

నిందితుడు రాజు ఆత్మహత్యకు సంబంధించి ప్రత్యక్షసాక్షులైన ఇద్దరు రైల్వే కీమెన్లు పూర్తి వివరాలను అందించారు. వాళ్లద్దరూ ఉదయాన్నే డ్యూటీకి వచ్చామని, ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి పొదల్లోకి పారిపోయాడని చెప్పారు. అనుమానం వచ్చి చెట్లలోకి వెళ్లి చూడగా అతను కనిపించలేదని తెలిపారు. ఆ తర్వాత వారు ఒక 200 మీటర్ల దూరం వరకు ట్రాక్ పై నడుచకుంటూ వచ్చామని, ఆ సమయంలో హైదారాబాద్ వైపుగా వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ కు ఎదురుగా వెళ్లి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. అనంతరం దగ్గరకు వెళ్లి పరిశీలించగా సైదాబాద్ నిందితుడు రాజు అనే అనుమానం తమకు వచ్చిందన్నారు. ఆ తర్వాత 100కు డయల్ చేసి సమాచారం అందజేశామని తెలిపారు. ఉదయం 8.40 గంటలకు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. మరోవైపు రాజు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తున్నారు.

Also Read: Saidabad Girl Case: సైదాబాద్ చిన్నారి కుటుంబానికి మంత్రుల పరామర్శ...రూ. 20 లక్షల పరిహారాన్ని తిరస్కరించిన బాధిత కుటుంబం... వైఎస్ షర్మిల దీక్ష భగ్నం

Also Read: Telangana Nirbhaya : సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన చుట్టూ రాజకీయం! న్యాయం ఎలా చేస్తారు ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Suriya 46 Movie : ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
Cheapest Automatic Cars India: ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం

వీడియోలు

World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్
India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Suriya 46 Movie : ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
Cheapest Automatic Cars India: ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Cinnamon Water : 2026లో బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే దాల్చినచెక్క నీరు తాగేయండి
2026లో బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే దాల్చినచెక్క నీరు తాగేయండి
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Embed widget