అన్వేషించండి

Ratha Saptami 2025 In Arasavalli: రథసప్తమి కోసం శ్రీకాకుళంలోని అరసవల్లిలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రవాణా, బస సౌకర్యాల సంగతేంటి?

Arasavalli News: దేశంలోని నిత్యం పూజలు అందుకుంటున్న ఏకైక దేవాలయం సూర్యనారాయణ స్వామి దేవాలయం రథసప్తమి పండగను మూడు రోజులుగా చేయాలని నిర్ణయించారు. దీని కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

Ratha Saptami 2025 In Arasavalli: వెలుగుల రేడు వేడుకకు అరసవల్లి సన్నద్ధమైంది. ఆ భాస్కరుడి సన్నిధి ముస్తాబైంది. దేశ వ్యాప్తంగా కేవలం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యదేవాలయంలో కలియుగ ప్రత్యేక దైవంసూర్యభగవానుడు నిత్యం పూజలందుకుంటున్నారు. ఒడిశాలో కొణార్క్ దేవాలయం ఉండగా ఆ దేవాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆలయ ప్రవేశాన్ని మూసివేశారు. అక్కడి ఆలయం పర్యాటకులను కనువిందుచేయడానికి పరిమితమైంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దేవాలయంలో మాత్రం నిరంతరం స్వామివారిని దర్శించుకోవడానికి దోహాదపడుతుంది. దేవేంద్రుడి చేతుల మీదుగా ఈ ఆలయం ప్రతిష్ఠితమైందని ప్రజల విశ్వాసం.  సమస్త జనాలకు ఆయురారోగ్యాలను ప్రసాదించే సూర్యభగవానుడి జయంతి రోజున నిజరూప దర్శనానికి భక్తులు క్యూ కట్టడం ఆనవాయితీ. నిత్యం పూజలందుకుంటున్న అరసవల్లిలోని ఆదిత్యుడిని చూసేందుకు  లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు. 

Ratha Saptami 2025 In Arasavalli: రథసప్తమి కోసం శ్రీకాకుళంలోని అరసవల్లిలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రవాణా, బస సౌకర్యాల సంగతేంటి?

ప్రత్యక్ష దైవంగా భక్తుల కోర్కెలు తీర్చే ఈ ఆలయంలోని విగ్రహాన్ని ద్వాపర యుగాంతంలో దేవేంద్రుడు ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆలయం అభివృద్ధికి క్రీ.శ.682లో దేవేంద్రవర్మ అనే రాజు భూములిచ్చినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. అరసవల్లి సూర్యదేవాలయం విశిష్టతపై పరిశీలిస్తే ఏడు అశ్వాలతో కూడిన రథంపై దేదీప్యమానంగా మూలవిరాట్‌ భక్తులకు దర్శనమిస్తుంటాడు. 

అరుణశిలతో చేసిన స్వామి వారి ఉత్సవ విగ్రహం భక్తలకు కనువిందు చేస్తుంది. స్వామివారి రెండు హస్తాల్లోని తామర పద్మాలు అబ్బురపరుస్తాయి. కఠారి అనే చురిక(కత్తి) నడుము వద్ద ఆయుధంగా ధరిస్తారు. ఆలయానికి భువనేశ్వరిదేవి సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తారని పురాణాలు చెబుతున్నాయి.  

Also Read: అడవి బిడ్డల సంబురానికి వేళాయె - అట్టహాసంగా ఆదివాసీ నాగోబా జాతర ప్రారంభం, ఆచారం వెనుక కథ ఇదే!

అంతటి మహాప్రసిద్ధి చెందిన స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలి రానున్నారు. ఫిబ్రవరి నాలుగు నాడు జరిగే జయంతి వేడుకులకు అరసవల్లి అందంగా ముస్తాబైంది. స్వామి నిజరూపాన్ని కనులారా తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శించుకోవాలంటే ఎలా రావాలి? 
అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం శ్రీకాకుళం నగరం మధ్యలో ఉంటుంది. విశాఖపట్నం నుంచి 106 కిలోమీటర్ల దూరంలో ఉందీ అరసవల్లి దేవస్థానం. ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్‌ దిగిదే ఆటో కానీ క్యాబ్‌లో కానీ వెళ్ళవచ్చు. రైలు మార్గంగా రావాలి అనుకుంటే ఆమదాలవలస రైల్వే స్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది. ఆమదాలవలస నుంచి అరసవల్లికి 14 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. 

సుదూర ప్రాంతాల నుంచి అరసవల్లి దేవస్థానానికి వచ్చే వాళ్ల కోసం చుట్టుపక్కల హోటల్స్ ఉంటాయి. అక్కడ ఇష్టం లేని వాళ్లు దగ్గర్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ హోటల్ ఒకటి ఉంది. అక్కడైనా బస చేయవచ్చు. 

Ratha Saptami 2025 In Arasavalli: రథసప్తమి కోసం శ్రీకాకుళంలోని అరసవల్లిలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రవాణా, బస సౌకర్యాల సంగతేంటి?

రథసప్తమికి ఏ ఏ ప్రాంతం నుంచి ప్రజలు వస్తారు..
దేశంలోని నిత్యం పూజలు అందుకుంటున్న ఈ దేవాలయానికి ఒక్క ఆంధ్రప్రదేశ్‌ నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి సూర్యనారాయణ స్వామిని దర్శించుకొని వెళ్తారు. ఇలా వచ్చే వాళ్లు ముందుగానే హోటల్స్‌ బుక్ చేసుకుంటారు. మరి కొంతమంది తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటారు. వీఐపీలు విశాఖపట్నం  వచ్చి అక్కడ బస చేసి ఉదయాన్నే బయలుదేరి అరసవిల్లి చేరుకుంటారు. రథసప్తమి రోజు సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటే మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. 

Also Read: శ్రీ శంబర పోలమాంబ జాతర 2025 - సిరిమానోత్సవం గురించి ఈ విషయాలు తెలుసా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.