అన్వేషించండి

Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?

SSMB29: రాజమౌళి, మహేశ్‌బాబు లేటెస్ట్ మూవీ 'SSMB29' (వర్కింగ్ టైటిల్). ఈ మూవీలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. ఇటీవల సోదరుని పెళ్లి కోసం ముంబై వెళ్లిన ఆమె తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

Priyanka Chopra Arrives In Hyderabad For SSMB29 Shooting: దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబోలో 'SSMB29' వర్కింగ్ టైటిల్‌తో మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఇటీవల తన సోదరుడి పెళ్లి కోసం ముంబై వెళ్లిన ప్రియాంక తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. మూవీ షూట్ కోసం తిరిగి హైదరాబాద్ వచ్చినట్లు తన ఇన్ స్టా హ్యాండిల్‌లో అభిమానులతో పంచుకున్నారు. ప్రియాంక సోదరుడు సిద్దార్థ్ చోప్రా, నీలం ఉపాధ్యాయల వివాహం ఈ నెల 7న జరగ్గా.. ప్రియాంక చోప్రా ఈ నెల 2వ తేదీనే ముంబై చేరుకున్నారు. పెళ్లి సందడి ముగిసిన అనంతరం తిరిగి 'SSMB29' మూవీ షూట్ కోసం తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pinkvilla (@pinkvilla)

నో లీక్స్.. అన్నీ ఊహాగానాలేనా..

ఈ ప్రాజెక్టు కోసం ఎలాంటి లీక్స్ లేకుండా జక్కన్న జాగ్రత్త పడుతున్నారు. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీని హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పలు అప్ డేట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో మహేశ్ న్యూ లుక్‌లో కనిపించనున్నారు. మహేశ్, ప్రియాంక చోప్రా మినహా సినిమా నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. అన్నీ ఊహాగానాలు, క్రేజీ న్యూస్ అంటూ నెట్టింట చక్కర్లు కొడుతున్నవి మాత్రమే ఉన్నాయి. ప్రియాంక రోల్‌కు సంబంధించిన ఓ న్యూస్ సైతం ఇటీవల నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ అడ్వెంచర్ మూవీలో హీరోతో పాటు ప్రియాంక పాత్రకు సైతం అత్యంత ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. లేడీ విలన్‌గా నెగిటివ్ రోల్‌లో ఆమె కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఆమె రోల్‌ను దర్శక ధీరుడు రూపుదిద్దుతున్నారని సమాచారం. 

Also Read: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?

షూటింగ్‌లో నో వాటర్ బాటిల్స్

ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాజమౌళి స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేస్తున్నారు. లీక్స్ పట్ల ఇప్పటికే మూవీ టీంకు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నటీనటులు సాంకేతిక నిపుణులతో నాన్ డిస్‌క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్లు కొన్ని ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీని ప్రకారం ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి విషయాన్ని బయటకు చెప్పడానికి వీల్లేదు. దర్శక నిర్మాతల నుంచి అనుమతి లేకుండా ఎవరైనా సమాచారం లీక్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. 

ఈ సినిమా ఖర్చుల విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. షూటింగ్‌లో రోజుకు దాదాపు 2 వేల మంది వరకూ పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సెట్‌లో ప్లాస్టిక్‌ను పూర్తిగా బ్యాన్ చేసినట్లు సమాచారం. మహేశ్‌బాబుతో సహా ప్రతి ఒక్కరూ ఈ రూల్ ఫాలో కావాల్సిందేనట. సెట్‌లో గాజు బాటిళ్లను ఏర్పాటు చేస్తున్నారట. పర్సనల్‌గా తెచ్చుకున్న ప్లాస్టిక్ బాటిల్ అయితే ఉండొద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Also Read: సాయిపల్లవికి ముద్దు పెట్టిన లేడీ ఫ్యాన్ - రజినీ 'భాషా' స్టైల్‌లో ఎలివేషన్స్ మామూలుగా లేదుగా..

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
Embed widget