అన్వేషించండి

Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!

ఢిల్లీ రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట జరిగి 18 మంది మరణించారు. దేశంలోని రైల్వేస్టేషన్లలో తొక్కిసలాట ఘటన ఇదే మొదటిది కాదు. చాలా చోట్ల తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో జనం ప్రాణాలు పోగొట్టుకున్నారు.

Stampedes At Railway Stations Of India: ఢిల్లీ రైల్వేస్టేషన్​లో శనివారం రాత్రి తొక్కిసలాట జరిగి 18 మంది మరణించారు. వీరిలో 14 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. రైల్వేస్టేషన్​లోని 14, 15 ప్లాట్‌ఫామ్​లపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పరిమితికి మించి జనం గుమిగూడడంతోనే తొక్కిసలాట జరిగింది. ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లే భక్తులు భారీ సంఖ్యలో రైల్వేస్టేషన్​కు చేరుకోగా.. అప్పటికే స్వతంత్ర సేనాని ఎక్స్​ప్రెస్​, భువనేశ్వర్​–రాజధాని ఎక్స్​ప్రెస్​ రైళ్లు ఆలస్యం కావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడి తొక్కిసలాట జరిగి జనాలు ప్రాణాలు కోల్పోయారు.

దేశంలోని రైల్వేస్టేషన్లలో తొక్కిసలాట ఘటన ఇదే మొదటిది కాదు. విపరీతమైన రద్దీ, అధికారుల వైఫల్యంతో గతంలో చాలా చోట్ల తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో జనం ప్రాణాలు పోగొట్టుకున్నారు. అనేక మంది గాయాలపాలయ్యారు. ఆ ఘటనలేంటో చూద్దాం రండి..

* బాంద్రా స్టేషన్​లో గతేడాది అక్టోబర్​ 24న
మహారాష్ట్ర ముంబయిలోని బాంద్రా రైల్వేస్టేషన్​లో గతేడాది అక్టోబర్​ 24న తొక్కిసలాట జరిగి 10 మంది గాయపడ్డారు. దీపావళి, ఛత్ పండగల కోసం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు వెళ్లడానికి బాంద్రా–గోరఖ్‌పూర్ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కేందుకు ప్రయాణికులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది.

* ఎల్​ఫిన్​స్టోన్​ స్టేషన్​లో 22 మంది మృతి
2017 సెప్టెంబర్ 29న మహారాష్ట్ర ముంబయిలోని ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 22 మంది మరణించారు. 39 మంది గాయపడ్డారు. ఎల్ఫిన్‌స్టోన్, పరేల్ సబర్బన్ స్టేషన్‌లను కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగింది. ఆఫీస్​ వేళల్లో విపరీతమైన రద్దీ కారణంగా దుర్ఘటన జరిగింది.

* అలహాబాద్​ రైల్వేస్టేషన్​లో 36 మంది..
2013లో కుంభమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 36 మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. మౌని అమావాస్య స్నానం తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు అలహాబాద్ జంక్షన్‌కు లక్షన్నర  మందికి పైగా భక్తులు తరలిరావడంతో ప్లాట్‌ఫారమ్ నంబర్ 6లోని ఫుట్‌ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఈ సంఘటన జరిగింది.

* వారణాసిలో గంగాస్నానం ముగించుకుని వస్తూ..
2007 అక్టోబర్ 3న ఉత్తర ప్రదేశ్‌లోని మొఘల్‌సరాయ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కారణంగా 14 మంది మహిళలు మరణించారు. 40 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. జూతీయ వ్రతం సందర్భంగా వారణాసిలో గంగాస్నానం ముగించుకుని పెద్ద సంఖ్యలో ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఆ స్టేషన్‌కు ఇప్పుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌గా పేరు మార్చారు.

* ఫ్లాట్​ఫామ్​ మార్చడంతో పరిగెత్తుతూ..
2004 నవంబర్ 13న న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. ఛత్‌పూజ కోసం ఇళ్లకు వెళ్లాలనుకున్న ప్రయాణికులు భారీ సంఖ్యలో బిహార్‌కు వెళ్లే రైలు కోసం ఓ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్నారు. అయితే అకస్మాత్తుగా రైలు వచ్చే ఫ్లాట్​ఫామ్​ మార్చడంతో ఆ రైలు ఎక్కేందుకు పరిగెడుతూ ఫుట్​ ఓవర్‌బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగింది. 

* లక్నో రైల్వేస్టేషన్​లో 16 మంది బీఎస్పీ కార్యకర్తలు మృతి
2002 సెప్టెంబరు 28 చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 16 మంది బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. బీఎస్పీ ర్యాలీ కోసం వేలాది మంది కార్మికులు లక్నో చేరుకోగా తొక్కిసలాట జరిగింది. ర్యాలీగా వెళుతున్న కార్యకర్తల్లో ఒకరు ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై పడటంతో.. అతడిని తొక్కివేయకుండా మరికొందరు రక్షించడానికి ప్రయత్నించడంతో గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళంలో తొక్కిసలాట జరిగింది. ఈ సమయంలో కొందరు సద్భావనా ​​ఎక్స్‌ప్రెస్ పైకి ఎక్కగా హై టెన్షన్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Weather In AP, Telangana: 125 ఏళ్లలోనే ఈ సమ్మర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు - హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం
125 ఏళ్లలోనే ఈ సమ్మర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు - హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం
Visakhapatnam: వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
Pushpa 2: 'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Weather In AP, Telangana: 125 ఏళ్లలోనే ఈ సమ్మర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు - హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం
125 ఏళ్లలోనే ఈ సమ్మర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు - హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం
Visakhapatnam: వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
Pushpa 2: 'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
SSC Exams: టెన్త్ విద్యార్థులకు అలర్ట్, ప్రీ ఫైనల్‌ పరీక్షల్లో 'మోడల్ ఓఎంఆర్‌' పత్రాలు
టెన్త్ విద్యార్థులకు అలర్ట్, ప్రీ ఫైనల్‌ పరీక్షల్లో 'మోడల్ ఓఎంఆర్‌' పత్రాలు
Low Credit Score: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? - మీ సిబిల్‌ మీటర్‌ పెంచే మ్యాటర్‌ ఇదిగో!
క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? - మీ సిబిల్‌ మీటర్‌ పెంచే మ్యాటర్‌ ఇదిగో!
Amritha Aiyer:  శారీ సింపిల్ గా ఉన్నప్పుడు బ్లౌజ్ డిజైన్ ఇలా ఉంటే అదిరిపోతుంది!
శారీ సింపిల్ గా ఉన్నప్పుడు బ్లౌజ్ డిజైన్ ఇలా ఉంటే అదిరిపోతుంది!
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
Embed widget