అన్వేషించండి

Kakinada News: ఎన్టీఆర్ అదుర్స్ కామెడీ సీన్స్ చూపిస్తూ రోగికి బ్రెయిన్ సర్జరీ - కాకినాడ డాక్టర్స్ అద్భుతం!

Brain Surgery in Kakinada: ఓ మహిళా రోగికి బ్రెయిన్ ట్యూమర్‌ను డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. మెదడులోని సున్నితమైన నాడులు దెబ్బతినకుండా సినిమా చూపిస్తూ ఈ సర్జరీ చేశారు.

Kakinada Brain Surgery: కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్లు ఓ పేషెంట్‌కు సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ చేశారు. ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా చూపిస్తూ రోగి తెలివిలో ఉండగానే ఈ సర్జరీని పూర్తి చేశారు. ఇలాంటి ప్రక్రియను అవేక్ క్రానియోటమీ అంటారు. ఒక మహిళా రోగికి ఇలా బ్రెయిన్ ట్యూమర్‌ను డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. సున్నితమైన నాడులు దెబ్బతినకుండా చేసిన ఈ సర్జరీ ఆస్పత్రిలో ఇదే తొలిసారి అని డాక్టర్లు చెబుతున్నారు.

తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన ఎ. అనంతలక్ష్మి అనే 55 ఏళ్ల రోగి తన కుడి చేయి, కుడి కాలు బలహీనతతో బాధ పడుతోంది. అనేక ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించగా.. చికిత్స ఖరీదైనది ఊరుకున్నారు. ఆమెకు తలనొప్పి, ఫిట్స్, బాడీ కుడి వైపున తిమ్మిరిగా ఉండడం కారణంగా సెప్టెంబర్ 11 న కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. దీంతో ఆమె మెదడుకు ఎడమవైపున 3.3 x 2.7 సెంటీ మీటర్ల కణితిని డాక్టర్లు గుర్తించారు.

మంగళవారం అనస్తీషియా డాక్టర్లు కొద్దిపాటి మత్తును అనంతలక్ష్మికి ఇచ్చి తెలివిలోనే ఉంచి సీనియర్ డాక్టర్లు శస్త్ర చికిత్స చేశారు. ఆమెకు సౌకర్యవంతంగా, పరధ్యానంలో ఉంచడానికి, డాక్టర్లు జూనియర్ ఎన్టీఆర్, బ్రహ్మానందం నటించిన అదుర్స్‌లోని ఆమెకు ఇష్టమైన కామెడీ సీన్లను చూపించారు. దీంతో రోగి ఆ చిత్రం చూస్తూ ఎంజాయ్ చేస్తుండగానే డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగింది. ఆ ర్వాత రోగి లేచి కూర్చుని అల్పాహారం కూడా తిన్నట్లుగా డాక్టర్లు చెప్పారు. 5 రోజుల్లో ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.

అవేక్ బ్రెయిన్ సర్జరీ అంటే ఏంటి?

రోగి మేల్కొని ఉండగానే మెదడు శస్త్రచికిత్స చేస్తారు. దీనిని అవేక్ క్రానియోటమీ అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా మెదడు కణితులు లేదా మూర్ఛ వంటి నాడీ సంబంధిత పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. దృష్టి, కదలిక సహా ఇతర అన్ని పనులకు కారణమైన మెదడులోని కీలక ప్రాంతాలను దెబ్బతీయకుండా వైద్య బృందానికి సహాయం చేయడానికి శస్త్రచికిత్స సమయంలో రోగి స్పృహలో ఉండాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో రోగి ప్రతిస్పందనలు చూసి.. సర్జన్ సరైన ప్రాంతానికి చికిత్స చేస్తున్నామా లేదా అని నిర్ధారించుకుంటాడు. 

అవేక్ క్రానియోటమీ ఎప్పుడు అవసరం ఉంటుంది?
కణితిని తొలగించేటప్పుడు అది మెదడులోని ఇతర సున్నిత ప్రాంతాలకు సమీపంలో ఉన్నప్పుడు ఈ పద్ధతిని వాడతారు. శస్త్రచికిత్స సమయంలో రోగితో కమ్యూనికేట్ చేయగలగడం వల్ల సర్జన్ ఈ కీలక ప్రాంతాలను గుర్తించి వాటి జోలికి పోకుండా అనవసరమైన భాగాన్ని తీసేయగలుగుతారు. ఈ విధానంలో రోగికి తేలికైన మత్తు ఇస్తారు. కానీ మెలకువగా ఉంటారు. సర్జన్ రోగిని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కొన్ని రకాల కదలికలు చేయమని కూడా అడగవచ్చు. తద్వారా ముఖ్యమైన మెదడు భాగాలకు ఎటువంటి నష్టం జరగకుండా చూడొచ్చు. ఇలా రియల్ టైంలో సర్జరీ చేయడం ప్రమాదాలను తగ్గిస్తుంది. మరియు ప్రభావిత ప్రాంతాన్ని ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకోవడంలో సర్జన్‌కి సహాయపడుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget