అన్వేషించండి

Andhra Pradesh: వాలంటీర్లు పింఛన్ల పంపిణీ చేయొద్దు: ఈసీ కీలక ఆదేశాలు

AP Pensions: ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయించవద్దని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.

Andhra Pradesh Vounteers Pension Distribution: అమరావతి: ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఆంక్షలు విధించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల కారణంగా పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. పింఛన్ మాత్రమే కాదు, ఎలాంటి సంక్షేమ పథకాలకు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయించవద్దని ఈసీ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఈసీ తెలిపింది. 

Andhra Pradesh: వాలంటీర్లు పింఛన్ల పంపిణీ చేయొద్దు: ఈసీ కీలక ఆదేశాలు

 

ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసేవరకు వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్, మొబైల్ డిపాజిట్ చేయాలని తమ ఆదేశాలలో ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పింఛన్ సహా ఇతర సంక్షేమ పథకాల నగదును ఆన్‌లైన్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. లేకపోతే రెగ్యూలర్ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా నగదు పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తన ఆదేశాలలో ఈసీ పేర్కొంది.

మార్చి 16న సీఈసీ రాజీవ్ కుమార్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అదే సమయం నుంచి దేశ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. ఏప్రిల్ 18న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నాలుదో దశలో మే 13న ఏపీలో ఎన్నికలు నిర్వహించి, జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. 

కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరి
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఎవరైనా కార్యక్రమాలు నిర్వహించాలంటే అనుమతులు తీసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సువిధా యాప్ (Suvidha App) ద్వారా అనుమతులు తీసుకోవాలని.. 392 ధరఖాస్తులు అందగా, వాటిలో 10 ఈసీ పరిధిలోనివి అని ఇటీవల ఆయన తెలిపారు. మిగతా కేసులు జిల్లా ఎన్నికల అధికారుల పరిధిలో ఉన్నాయి.  ఎం.సి.సి (MCC) ఉల్లంఘనకు సంబందించిన ఫిర్యాదులను సీ విజిల్ యాప్ (cVIGIL app) ద్వారా నమోదు చేసుకున్న 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకు దాదాపు 1,173 ఫ్లయింగ్ స్క్వాడ్లు పనిచేస్తున్నాయని.. సీ విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకూ 1,307 ఫిర్యాదులు అందగా, వాటిలో 74 శాతం ఫిర్యాదులు పరిష్కరించినట్లు వెల్లడించారు. సి-విజిల్ పిర్యాధుల్లో 95 శాతం మేర పరిష్కరించే లక్ష్యంతో పనిచేస్తాం. ఈ యాప్ ను అందరూ వినియోగిస్తూ ఎం.సి.సి. ఉల్లంఘనలను నియంత్రించేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రజలను ఆయన కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట - బెయిల్ రద్దు చేయాలన్ని పిటిషన్ డిస్మిస్
సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట - బెయిల్ రద్దు చేయాలన్ని పిటిషన్ డిస్మిస్
KTR: సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు - క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం
సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు - క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం
PM Modi: నౌకాదళ అమ్ముల పొదిలోకి 3 అస్త్రాలు - జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
నౌకాదళ అమ్ముల పొదిలోకి 3 అస్త్రాలు - జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొలిరోజు 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు - అద్భుతమైన వీడియో చూశారా?
మహా కుంభమేళాలో తొలిరోజు 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు - అద్భుతమైన వీడియో చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR Quash Petition Supreme Court | కేటీఆర్ కు సుప్రీంకోర్టులో షాక్ | ABP DesamSandeep Reddy Vanga Kite Flying | సంక్రాంతి  సెలబ్రేషన్స్ గట్టిగా చేసిన సందీప్ రెడ్డి వంగా | ABP DesamMahakumbh 2025 Day 2 | హెలికాఫ్టర్లతో భక్తులపై పూలవర్షం | ABP DesamFlyover Iron Rods Theft | హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ పైనుంచి దూకేసిన వ్యక్తి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట - బెయిల్ రద్దు చేయాలన్ని పిటిషన్ డిస్మిస్
సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట - బెయిల్ రద్దు చేయాలన్ని పిటిషన్ డిస్మిస్
KTR: సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు - క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం
సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు - క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం
PM Modi: నౌకాదళ అమ్ముల పొదిలోకి 3 అస్త్రాలు - జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
నౌకాదళ అమ్ముల పొదిలోకి 3 అస్త్రాలు - జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొలిరోజు 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు - అద్భుతమైన వీడియో చూశారా?
మహా కుంభమేళాలో తొలిరోజు 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు - అద్భుతమైన వీడియో చూశారా?
Crime News: పుప్పాలగూడ డబుల్ మర్డర్ కేసు - మృతులను గుర్తించిన పోలీసులు, దారుణ హత్యలకు కారణం అదేనా?
పుప్పాలగూడ డబుల్ మర్డర్ కేసు - మృతులను గుర్తించిన పోలీసులు, దారుణ హత్యలకు కారణం అదేనా?
Car Parking: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? - కచ్చితంగా పార్కింగ్ స్థలం ఉండాల్సిందే!, మహారాష్ట్ర ప్రభుత్వం న్యూ రూల్
కొత్త కారు కొనాలనుకుంటున్నారా? - కచ్చితంగా పార్కింగ్ స్థలం ఉండాల్సిందే!, మహారాష్ట్ర ప్రభుత్వం న్యూ రూల్
Kallakkadal Warning: 2 రాష్ట్రాలకు పొంచి ఉన్న కల్లక్కడల్ ముప్పు- కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వార్నింగ్
2 రాష్ట్రాలకు పొంచి ఉన్న కల్లక్కడల్ ముప్పు- కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వార్నింగ్
Crime News: కాశీ యాత్రలో తీవ్ర విషాదం - మంటల్లో దగ్ధమైన బస్సు, నిర్మల్ వాసి సజీవదహనం
కాశీ యాత్రలో తీవ్ర విషాదం - మంటల్లో దగ్ధమైన బస్సు, నిర్మల్ వాసి సజీవదహనం
Embed widget