అన్వేషించండి

Crime News: పుప్పాలగూడ డబుల్ మర్డర్ కేసు - మృతులను గుర్తించిన పోలీసులు, దారుణ హత్యలకు కారణం అదేనా?

Hyderabad News: నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాలగూడ డబుల్ మర్డర్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మృతులను గుర్తించిన పోలీసులు వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా భావిస్తున్నారు.

Police Investigation On Puppalaguda Double Murder Case: రంగారెడ్డి జిల్లా (Rangareddy) నార్సింగ్ పీఎస్ పరిధిలోని పుప్పాలగూడ జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనంత పద్మనాభ స్వామి ఆలయ గుట్టల వద్ద మంగళవారం యువతీ, యువకుడు దారుణ హత్యకు గురి కాగా.. మృతులను పోలీసులు గుర్తించారు. యువకుడు మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్ కాగా ఇతను హౌస్ కీపింగ్ చేస్తూ నానక్‌రామ్‌గూడలో నివాసం ఉంటున్నాడు. యువతి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందు (25)గా గుర్తించారు. ఈమె ఎల్బీనగర్‌లో నివాసం ఉంటోంది.

అక్రమ సంబంధమే కారణమా.?

కాగా, జంట హత్యలకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. అంకిత్ సాకేత్, బిందు మధ్య గత కొంతకాలంగా పరిచయం ఏర్పడింది. అంకిత్ ఈ నెల 11న బిందును ఎల్బీనగర్ నుంచి నానక్‌రామ్‌గూడకు ఆమెను తన స్నేహితుడి రూంలో ఉంచాడు. ఆ తర్వాతి రోజు ఇద్దరూ కలిసి పుప్పాలగూడ గుట్టల వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఇద్దరూ ఏకాంతంగా గడిపారు. అంకిత్‌కు తెలియకుండా బిందు మరో యువకునితోనూ ప్రేమాయణం సాగించింది. సదరు ప్రియుడు వీరిద్దరూ ఏకాంతంగా ఉండడాన్ని చూసి జీర్ణించుకోలేక బిందుపై దాడి చేశాడు. బండరాళ్లతో మోది ఆమెను హతమార్చాడు.

ఇది చూసిన సాకేత్ భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టగా.. అతనిపై సైతం దాడికి పాల్పడ్డాడు. తన వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. హంతకుడి కోసం 3 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. కాగా, హత్యకు గురైన బిందు ఈ నెల 3న అదృశ్యమైనట్లు వనస్థలిపురంలో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంకిత్ సాకేత్‌పై ఈ నెల 8న గచ్చిబౌలి పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.

ఇదీ జరిగింది

నార్సింగి పీఎస్ పరధిలోని పుప్పాలగూడలో (Puppalaguda) మంగళవారం ఉదయం గాలిపటాలు ఎగురవేసేందుకు కొందరు వెళ్లారు. ఈ క్రమంలో వారికి పద్మనాభ స్వామి ఆలయం సమీపంలో గుట్టపై ఓ యువతి, యువకుడి మృతదేహాలు కనిపించాయి. దీనిపై వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతదేహాలను పరిశీలించారు. యువతీ యువకున్ని కత్తులతో పొడిచి, బండ రాళ్లతో మోది దారుణంగా హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: Hyderabad News: మద్యం మత్తులో చోరీకి యత్నించాడు - పారిపోతూ ఫ్లైఓవర్ పైనుంచి దూకాడు, భాగ్యనగరంలో ఘటన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Chittoor Crime News: సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్లు మాయం..! భాకరాపేట ఫారెస్ట్ రేంజర్‌పై వేటు
సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్లు మాయం..! భాకరాపేట ఫారెస్ట్ రేంజర్‌పై వేటు
Ganja Transport For Lover Birthday Gift: ప్రియురాలి బర్త్ డేకు ఐఫోన్ గిఫ్ట్.. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ ప్రియుడు
ప్రియురాలి బర్త్ డేకు ఐఫోన్ గిఫ్ట్.. గంజాయి రవాణా చేస్తూ దొరికిపోయిన ప్రియుడు
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Devotional Thief: దేవుడికి దండం పెట్టుకుని మరీ చోరీ - ఈ దొంగకు భక్తి ఎక్కువ..తెలివి తక్కువ !
దేవుడికి దండం పెట్టుకుని మరీ చోరీ - ఈ దొంగకు భక్తి ఎక్కువ..తెలివి తక్కువ !

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
Vijayawada News: విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో విషాదం.. దర్శనానికి వచ్చిన భక్తురాలు మృతి
విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో విషాదం.. దర్శనానికి వచ్చిన భక్తురాలు మృతి
Chittoor Crime News: సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్లు మాయం..! భాకరాపేట ఫారెస్ట్ రేంజర్‌పై వేటు
సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్లు మాయం..! భాకరాపేట ఫారెస్ట్ రేంజర్‌పై వేటు
AP SGST Growth: వ్యాపారాలు జోరందుకున్నా ఎస్‌జీఎస్టీ ఎందుకు పడిపోయింది? ఏపీ ఖజానాకు అసలు షాక్ ఎక్కడ తగిలింది?
వ్యాపారాలు జోరందుకున్నా ఎస్‌జీఎస్టీ ఎందుకు పడిపోయింది? ఏపీ ఖజానాకు అసలు షాక్ ఎక్కడ తగిలింది?
ODI Series Talks: సౌతాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌కు బీసీసీఐ స్కెచ్.. గిల్, గంభీర్ స్పెషల్ రిక్వెస్ట్‌తో స్పెష‌ల్ ఫోక‌స్
సౌతాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌కు బీసీసీఐ స్కెచ్.. గిల్, గంభీర్ స్పెషల్ రిక్వెస్ట్‌తో స్పెష‌ల్ ఫోక‌స్
ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
7 సీటర్ కోసం చూస్తున్నారా.. Volkswagen Tayron పై రూ.1.50 లక్షలు ఆదా, 9 ఎయిర్ బ్యాగ్స్
7 సీటర్ కోసం చూస్తున్నారా.. Volkswagen Tayron పై రూ.1.50 లక్షలు ఆదా, 9 ఎయిర్ బ్యాగ్స్
Embed widget