Young Girl commits Suicide: మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!
Young Girl commits Suicide: రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం ప్రేమ విఫలమైందనే కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.

Young Girl commits Suicide: తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న యువతుల ఆత్మహత్యల తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు యువతులు ప్రేమ విఫలమైందనే కారణంతో తమ నిండు జీవితాలను అర్ధాంతరంగా ముగించేశారు. ఇందులో ఒకరు యూట్యూబ్లో ఫేమస్్యిన యువతి, మరొకరు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని, ఇంకొకరు ఫిజియోథెరపీ చదువుతున్న మెడికల్ స్టూడెంట్ ఈ ముగ్గురు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారైనా, ప్రాణాలు తీసుకోవడానికి కారం మాత్రం ప్రేమ వ్యవహారమే కావడం ఆందోళన కలిగిస్తోంది.
అమ్మానాన్న క్షమించండి అంటూ రజిని...
ఆంధ్రప్రదేశ్లో విశాఖకు చెందిన రజిని అనే యువతి మధురవాడలోని ఒక ప్రైవేటు కాళాశాలలో ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ప్రేమించిన వ్యక్తి తనను వదిలేసి వెళ్లిపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. అతడిని వదిలి నేను ఉండలేకపోతున్నాను అంటు తన ఆవేదన వెళ్లగక్కుతూ సూసైడ్ నోట్ రాసింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు అమ్మానాన్న నన్ను క్షమించండీ అంటూ ఆమె రాసిన లేఖ అందరికీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఈ ఘటనపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యూట్యూబర్ కోమలి విషాదాంతం
హైదరాబాద్లో పేరున్న యూ్యూబర్ కోమని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతో ఉత్సాహంగా వీడియోలు చేస్తూ అందరికీ తెలిసిన కోమని, తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను తట్టుకోలేకపోయింది. తాను ప్రేమించిన వ్యక్తి మరో యువతికి దగ్గరవుతున్నాడనే బాధతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. తనను నమ్మిన ప్రేమ దక్కలేదన్న వేదనతో ఆమె తన జీవితాన్ని ముగించుకోవడం తోటి యూట్యబర్లను ఆమె ఫాలోవర్లను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పుడు ఆమె స్నేహితుడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు రావాలని సూచించారు.
బాసర ట్రిపుల్ ఐటీలో వసంత ఆత్మహత్య
వనపర్తి జిల్లాకు చెందిన వసంత అనే విద్యార్థిని బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకుంది. వసంత ఆత్మహత్య వెనుక ఒక విషాదకరమైన బ్యాక్గ్రౌండ్ ఉంది. వసంతను పెళ్లి చేసుకోవాలని ఆమె బావ కోరగా ఇప్పుడు పెళ్లి వద్దని నిరాకరించింది. ఈ కారణంతో బావ ఆత్మహత్య చేసుకున్నాడు. తన వల్లే ఈ అపశ్రుతి జరిగిదనే భయంతోనో లేదా ఆ వేదననను తట్టుకోలేకనో, వసంత హాస్టల్ గదిలోనే ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. ఈ ఘటన బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో విషాద ఛాయలు నింపింది. ప్రేమ విఫలమైందనే కారణంతో ముగ్గురు యువతులు ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.























