Ayesha Meera Last Rites: అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
Ayesha Meera Case | అయేషా మీరా అంత్య క్రియలు నేడు నిర్వహిస్తున్నారు. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఈ కేసులో తమకు న్యాయం జరగలేదని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

దాదాపు 20 ఏళ్ల క్రితం 27 డిసెంబర్ 2007న దారుణ హత్య కు గురైన 17ఏళ్ల B ఫార్మశీ విద్యార్థిని అయేషా మీరా అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ఆమె ఆస్థికలను, శరీరభాగాలను ఆమె తల్లి తండ్రులకు ఈరోజు విజయవాడ లో అప్పగిస్తారు అధికారులు. తరువాత ఆమె స్వస్థలం తెనాలి లో వాటికి తమ సంప్రదాయపద్ధతుల్లో అంతిమ సంస్కారం జరుపుతారు అయేషా తల్లి తండ్రులు.
విజయవాడలో భారీ ర్యాలీ.. 'ఛలో తెనాలి ' కార్యక్రమానికి పిలుపు
నిందితులు ఎవరో ఇప్పటికీ తెలియని ఈ కేసు లో ప్రజా సంఘాలు, లాయర్లు అయేషా మీరాకు సంఘీభావం గా ఈరోజు ర్యాలీ లకు పిలుపునిచ్చారు. విజయవాడ కోర్టు నుండి నగరం లోని డా.అంబెడ్కర్ భారీ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించాలని లాయర్లు పిలుపు ఇచ్చారు. ఆ తరువాత అయేషా తల్లితండ్రుల వెంటే తెనాలి వరకూ వెళ్ళడానికి 'ఛలో తెనాలి ' కార్యక్రమం జరపాలని నిర్ణయించారు. అయితే దీనిపై పోలీసులు అలెర్ట్ గా ఉన్నారు. ఇటు విజయవాడ, అటు తెనాలి లో పూర్తిగా అప్రమత్తం గా ఉండడమే కాకుండా ప్రజలకు పలు సూచనలు చేశారు. దానితో ఆ రెండు చోట్లా ఒక విధమైన ఉద్వేగ పూరిత వాతావరణం నెలకొని ఉంది. పూర్తిగా సంచలనం సృష్టించిన ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాలోని ప్రజలకూ బాగా సువరిచితం కావడం తో తెలుగు ప్రజలు కూడా పరిణామాలను గమనిస్తూ ఉన్నారు.
అసలేం జరిగింది..
విజయవాడ శివార్ల లోని ఒక హాస్టల్ లో ఉంటూ ఫార్మశీ విద్యార్థిని 2007 డిసెంబర్ 27 న బాత్ రూమ్ లో హత్యకు గురై కనపడింది. అక్కడే ఒక లేఖ లో ఆమెను తాను ప్రేమించాననీ ఒప్పుకోక పోవడం తో హత్య చేసినట్టు ఒక లేఖ కనపడింది. పోలీసుల దర్యాప్తు లో సత్యం బాబు అనే వ్యక్తి దొరికాడు. అయితే అతను దొంగతనానికి వచ్చాడని హత్య మరెవరో చేసారని వాదన జరిగింది. మొదట్లో సత్యం బాబు ను దోషిగా ప్రకటించిన విజయవాడ ఉమెన్స్ స్పషల్ సెషన్స్ కోర్టు హత్యకు గానూ 14 ఏళ్ళు, అత్యాచారం కు గానూ మరో పదేళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూనే రెండూ ఒకేసారి అమలు చేయకూడదని తీర్పు ఇచ్చింది.
అయితే హ్యూమన్ రైట్స్ సంఘాలు, సత్యం బాబు బంధువులు సత్యం బాబు ను కావాలని ఇరికిస్తున్నారు అంటూ న్యాయ పోరాటం మొదలు పెట్టడంతో 8ఏళ్ల తర్వాత 2017లో హైదరాబాద్ హై కోర్టు సత్యం బాబు జైలు శిక్షలను కొట్టేసింది.విచిత్రం గా అయేషా మీరా తల్లి తండ్రులు సైతం సత్యం బాబు తమ కుమార్తె ను హత్య చేయలేదని వాదించారు.కోర్టు సత్యం బాబును విడుదల చేయడమే కాకుండా అతనికి లక్ష రూపాయల నష్టపరిహారం ఇప్పించింది. అలాగే దర్యాప్తు లో భాద్యత లేకుండా ప్రవర్తించారు అంటూ పోలీసులకు చీవాట్లు పెట్టింది.29 నవంబర్ 2018లో ఏపీ హై కోర్టు ఈ కేసును సిబిఐ అప్పగించింది.
మళ్ళీ మొదటి నుండీ జరిగిన దర్యాప్తు లో అయేషా మీరా అత్యాచారం, మరియు హత్య కు గురైంది అనీ ఆమె శరీరం ఫై పదునైన ఆయుధం తో పోట్లు, పంటి గుర్తులు ఉన్నట్టు క్రొత్త గా నియమించిన SIT టీమ్ గుర్తించింది. ఈ కేసులో కొంతకాలం జైల్లో ఉన్న సత్యం బాబు సహా ఈ కేసులో మొదటి నుండీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక రాజకీయ కుటుంబ వారసుడి నీ SIT టీమ్ ప్రశ్నించింది. ఈలోవు దహన సంస్కారాలు చెయ్యడానికి తమ కుమార్తె అవశేషాలు తమకు అప్పగించాలని అయేషా తల్లితండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ బాషా కోర్టు ను కోరడం తో వారికి అయేషా అవశేషాలు ఈరోజు (27 ఫిబ్రవరి 2026) అప్పగించాలని కోర్టు అధికారులను ఆదేశించింది.























