అన్వేషించండి

Hyderabad Liberation Day: హైదరాబాద్ విలీనం తర్వాత నిజాం రాజు ఏం చేశాడు? భారత ప్రభుత్వం ఆయనకు డబ్బులు చెల్లించిందా?

Hyderabad Liberation Day: యూనియన్ ఇండియాలో హైదరాబాద్ విలీనమయ్యాక నిజాం ఏం చేశాడు?

Hyderabad Liberation Day: 

లొంగిపోయిన తరవాతా నిజాంకు బాధ్యతలు..

ఆపరేషన్ పోలో విజయవంతమైంది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలన అంతమైపోయింది. హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్ లో విలీనమై..హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది. 1948-52 వరకు అంటే సార్వత్రిక ఎన్నికల జరిగే వరకూ.. హైదరాబాద్ లో పాలన నిర్వహణ అధికారులను కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆపరేషన్ పోలోకి నేతృత్వం వహించిన జెఎన్ చౌదరీ 1948 సెప్టెంబర్ 18న హైదరాబాద్ రాష్ట్ర మిలటరీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. బెంగాల్ కి చెందిన ఇతడికి హైదరాబాద్ తో ఉన్న పరిచయం కారణంగా బాధ్యతలు అప్పజెప్పారు. అయితే భారత ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత కూడా...నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ కు కొన్ని బాధ్యతలను కొనసాగించారు. 1948 సెప్టెంబర్ 18 నుంచి మిలటరీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై 'రాజముద్ర' వేసే అధికారం ఉన్న రాజ్యాధినేతగా నిజాం రాజు పదవిని నిర్వహించారు. 

కేటగిరీలుగా రాష్ట్రాలు 

1950 జనవరి 26న భారత రాజ్యాంగంలో రాష్ట్రాలను ఎ,డి,సి,డి కేటగిరిలుగా చేశారు. భారతదేశంలో విలీనమైన సంస్థానాలను 'బి' కేటగిరి రాష్ట్రాలుగా ఉంచారు. అప్పటికి ప్రజాస్వామిక పద్ధతి ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం మెుదలు కాలేదు. అలా జెఎన్ చౌదరి 1949 డిసెంబర్ 1 వరకు మిలటరీ గవర్నర్ పదవిలో కొనసాగాడు. 1950 జనవరి 26 నుంచి సీనియర్ సివిల్ సర్వీస్ అధికారి ఎం.కె.వెల్లోడి ముఖ్యమంత్రిగా పౌరపాలన ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఐక్యరాజ్యసమితిలో నిజాం దాఖలు చేసిన పిటిషన్ కారణంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్  ప్రభుత్వ గెజిట్లపై రాజముద్ర వేసే రాజుగానే కేంద్రం కొనసాగనిచ్చింది. హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్ గా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నియమితు లయ్యారు. రాజ్ ప్రముఖ్ పదవి ప్రస్తుత గవర్నర్ తో సమానం. 

రాజ్‌ప్రముఖ్‌గానూ బాధ్యతలు..

1950 జనవరి 26న హైదరాబాద్ లో భారత ప్రజాస్వామ్య రిపబ్లిక్ ఏర్పాటు ఉత్సవంలో భారత దేశం సర్వసత్తాక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందని ప్రకటనను నిజాం చదివి వినిపించాడు. ఆ తర్వాత వెల్లోడి మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించాడు. 1956 వరకూ నిజాం రాజు హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్ గా అధికారాలను చలాయించాడు. నిజాం రాజుకు సంవత్సరానికి 1.25 కోట్లు రాజ భరణంగా జీవితాంతం చెల్లించేందుకు భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు ఆపరేషన్ పోలోతో నిజాం రాజు ఆర్మీ, రజాకార్లు లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే రజాకార్లు లొంగిపోయే సమయంలో తమ ఆయుధాలను కమ్యూని స్టులకు అప్పజెప్పారు. అయితే ఈసమయంలో కమ్యూనిస్టులు ఉండకూడదనే లక్ష్యంతో జెఎన్ చౌదరి మిలటరీ ప్రభుత్వం దాడులు చేసింది. దాదాపు 4000 మందిని కమ్యూనిస్టులను చంపారని అంచనా.

Also Read: Hyderabad Liberation Day: ఏకకాలంలో బ్రిటీషర్లు, నిజాంలపై పోరాడిన హైదరాబాద్, యుద్ధం మొదలైంది ఇక్కడే!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bill Gates Amaravati Tour: బిల్ గేట్స్ కోసం ముస్తాబైన అమరావతి.. మైక్రోసాఫ్ట్ అధినేత షెడ్యూల్ ఇదే
బిల్ గేట్స్ కోసం ముస్తాబైన అమరావతి.. మైక్రోసాఫ్ట్ అధినేత షెడ్యూల్ ఇదే
Tadapatla Ratnabai Death News: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రత్నాబాయి కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రత్నాబాయి కన్నుమూత
Karimnagar Mayor Seat: కరీంనగర్‌ మేయం పీఠంపై వీడని సస్పెన్స్! తగ్గేదేలే అంటున్న బీజేపీ, కాంగ్రెస్
కరీంనగర్‌ మేయం పీఠంపై వీడని సస్పెన్స్! తగ్గేదేలే అంటున్న బీజేపీ, కాంగ్రెస్
IT Sector Layoffs: ఐటీ రంగంలో భారీ లేఆఫ్‌లకు AI కారణమా? తాజా నివేదిక ఏం చెబుతోంది
ఐటీ రంగంలో భారీ లేఆఫ్‌లకు AI కారణమా? తాజా నివేదిక ఏం చెబుతోంది

వీడియోలు

BJP vs AIMIM Tippu sulthan Controversy | AIMIMపై రామచంద్ర రావు కామెంట్స్
Harbajan Singh about Abhishek Sharma T20 World Cup | అభిషేక్ శర్మ vs ఉస్మాన్ తారిఖ్
Salman Agha Comments on Abhishek Sharma India vs Pakistan | అభిషేక్ పై పాకిస్తాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
India vs Pakistan T20 World Cup Preview | నేడు టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ - పాక్ మ్యాచ్
Suryakumar Yadav India vs Pakistan T20 World Cup | పాక్ తో మ్యాచ్ పై సూర్యకుమార్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bill Gates Amaravati Tour: బిల్ గేట్స్ కోసం ముస్తాబైన అమరావతి.. మైక్రోసాఫ్ట్ అధినేత షెడ్యూల్ ఇదే
బిల్ గేట్స్ కోసం ముస్తాబైన అమరావతి.. మైక్రోసాఫ్ట్ అధినేత షెడ్యూల్ ఇదే
Tadapatla Ratnabai Death News: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రత్నాబాయి కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రత్నాబాయి కన్నుమూత
Karimnagar Mayor Seat: కరీంనగర్‌ మేయం పీఠంపై వీడని సస్పెన్స్! తగ్గేదేలే అంటున్న బీజేపీ, కాంగ్రెస్
కరీంనగర్‌ మేయం పీఠంపై వీడని సస్పెన్స్! తగ్గేదేలే అంటున్న బీజేపీ, కాంగ్రెస్
IT Sector Layoffs: ఐటీ రంగంలో భారీ లేఆఫ్‌లకు AI కారణమా? తాజా నివేదిక ఏం చెబుతోంది
ఐటీ రంగంలో భారీ లేఆఫ్‌లకు AI కారణమా? తాజా నివేదిక ఏం చెబుతోంది
Kova Bun Controversy: కోవా బన్ వ్యాపారి వలీకి మంత్రి నారా లోకేష్ మద్దతు.. త్వరలోనే కలుస్తానని భరోసా
కోవా బన్ వ్యాపారి వలీకి మంత్రి నారా లోకేష్ మద్దతు.. త్వరలోనే కలుస్తానని భరోసా
Queen Title Glimpse : 'క్వీన్'గా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ యామిని - డిఫరెంట్ లవ్ స్టోరీతో క్యూరియాసిటీ పెంచేసిన టైటిల్ గ్లింప్స్
'క్వీన్'గా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ యామిని - డిఫరెంట్ లవ్ స్టోరీతో క్యూరియాసిటీ పెంచేసిన టైటిల్ గ్లింప్స్
IND vs PAK T20 World Cup 2026: హిస్టరీ రిపీట్.. పాక్‌ను చిత్తు చేసిన భారత్- 61 పరుగుల తేడాతో ఘన విజయం
హిస్టరీ రిపీట్.. పాక్‌ను చిత్తు చేసిన భారత్- 61 పరుగుల తేడాతో ఘన విజయం
NEET UG 2026: ఎంపీసీ విద్యార్థులకు సైతం డాక్టర్ అయ్యే ఛాన్స్.. మారిన NMC రూల్స్
ఎంపీసీ విద్యార్థులకు సైతం డాక్టర్ అయ్యే ఛాన్స్.. మారిన NMC రూల్స్
Embed widget