అన్వేషించండి

Hyderabad Liberation Day: హైదరాబాద్ విలీనం తర్వాత నిజాం రాజు ఏం చేశాడు? భారత ప్రభుత్వం ఆయనకు డబ్బులు చెల్లించిందా?

Hyderabad Liberation Day: యూనియన్ ఇండియాలో హైదరాబాద్ విలీనమయ్యాక నిజాం ఏం చేశాడు?

Hyderabad Liberation Day: 

లొంగిపోయిన తరవాతా నిజాంకు బాధ్యతలు..

ఆపరేషన్ పోలో విజయవంతమైంది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలన అంతమైపోయింది. హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్ లో విలీనమై..హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది. 1948-52 వరకు అంటే సార్వత్రిక ఎన్నికల జరిగే వరకూ.. హైదరాబాద్ లో పాలన నిర్వహణ అధికారులను కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆపరేషన్ పోలోకి నేతృత్వం వహించిన జెఎన్ చౌదరీ 1948 సెప్టెంబర్ 18న హైదరాబాద్ రాష్ట్ర మిలటరీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. బెంగాల్ కి చెందిన ఇతడికి హైదరాబాద్ తో ఉన్న పరిచయం కారణంగా బాధ్యతలు అప్పజెప్పారు. అయితే భారత ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత కూడా...నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ కు కొన్ని బాధ్యతలను కొనసాగించారు. 1948 సెప్టెంబర్ 18 నుంచి మిలటరీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై 'రాజముద్ర' వేసే అధికారం ఉన్న రాజ్యాధినేతగా నిజాం రాజు పదవిని నిర్వహించారు. 

కేటగిరీలుగా రాష్ట్రాలు 

1950 జనవరి 26న భారత రాజ్యాంగంలో రాష్ట్రాలను ఎ,డి,సి,డి కేటగిరిలుగా చేశారు. భారతదేశంలో విలీనమైన సంస్థానాలను 'బి' కేటగిరి రాష్ట్రాలుగా ఉంచారు. అప్పటికి ప్రజాస్వామిక పద్ధతి ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం మెుదలు కాలేదు. అలా జెఎన్ చౌదరి 1949 డిసెంబర్ 1 వరకు మిలటరీ గవర్నర్ పదవిలో కొనసాగాడు. 1950 జనవరి 26 నుంచి సీనియర్ సివిల్ సర్వీస్ అధికారి ఎం.కె.వెల్లోడి ముఖ్యమంత్రిగా పౌరపాలన ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఐక్యరాజ్యసమితిలో నిజాం దాఖలు చేసిన పిటిషన్ కారణంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్  ప్రభుత్వ గెజిట్లపై రాజముద్ర వేసే రాజుగానే కేంద్రం కొనసాగనిచ్చింది. హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్ గా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నియమితు లయ్యారు. రాజ్ ప్రముఖ్ పదవి ప్రస్తుత గవర్నర్ తో సమానం. 

రాజ్‌ప్రముఖ్‌గానూ బాధ్యతలు..

1950 జనవరి 26న హైదరాబాద్ లో భారత ప్రజాస్వామ్య రిపబ్లిక్ ఏర్పాటు ఉత్సవంలో భారత దేశం సర్వసత్తాక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందని ప్రకటనను నిజాం చదివి వినిపించాడు. ఆ తర్వాత వెల్లోడి మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించాడు. 1956 వరకూ నిజాం రాజు హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్ గా అధికారాలను చలాయించాడు. నిజాం రాజుకు సంవత్సరానికి 1.25 కోట్లు రాజ భరణంగా జీవితాంతం చెల్లించేందుకు భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు ఆపరేషన్ పోలోతో నిజాం రాజు ఆర్మీ, రజాకార్లు లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే రజాకార్లు లొంగిపోయే సమయంలో తమ ఆయుధాలను కమ్యూని స్టులకు అప్పజెప్పారు. అయితే ఈసమయంలో కమ్యూనిస్టులు ఉండకూడదనే లక్ష్యంతో జెఎన్ చౌదరి మిలటరీ ప్రభుత్వం దాడులు చేసింది. దాదాపు 4000 మందిని కమ్యూనిస్టులను చంపారని అంచనా.

Also Read: Hyderabad Liberation Day: ఏకకాలంలో బ్రిటీషర్లు, నిజాంలపై పోరాడిన హైదరాబాద్, యుద్ధం మొదలైంది ఇక్కడే!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget