అన్వేషించండి

నిజామాబాద్ లో కలెక్టరేట్, పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ లో పర్యటించారు. నూతన కలెక్టరేట్ భవనాన్ని, పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

KCR Nizamabad Tour: గత కొంత కాలంగా జాతీయ రాజకీయాలు అంటూ మాట్లాడుతూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మరోసారి జాతీయ రాజకీయాల ప్రస్తావన తీసుకువచ్చారు. అయితే ఈ సారి కొంచెం స్ట్రాంగ్ గానే కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడారు. ఇప్పటి వరకు హింట్స్ ఇస్తూ వచ్చిన కేసీఆర్.. ఇప్పుడు ఫుల్ క్లారిటీగా తన దృక్పథం ఏమిటో తేల్చి చెప్పారు. ముక్త్‌ బీజేపీ నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం, ముందుకు సమీకృత కలెక్టరేట్ భవనాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత స్థానిక గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొని జాతీయ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. 

"ఉచితంగా విద్యుత్"

జాతీయ రాజకీయాల్లోకి రావడంపై అజెండా ఫిక్స్ చేసినట్లు కేసీఆర్ వెల్లడించారు. ఈ బహిరంగ సభలోనే ఉచిత విద్యుత్ హామీని సైతం సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశంలో 2024 సంవత్సరం తర్వాత బీజీపీయేతర ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో, ఇతర రాష్ట్రాల్లో పాలన ఎలా ఉందో, పథకాల అమలు, రైతుల స్థితి, పింఛన్లు, ఇతర విషయాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలని, పాలనను అర్థం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. 60 ఏళ్ల పోరాటం తర్వాత సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. రైతులకు ఉచితంగా 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదని కేసీఆర్ తెలిపారు. 

"2024లో బీజేపీ ముక్త్ భారత్"

ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రైతులకు ఉచితాలు ఇవ్వవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నారని, వ్యవసాయ కరెంటు సరఫరాకు మీటర్లు పెట్టాలని రాష్ట్రాలను ఒత్తిడికి గురి చేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. అలాంటి బీజేపీని సాగనంపాలని పిలుపునిచ్చారు. 2024లో బీజేపీ ముక్త్ భారత్ ఉండాలని సీఎం కేసీఆర్ మరోసారి పిలుపునిచ్చారు. 

"ఒక్క ప్రాజెక్టైనా నిర్మించారా"

భారత్ కోసం పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలన్న సీఎం... రాష్ట్ర ప్రజలు దీవిస్తే నిజామాబాద్ గడ్డ నుంచే జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలు అవుతుందని స్పష్టం చేశారు. ఈ 8 ఏళ్ల పాలనలో కేంద్రంలోని మోదీ సర్కారు ఒక్క ప్రాజెక్టుగానీ, పరిశ్రమ గానీ నిర్మించిందా అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రశ్నించారు. 

నిజామాబాద్ బైపాస్ రోడ్డు ప్రాంతంలో సువిశాల విస్తీర్ణంలో కలెక్టరేట్ నిర్మించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో రూ. 60 కోట్ల వ్యయంతో భవనం నిర్మించారు. కలెక్టరేట్ ప్రారంభంతో బైపాస్ రోడ్డు ప్రాంతం సుందరంగా మారింది. ఐదు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా పార్టీ కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 SRH vs RR Top 5 players: ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
Bandi Sanjay: జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
NTR: 'దేవర'తో ఆటో గ్రాఫ్ స్వీట్ మెమొరీస్ - జపాన్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఇక మాస్ జాతరే..
'దేవర'తో ఆటో గ్రాఫ్ స్వీట్ మెమొరీస్ - జపాన్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఇక మాస్ జాతరే..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP DesamSRH vs RR IPL 2025 Match Preview | రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొట్టనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ | ABP DesamFan Touched feet of Virat Kohli | KKR vs RCB మ్యాచ్ లో కొహ్లీపై అభిమాని పిచ్చి ప్రేమ | ABP DesamVirat Kohli vs KKR IPL 2025 | 18వ సారి దండయాత్ర మిస్సయ్యే ఛాన్సే లేదు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 SRH vs RR Top 5 players: ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
Bandi Sanjay: జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
NTR: 'దేవర'తో ఆటో గ్రాఫ్ స్వీట్ మెమొరీస్ - జపాన్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఇక మాస్ జాతరే..
'దేవర'తో ఆటో గ్రాఫ్ స్వీట్ మెమొరీస్ - జపాన్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఇక మాస్ జాతరే..
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
Allu Arjun: అట్లీ సినిమాతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్... ప్రజెంట్ ఇండియాలో టాప్ అతనేనా!?
అట్లీ సినిమాతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్... ప్రజెంట్ ఇండియాలో టాప్ అతనేనా!?
IPL 2025 CSK VS MI Updates: ఎల్ క్లాసికో పోరుకు రంగం సిద్ధం.. నేడు చెన్నైతో ముంబై ఢీ.. హార్దిక్ గైర్హాజరు.. అటు CSKలో దిగులు
ఎల్ క్లాసికో పోరుకు రంగం సిద్ధం.. నేడు చెన్నైతో ముంబై ఢీ.. హార్దిక్ గైర్హాజరు.. అటు CSKలో దిగులు
Viral News: పన్ను కట్టలేదని ఇంటి గేటుకు తాళం వేసిన అధికారులు, మంచిర్యాల జిల్లాలో ఘటన
పన్ను కట్టలేదని ఇంటి గేటుకు తాళం వేసిన అధికారులు, మంచిర్యాల జిల్లాలో ఘటన
Embed widget