అన్వేషించండి

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సమయాల్లో మార్పులు.. చివరి ట్రైన్ టైం ఇంకా పొడిగింపు

ప్రస్తుతం రాత్రి 9.45 గంటలకే నగరవాసులకు చివరి మెట్రో సర్వీస్‌ను అందుబాటులో ఉంది. ఉదయం రైలు సర్వీసులు ప్రారంభంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ రాత్రి వేళ రైలు సమయాల్లో మార్పులు చేసింది. చివరి మెట్రో సర్వీస్‌ సమయాన్ని అరగంట పాటు పొడిగించింది. దీంతో ఇకపై రాత్రి 10.15 గంటలకు చివరి మెట్రో రైలు సర్వీస్‌ ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం రాత్రి 9.45 గంటలకే నగరవాసులకు చివరి మెట్రో సర్వీస్‌ను అందుబాటులో ఉంది. అయితే, ఉదయం రైలు సర్వీసులు ప్రారంభంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఉదయం 7 గంటలకు మెట్రో తొలి సర్వీస్ మొదలు కానుండగా.. ఇకపై కూడా అలాగే కొనసాగనున్నాయి.

లాక్ డౌన్ 2.0 తర్వాత ప్రభుత్వ నియమావళికి అనుగుణంగా ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు కూడా రైలు సమయాల్లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సడలింపులకు అనుగుణంగా రైలు సమయాల్లోనూ మార్పులు చేస్తూ వచ్చారు. చివరికి ప్రయాణికుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని రాత్రి 9.45 గంటలకు చివరి ట్రైన్ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో తాజాగా ఆఖరి ట్రైన్ మొదలయ్యే సమయాన్ని 10.15 గంటలకు మార్చారు.

నష్టాల్లోనే మెట్రో..
కరోనా వైరస్, లాక్ డౌన్ ప్రభావం హైదరాబాద్ మెట్రోపైన కూడా విపరీతంగా పడిన సంగతి తెలిసిందే. మొత్తం కలిపి నష్టాలు ప్రస్తుతం రూ.2 వేల కోట్ల వరకూ ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో (పీపీపీ) ఏర్పాటైన హైదరాబాద్‌ మెట్రోలో ఎల్‌ అండ్‌ టీ నిర్మాణ సంస్థకి 90 శాతం వాటా ఉండగా, తెలంగాణ ప్రభుత్వానికి 10 శాతం మాత్రమే వాటా ఉంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,571 కోట్లు కాగా, చివరికి రూ.18,971 కోట్ల ఖర్చు అయింది. 

నష్టాలు వచ్చాయి ఇలా..
ఇందులో సుమారు రూ.13,500 కోట్లను ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎల్‌ అండ్‌ టీ సంస్థ వివిధ మార్గాల ద్వారా రుణాలు సేకరించింది. ఈ క్రమంలో ప్రాజెక్టు మొదలయ్యాక అంటే 2019-20 ఏడాదిలో వివిధ కారణాల వల్ల 383.20 కోట్లు నష్టాలు వచ్చాయి. ఇక 2020-21లో ఈ నష్టాలు మొత్తం కలిపి ఏకంగా రూ.1,766 కోట్లకు చేరాయి. కొవిడ్‌ కారణంగా 2020 మార్చి 23 నుంచి సెప్టెంబరు 8 వరకు దాదాపు 6 నెలల పాటు మెట్రో రైల్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అన్ లాక్ అయి మెట్రో సేవలు తిరిగి ప్రారంభం అయి కాస్త ఊరట కలిగే లోపే కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడింది.

లాక్ డౌన్ 2.0 తో అనేక ఆంక్షల నడుమ రైళ్లను నడిపించాల్సి రావడంతో ఆర్థిక భారం మరింత పెరిగిపోయింది. కరోనా భయంతో ప్రయాణికులు విపరీతంగా తగ్గిపోయారు. ఈ వ్యవధిలోనూ నష్టాలు మరింత తీవ్రం అయ్యాయి. మొత్తం కలిపి రూ.2 వేల కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. అయితే, ఈ నష్టాల నుంచి ఆదుకోవాలని గతంలో ఎల్ అండ్ టీ సంస్థ ప్రభుత్వాన్ని సైతం కోరింది.

వాటా విక్రయించే ఛాన్స్
అయితే, ఈ నష్టాల నుంచి బయట పడేందుకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ తన వాటాను విక్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, తమ పూర్తి వాటాను అమ్ముతారా లేక కొంత షేర్ అమ్ముతారా? అనే అంశంపై స్పష్టతలేదు. హైదరాబాద్ మెట్రో వాటాతో పాటు పంజాబ్‌లోని నభా థర్మల్ విద్యుత్ కేంద్రం, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఎల్ అండ్ టీ ఆస్తుల్ని కూడా విక్రయిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి గతంలో తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Advertisement

వీడియోలు

Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Annagaru Vostaru Teaser : నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది...  వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది... వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
Embed widget