అన్వేషించండి

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సమయాల్లో మార్పులు.. చివరి ట్రైన్ టైం ఇంకా పొడిగింపు

ప్రస్తుతం రాత్రి 9.45 గంటలకే నగరవాసులకు చివరి మెట్రో సర్వీస్‌ను అందుబాటులో ఉంది. ఉదయం రైలు సర్వీసులు ప్రారంభంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ రాత్రి వేళ రైలు సమయాల్లో మార్పులు చేసింది. చివరి మెట్రో సర్వీస్‌ సమయాన్ని అరగంట పాటు పొడిగించింది. దీంతో ఇకపై రాత్రి 10.15 గంటలకు చివరి మెట్రో రైలు సర్వీస్‌ ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం రాత్రి 9.45 గంటలకే నగరవాసులకు చివరి మెట్రో సర్వీస్‌ను అందుబాటులో ఉంది. అయితే, ఉదయం రైలు సర్వీసులు ప్రారంభంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఉదయం 7 గంటలకు మెట్రో తొలి సర్వీస్ మొదలు కానుండగా.. ఇకపై కూడా అలాగే కొనసాగనున్నాయి.

లాక్ డౌన్ 2.0 తర్వాత ప్రభుత్వ నియమావళికి అనుగుణంగా ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు కూడా రైలు సమయాల్లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సడలింపులకు అనుగుణంగా రైలు సమయాల్లోనూ మార్పులు చేస్తూ వచ్చారు. చివరికి ప్రయాణికుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని రాత్రి 9.45 గంటలకు చివరి ట్రైన్ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో తాజాగా ఆఖరి ట్రైన్ మొదలయ్యే సమయాన్ని 10.15 గంటలకు మార్చారు.

నష్టాల్లోనే మెట్రో..
కరోనా వైరస్, లాక్ డౌన్ ప్రభావం హైదరాబాద్ మెట్రోపైన కూడా విపరీతంగా పడిన సంగతి తెలిసిందే. మొత్తం కలిపి నష్టాలు ప్రస్తుతం రూ.2 వేల కోట్ల వరకూ ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో (పీపీపీ) ఏర్పాటైన హైదరాబాద్‌ మెట్రోలో ఎల్‌ అండ్‌ టీ నిర్మాణ సంస్థకి 90 శాతం వాటా ఉండగా, తెలంగాణ ప్రభుత్వానికి 10 శాతం మాత్రమే వాటా ఉంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,571 కోట్లు కాగా, చివరికి రూ.18,971 కోట్ల ఖర్చు అయింది. 

నష్టాలు వచ్చాయి ఇలా..
ఇందులో సుమారు రూ.13,500 కోట్లను ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎల్‌ అండ్‌ టీ సంస్థ వివిధ మార్గాల ద్వారా రుణాలు సేకరించింది. ఈ క్రమంలో ప్రాజెక్టు మొదలయ్యాక అంటే 2019-20 ఏడాదిలో వివిధ కారణాల వల్ల 383.20 కోట్లు నష్టాలు వచ్చాయి. ఇక 2020-21లో ఈ నష్టాలు మొత్తం కలిపి ఏకంగా రూ.1,766 కోట్లకు చేరాయి. కొవిడ్‌ కారణంగా 2020 మార్చి 23 నుంచి సెప్టెంబరు 8 వరకు దాదాపు 6 నెలల పాటు మెట్రో రైల్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అన్ లాక్ అయి మెట్రో సేవలు తిరిగి ప్రారంభం అయి కాస్త ఊరట కలిగే లోపే కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడింది.

లాక్ డౌన్ 2.0 తో అనేక ఆంక్షల నడుమ రైళ్లను నడిపించాల్సి రావడంతో ఆర్థిక భారం మరింత పెరిగిపోయింది. కరోనా భయంతో ప్రయాణికులు విపరీతంగా తగ్గిపోయారు. ఈ వ్యవధిలోనూ నష్టాలు మరింత తీవ్రం అయ్యాయి. మొత్తం కలిపి రూ.2 వేల కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. అయితే, ఈ నష్టాల నుంచి ఆదుకోవాలని గతంలో ఎల్ అండ్ టీ సంస్థ ప్రభుత్వాన్ని సైతం కోరింది.

వాటా విక్రయించే ఛాన్స్
అయితే, ఈ నష్టాల నుంచి బయట పడేందుకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ తన వాటాను విక్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, తమ పూర్తి వాటాను అమ్ముతారా లేక కొంత షేర్ అమ్ముతారా? అనే అంశంపై స్పష్టతలేదు. హైదరాబాద్ మెట్రో వాటాతో పాటు పంజాబ్‌లోని నభా థర్మల్ విద్యుత్ కేంద్రం, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఎల్ అండ్ టీ ఆస్తుల్ని కూడా విక్రయిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి గతంలో తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
CM Revanth Reddy: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Embed widget