అన్వేషించండి

APBIE: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - సిలబస్, ప్రశ్నపత్రాల విధానంలో సమూల మార్పులు

APBIE: ఏపీలో వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఇంటర్ సిలబస్, ప్రశ్నపత్రాల నమూనాలో ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ఇందుకు సంబంధించిన సమాాచారాన్ని బోర్డు కళాశాలలకు పంపింది.

Changes in Inter Exam Pattern: ఏపీలోని ఇంటర్ విద్యావిధానంలో ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి సిలబస్, ప్రశ్నపత్రాల నమూనాలోనూ మార్పులు చేసింది. దీనిప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్‌ పరీక్షల్లో మొదటిసారిగా ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెడుతున్నారు. ఈ మార్పులకు సంబంధించి జూనియర్‌ కళాశాలలకు ఇంటర్ బోర్డు సమాచారం పంపింది. ప్రథమ సంవత్సరంలో జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ను ప్రవేశపెట్టారు. పాఠశాల స్థాయిలో ఈ ఏడాది పదోతరగతిలో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీన్ని వచ్చే ఏడాదికి ఇంటర్మీడియట్‌ వరకు పొడిగించారు.

సైన్సు గ్రూపుల్లో ఐదు పేపర్లే..

ఇప్పటివరకు మ్యాథమెటిక్స్-ఎ, బి పేపర్లుగా 75 మార్కుల చొప్పున 150 మార్కులకు ఉండగా.. ఇక నుంచి పబ్లిక్‌ పరీక్షల్లో రెండూ కలిపి ఒక్క పేపర్‌గానే ఉంటుంది. మార్కులు సైతం వందకు కుదించారు. వచ్చే ఏడాది ప్రథమ సంవత్సరం విద్యార్థులు మ్యాథమెటిక్స్ ఒక్క పేపర్‌గా 100 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది.

ఫిజిక్స్, కెమిస్ట్రీ పరీక్షలు 60 మార్కుల చొప్పున ఉండగా.. వీటిని 85 మార్కులకు పెంచారు. ప్రథమ సంవత్సరంలో 15 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో 15 మార్కులు కలిపి మొత్తం 30 మార్కులకు ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు. 

బైపీసీలోని బోటనీ, జువాలజీ సబ్జెక్టులు రెండింటిని కలిపి ఒకే పేపర్‌గా ఇవ్వనున్నారు. ఇప్పటివరకు వీటిని వేర్వేరుగా నిర్వహించేవారు. ఇక నుంచి దీన్ని జీవశాస్త్రం(Biology)గా పిలుస్తారు. ఇందులో 43 మార్కులకు వృక్ష, 42 మార్కులకు జంతుశాస్త్రం కలిపి 85 మార్కులకు ప్రశ్నపత్రం ఇస్తారు. 

సీఈసీలోనూ మార్పులు..
సీఈసీ గ్రూపులో కామర్స్, అకౌంటెన్సీ కలిపి 50 మార్కుల చొప్పున ఒక పేపర్‌ ఉంటుంది. 

కొనసాగుతున్న ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం..
ఏపీలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 20తో ముగిసిన సంగతి తెలిసిందే. కాగా మార్చి 19 నుంచే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం(Inter Answer Paper Evaluation) ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది నుంచి ఇంటర్ బోర్డు మూల్యాంకన కేంద్రాల్లో తొలిసారిగా ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ హాజరైన అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 సెంటర్లలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 10 వరకు కొనసాగనుంది. ఈ మూల్యాంకన విధుల్లో ప్రతి సెంటర్‌లో 600 నుంచి 1200 మంది వరకు సిబ్బంది పాల్గొంటున్నారు. ఇంటర్ బోర్డు ప్రత్యేక  యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. వేలిముద్రలు లేదా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఈ యాప్‌లో హాజరు చేసుకోవచ్చు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిన తర్వాత మరో 10 రోజుల్లో మార్కులను ఎంటర్ చేసే ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. ఆ తర్వాత వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ విధంగా చూసుకుంటే ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.

మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 1 నుంచి మార్చి 19 వరకు నిర్వహించారు. అయితే ప్రథమ సంవత్సరం ప్రధాన పరీక్షలు మార్చి 13తో ముగియగా. మార్చి 3 నుంచి మార్చి 20 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. సెకండియర్ ప్రధాన పరీక్షలు మార్చి 15తో ముగిశాయి. ఒకేషనల్, బ్రిడ్జి కోర్సు పరీక్షలు మార్చి 20తో ముగిశాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

UGC NET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలివే
UGC NET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలివే
Telangana SSC Results 2026: తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! నేరుగా వాట్సాప్‌కే రీవెరిఫికేషన్ ఆన్సర్ షీట్స్‌!
తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! నేరుగా వాట్సాప్‌కే రీవెరిఫికేషన్ ఆన్సర్ షీట్స్‌!
AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!
AP SSC Supplementary Exams 2026: ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే...
ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే...

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
Karuppu: పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
Akividu Rama Temple: ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
IPL 2026 KKR VS SRH Result Update: బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ కు ఓట‌మి.. రాణించిన హెడ్, ఆక‌ట్టుకున్న వ‌రుణ్, ర‌ఘువంశీ, ర‌హానే, KKR హ్యాట్రిక్స్ విన్
బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ కు ఓట‌మి.. రాణించిన హెడ్, ఆక‌ట్టుకున్న వ‌రుణ్, ర‌ఘువంశీ, ర‌హానే, KKR హ్యాట్రిక్స్ విన్
Dating Trend : అందంగా లేకపోయినా పర్లేదు.. ప్రేమగా ఉంటే చాలు, Shrekking ట్రెండ్ అంటే ఇదే
అందంగా లేకపోయినా పర్లేదు.. ప్రేమగా ఉంటే చాలు, Shrekking ట్రెండ్ అంటే ఇదే
Hyderabad Viral Video: బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
US Iran Tension: అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
Bandla Ganesh Daughter Engagement : బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
Embed widget