అన్వేషించండి

IPL 2024: గిల్‌కు భారీ జరిమానా, మరోసారి చేస్తే ఓ మ్యాచ్‌ నిషేధమే ?

Shubman Gill: గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ‌మ‌న్ గిల్‌కు భారీ ఫైన్ పడింది. చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్‌తో బౌలింగ్ చేయటంతో గిల్‌కు రూ. 24 లక్షల జరిమానా విధించింది.

Gujrat Titans Skipper Shubman Gill Fined Rs 24 Lakh: చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK)పై శతక గర్జన చేసి అద్భుత విజయం సాధించి మంచో జోష్‌లో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌(GT)కు...ఐపీఎల్‌ (IPL)యాజమాన్యం షాక్‌ ఇచ్చింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా గుజరాత్ కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్‌(Shubman Gill)కు రూ. 24 లక్షల జరిమానా విధించింది. జట్టులోని సభ్యులకూ మ్యాచ్‌ ఫీజ్‌లో 25 శాతం కోత పెట్టింది. జట్టు సభ్యులకు 25 శాతం కానీ రూ. 6 లక్షలు కానీ జరిమానా విధించిన ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. ప్రస్తుత సీజన్‌లో గుజరాత్‌ రెండోసారి స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

చెన్నైపై విక్టరీతో పాయింట్ల పట్టికలో గుజరాత్ 10 ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ఇప్పటికే గుజరాత్‌ రెండోసారి స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా జరిమానాకు గురైంది. మరోసారి గుజరాత్ టైటాన్స్ జట్టు వచ్చేసారి ఈ పొరపాటు చేస్తే.. కెప్టెన్‌పై కూడా నిషేధం పడే అవకాశం ఉంది. గుజరాత్‌ మరోసారి స్లో ఓవర్‌ రేట్‌ పునరావృతం చేస్తే నిబంధనల ప్రకారం రూ.30 లక్షల జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా జట్టులోని ప్లేయింగ్ ఎలెవన్ కూడా రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

మొదటిసారి కెప్టెన్ కు మాత్రమే ఫైన్ వెయ్యగా ఏది రెండవసారి కావడంతో కెప్టెన్‌తో పాటు మొత్తం 11 మంది ప్లేయ‌ర్ల‌కు కూడా ఫైన్ వేశారు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ల ఫీజ్ లో కూడా కోత పడింది.  మొత్తం 11 మంది క్రికెట‌ర్ల‌కు ఆరు లక్ష‌లు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం  ఈ రెండిటిలో  ఏది త‌క్కువ‌గా ఉంటే దాన్ని వసూల్ చేస్తారు. ఇక శుక్ర‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ చెన్నై జ‌ట్టుపై 35 ర‌న్స్ తేడాతో గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు గెలిచింది. గిల్‌, సాయి సుద‌ర్శ‌న్ .. ఇద్ద‌రూ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. 12 మ్యాచ్‌లు ఆడిన గుజ‌రాత్ జ‌ట్టు 10 పాయింట్ల‌తో 8వ స్థానంలో ఉండగా . పాయింట్ల టేబుల్‌లో చెన్నై 12 పాయింట్ల‌తో నాలుగ‌వ స్థానంలో ఉంది. 

అదిరిపోయిన గుజరాత్ ఆట  :

గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ పక్కా ప్రణాళికతో విజయం సాధించింది. సొంతగడ్డపై జరిగిన పోరులో చెన్నైని 35 పరుగుల తేడాతో ఓడించి కొద్దిపాటి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ‌మన్ గిల్  సెంచరీలతో  కదం తొక్కడంతో  మూడు వికెట్లకు 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. 232 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చైన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులకే పరిమితమైంది.  చైన్నై జట్టులో డారిల్ మిచెల్ ,  మొయిన్ అలీ చెలరేగారు. చివర్లో  ధోనీ ప్రేక్షకులను అలరించినప్పటికీ.. అప్పటికే లక్ష్యం అందనంత ఎత్తుకి వెళ్లిపోవడంతో చెన్నై ఓటమి తప్పలేదు.  గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ అద్భుతమైన స్పెల్‌తో చెన్నై పతనాన్ని శాసించాడు. ఆ జట్టు బ్యాట్స్‌మన్ నిలకడగా ఆడుతూ భారీ షాట్లు కొడుతోన్న సమయంలో  3 కీలక వికెట్లు తీసి చెన్నైని కోలుకోని దెబ్బ తీశాడు. మొత్తానికి గెలుపయితే పొందారు గానీ మ్యాచ్ ఫీజులో మాత్రం పాపం భారీగా కోత  పడింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌, ఏకంగా 31 మంది మావోయిస్టులు మృతి- కొనసాగుతోన్న ఆపరేషన్
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌, ఏకంగా 31 మంది మావోయిస్టులు మృతి- కొనసాగుతోన్న ఆపరేషన్
First GBS Death in Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
Chiranjeevi: మెగాస్టార్ కాదు... చిరంజీవి కొత్త ట్యాగ్ ఇచ్చిన విశ్వక్ సేన్
మెగాస్టార్ కాదు... చిరంజీవికి కొత్త ట్యాగ్ ఇచ్చిన విశ్వక్ సేన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

AAP Loss Yamuna Pollution Key Role | Delhi Election Results 2025లో కేజ్రీకి కలిసి రాని యమున | ABP DesamArvind Kejriwal on AAP Election Loss | ఆమ్ ఆద్మీ ఓటమిపై స్పందించిన కేజ్రీవాల్ | ABP DesamDelhi Elections Results 2025 | మాస్టర్ మైండ్ Manish Sisodia ను వీక్ చేశారు..ఆప్ ను గద్దె దింపేశారు | ABP DesamDelhi Elections Results 2025 | Delhi గద్దె Arvind Kejriwal దిగిపోయేలా చేసింది ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌, ఏకంగా 31 మంది మావోయిస్టులు మృతి- కొనసాగుతోన్న ఆపరేషన్
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌, ఏకంగా 31 మంది మావోయిస్టులు మృతి- కొనసాగుతోన్న ఆపరేషన్
First GBS Death in Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
Chiranjeevi: మెగాస్టార్ కాదు... చిరంజీవి కొత్త ట్యాగ్ ఇచ్చిన విశ్వక్ సేన్
మెగాస్టార్ కాదు... చిరంజీవికి కొత్త ట్యాగ్ ఇచ్చిన విశ్వక్ సేన్
Cuttack Odi Toss Update: భారత్ బౌలింగ్.. జట్టులోకి కోహ్లీ..  వరుణ్ డెబ్యూ.. సిరీస్ పై టీమిండియా కన్ను, ఒత్తిడిలో బట్లర్ సేన
భారత్ బౌలింగ్.. జట్టులోకి కోహ్లీ రీ ఎంట్రీ.. వరుణ్ డెబ్యూ.. సిరీస్ పై టీమిండియా కన్ను, ఒత్తిడిలో బట్లర్ సేన
Thandel Box Office Collection Day 2: బాక్సాఫీస్ వద్ద దంచి కొడుతోన్న 'తండేల్' - రెండో రోజు కూడా కలెక్షన్ల జోరు, ఫుల్ జోష్‌లో మూవీ టీం
బాక్సాఫీస్ వద్ద దంచి కొడుతోన్న 'తండేల్' - రెండో రోజు కూడా కలెక్షన్ల జోరు, ఫుల్ జోష్‌లో మూవీ టీం
ITR Filing: రూ.12 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవాళ్లు కూడా ఇప్పుడు ఐటీఆర్ ఫైల్‌ చేయాల్సిందేనా?
రూ.12 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవాళ్లు కూడా ఇప్పుడు ఐటీఆర్ ఫైల్‌ చేయాల్సిందేనా?
Donald Trump: బహిష్కరణ నుంచి ప్రిన్స్ హ్యారీకి మినహాయింపు - భార్యా బాధితుడు కావడమే కారణమా!
బహిష్కరణ నుంచి ప్రిన్స్ హ్యారీకి మినహాయింపు - భార్యా బాధితుడు కావడమే కారణమా!
Embed widget