అన్వేషించండి

Ceasefire in Gaza: ఇజ్రాయెల్ - హమాస్ వివాదంలో భారత్ కీలక నిర్ణయం, ఆ విషయానికి మద్దతు

India Vote In UN: ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో తక్షణం కాల్పుల విరమణ, బందీలుగా ఉన్న వారందరిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ UNలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసింది. 

UN Resolution Demanding: ఇజ్రాయెల్ - హమాస్ వివాదం  (ISrael Hamas War)లో తక్షణం కాల్పుల విరమణ (Ceasefire), బందీలుగా ఉన్న వారందరిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి (United Nations) జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా భారత్ (India) ఓటు వేసింది. మంగళవారం ఐక్యరాజ్యసమితిలో జరిగిన అత్యవసర ప్రత్యేక సమావేశంలో ఈజిప్ట్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని 193 మంది సభ్యుల UN జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 153 ఓట్లు రాగా, 10 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. 23 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరు అయ్యాయి.

ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా మానవ సంక్షోభం ఉందని, పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి అనుకూలంగా భారతదేశం ఓటు వేసిందన్నారు.  అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో తీవ్రవాద దాడి జరిగింది, ఆ సమయంలో పట్టుకున్న బందీలపై ఆందోళన వ్యక్తం చేశారు. 

పెద్ద ఎత్తున జనజీవనం స్తంభించిందని, ముఖ్యంగా మహిళలు, పిల్లల భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. రెండు ప్రాంతాల మధ్య శాంతి నెలకొల్పాల్సిన ఆవశ్యకతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ మద్య సమతుల్యతను సాధించడమే సవాలు అని రుచిరా కాంబోజ్ పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించడానికి అంతర్జాతీయ సమాజం  ఉమ్మడిగా ఆలోచించడం గొప్ప విషయమని, భారత్ దానిని స్వాగతిస్తుందని పేర్కొన్నారు.  

గాజాలో తక్షణం మానవతావాద కాల్పుల విరమణను కోరుతూ అల్జీరియా, బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాలస్తీనా  తీర్మాణించాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అన్ని దేశాలు తమ బాధ్యతలను పాటించాలని ఐక్యారాజ్య సమితి పునరుద్ఘాటించింది. ముఖ్యంగా పౌరుల రక్షణకు సంబంధించిన అంశాలను విధిగా పాటించాలని యూన్ సూచించింది.

అలాగే బందీలను తక్షణమే, షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అయితే తీర్మాణంలో ఎక్కడా హమాస్ పేరు పెట్టకపోవడం గమనార్హం. ఈ ముసాయిదా తీర్మానానికి అమెరికా సవరణను ప్రతిపాదించింది. అక్టోబర్ 7, 2023 నుంచి ఇజ్రాయెల్‌లో హమాస్ చేసిన హేయమైన ఉగ్రవాద దాడులను వ్యతిరేకించాలని, ఖండించాలని ప్రతిపాదించింది. సవరణకు భారత్ అనుకూలంగా ఓటు వేసింది.

అక్టోబరులో, ఇజ్రాయెల్ - హమాస్ సంఘర్షణలో తక్షణ సంధి, గాజా స్ట్రిప్‌లో మానవతా సాయానికి అవరోధం లేకుండా పిలుపునిచ్చిన తీర్మానానికి ఇండియా గైర్హాజరైంది. ఆ సమయంలో గాజా స్ట్రిప్ అంతటా పౌరులకు అవసరమైన వస్తువులు, సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ జోర్డానియన్ -ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. యుద్ధంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, గాయపడ్డారని, వారికి సాయం అందిచాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉందని పేర్కొంది.

అక్టోబరు 7న హమాస్, ఇతర పాలస్తీనా సాయుధ గ్రూపులు జరిపిన తీవ్రవాద దాడుల్లో 33 మంది చిన్నారులతో సహా 1,200 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH) ప్రకారం, ఇప్పటి వరకు కనీసం 18,205 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 70 శాతం మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. 49,645 మంది గాయపడ్డారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Embed widget