అన్వేషించండి

Chief of Defence Staff: ఏంటీ సీడీఎస్.. కార్గిల్ యుద్ధ కాలంలోనే ఈ పదవిపై చర్చలు జరిగాయా?

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఆయనే భారత్ లో మెుట్ట మెుదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్. ఇంతకీ ఏంటీ సీడీఎస్ పోస్టు?

15-Aug-2019న అంటే 73వ స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోడీ.. కీలక ప్రకటన చేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని త్వరలో నియమించనున్నట్టు ఎర్రకోట మీద నుంచి ప్రకటించారు. ఆ తర్వాత సీడీఎస్‌ బాధ్యతలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. కమిటీ నివేదికను పరిశీలించిన కేబినెట్‌ కమిటీ కూడా ఆమోదించింది.
ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌ 2019‌‌ డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్ పదవి నుంచి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా 2020 జనవరి 1న నియమితులయ్యారు.

సీడీఎస్ అంటే ఏంటి?
వాస్తవానికి, సింగిల్ పాయింట్ మిలటరీ సలహాదారు పోస్టును సృష్టించడం అనేది కార్గిల్ అనంతర జరిగిన చర్చలలో ఒక భాగం. సైన్యం, నేవీ, వైమానిక దళాల అధిపతుల కంటేపై స్థానంలో ఉండే సీడీఎస్, ప్రభుత్వానికి సింగిల్ పాయింట్ సైనిక సలహాదారుగా వ్యవహరిస్తారు. భారత సైన్యం, భారత నౌకాదళం, భారత వాయుసేనతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పని చేస్తారు.  సైన్యంలోని మూడు విభాగాలకు సంబంధించిన విషయాలపై సలహాలు, సూచనలు ఇస్తారు. త్రివిధ దళాలను ఏకీకృతం చేయడమే దీని లక్ష్యం.

సీడీఎస్‌ ప్రధాన బాధ్యత త్రివిధ దళాలను సమన్వయం చేయడం. మూడు దళాల సంయుక్త వ్యూహాలు, కార్యాచరణపై కేంద్ర ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వడం. రక్షణ అంశాలకు సంబంధించిన సైనిక వ్యవహారాల్లో నైపుణ్యాలను పెంపొందించడం. త్రివిధ దళాల సంస్థల పాలనా పరమైన బాధ్యతలను సీడీఎస్‌ నిర్వహిస్తారు.

త్రివిధ దళాలకు సంబంధించిన ప్రణాళికలు, శిక్షణ, బడ్జెటింగ్ ఇలా అన్ని వేరు, వేరుగా ఉండేవి. సీడీఎస్ ఈ వ్యవహారాలతో పాటూ.. త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేలా పోస్టును క్రియేట్ చేశారు. ఇటు త్రివిధ దళాల అధిపతులు తమ విధులపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టేందుకు కూడా పూర్తి స్థాయి అవకాశం ఉంటుందనేది ప్రభుత్వ అభిప్రాయం. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వానికి ఒకే-పాయింట్ సైనిక సలహాను అందించడంలోనుంచి పుట్టిందే సీడీఎస్ పోస్ట్.

సీడీఎస్ పోస్ట్ గురించి గతంలో కూడా ప్రస్తావన వచ్చింది. 1999లో కార్గిల్‌ యుద్ధం తర్వాత ఏర్పాటైన కె.సుబ్రహ్మణ్యం కమిటీ తొలిసారి సీడీఎస్‌ నియామకాన్ని సిఫార్సు చేసింది. 2012లో ఏర్పాటైన నరేశ్‌ చంద్ర కమిటీ ఇదే నిర్ణయాన్ని తెలిపింది. 2016లో డీబీ షెట్కర్ కమిటీ కూడా సీడీఎస్ నియామక అవసరం ఉందని అభిప్రాయపడింది. తర్వాత కొన్ని రోజుల వరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రధాని మోడీ ప్రకటించిన తర్వాత.. కొన్ని రోజులకు మెుట్టమెుదటి సీడీఎస్ గా బిపిన్ రావత్ బాధ్యతలు స్వీకరించారు.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కూడా కొన్ని దేశాల్లో జాతీయ స్థాయిలో  సీడీఎస్ లాంటి పోస్టుల నియామకం జరిగింది. కానీ భారతదేశంలోనే జరగలేదు. కొన్ని దేశాలు ఈ అపాయింట్‌మెంట్ కోసం వేర్వేరు పేర్లను ఉపయోగించాయి. కానీ కేటాయించిన విధులు ఒకటే.

Also Read: Chopper Crash Coonoor: కుప్పకూలిన సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్.. 8 మంది మృతి

Also Read: CDS Bipin Rawat Helicopter Crash: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమీక్ష

Also Read: CDS Bipin Rawat Chopper Crash Live: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంటులో గురువారం ప్రకటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Yashasvi Jaiswal:  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.