అన్వేషించండి

అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు

ఏపీలో అదానీ- సౌరవిద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ మోహనరెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు అందింది.

 

అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ, ఆయన కంపెనీ సహచరులపై అమెరికాలో కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో.. ఆంధ్రప్రదేశ్‌లో అంతకు మించి దుమారం రేగింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి భారీ ముడుపులు ఆంధ్రప్రదేశ్‌లోనే అందినట్లు యు.ఎస్ ప్రాసిక్యూషన్ ఆరోపించింది. దాదాపు 1750కోట్ల రూపాయల ముడుపులు ప్రభుత్వ పెద్దలకు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటి సీఎం జగన్మోహనరెడ్డి ప్రోద్భలంతో అదానీ సంస్థకు లబ్ది చేకూరేలా ఒప్పందం కుదిరిందని, ఆ ఒప్పందాన్ని రద్దు చేసి.. విచారణ జరిపించాలని డిమాండ్లు మొదలయ్యాయి.

 

మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు

అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థకు అనుచిత లబ్ది చేకూర్చినందుకు గాను మాజీ సీఎం జగన్ మోహనరెడ్డిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని ఏపీ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు అందింది. సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీ వ్యవస్థాపకుడు నలమోతు చక్రవర్తి మంగళవారం డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద మాజీ సీఎం జగన్‌తో పాటు, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, గౌతమ్ అదానీపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలన్నారు.

 

అవినీతిపై కీలక ఆధారాలున్నాయి.

డిసెంబర్ 1,2021 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా -SECI నుంచి 7వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కిలోవాట్ 2.42 పైసలకు కొనేవిధంగా దీనిని మరో 7 పైసలు పెంచుకునేవిధంగా 25 ఏళ్లకు ఒప్పందం చేసుకుందని .. కానీ అదే సమయానికి గుజరాత్ లో 1.99పైసలకే యూనిట్ విద్యుత్‌ను  కొంటున్నారని చక్రవర్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయానికి ప్రజలపై భారం పడుతోందని మాత్రమే తాము అనుకున్నామని కానీ ఇటీవల గౌతం అదానీపై అమెరికాలోని న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో అక్కడ సెక్యూరిటి ఎక్సేంజెస్ కమిషన్ SEC చేసిన ఫిర్యాదుతో ఇందులో భారీ అవినీతి జరిగినట్లు బయటకు వచ్చిందని ఫిర్యాదులో తెలిపారు. అదానీ గ్రీన్ ఎనర్జీ ఛైర్మన్ గౌతం అదానీ ద్వారా అప్పటి ఏపీ ముఖ్యమంత్రి  జగన్ మోహనరెడ్డికి 1750కోట్లు అందినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు.  SECI ద్వారా ఏపీకి అదానీ గ్రీన్ ఎనర్జీని అందించేందుకు ఈ డీల్ కుదిరినట్లు అమెరికా అధికారులు చెప్పారని గుర్తు చేశారు.


అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు

 

సీఎంకే ముడుపులు అందాయి

SEC కోర్టుకు సమర్పించిన నివేదికలోని 54 వ పేరాను చక్రవర్తి కంప్లెయింట్ లో పొందుపరిచారు. దాని ప్రకారం “ ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లోనే చూసుకుంటే..  సెకీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు 7000 మెగావాట్లు విద్యుత్ అందించేందుకు సంప్రదింపులు జరిపారు. ఇందుకోసం ఒక్కో మెగావాట్‌ కు 25లక్షల చొప్పున అందించేందుకు అంగీకరించామని Azure ( అదానీ యు.ఎస్ పార్టనర్ )  ప్రతినిధులకు  అహ్మదాబాద్‌లో జరిగిన వ్యక్తిగత సమావేశం లోచెప్పారు. ఈ లెక్కన 7 వేల మెగావాట్లకు 1750కోట్లు (200మిలియన్$) చెల్లించారు. ఇందులో CMతో సహా ప్రభుత్వ అధికారులకు ముడుపులు అందాయి.”  అని ఉంది. 

 

విచారణ చేపట్టాలి 

గౌతం అదానీపై యు.ఎస్ లో నమోదైన కేసును అనుసరించి ఏపీలో ముడుపులు ముట్టినట్లు అర్థం అవుతోందన్నారు. అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం.. అర్థరాత్రి హడావిడిగా ఒప్పందంపై తన సంతకాన్ని అడిగారని చెప్పారని ఆయనతో బలవంతంగా సంతకం తీసుకున్నారన్న విషయం కూడా తెలుస్తోందాన్నారు.  అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థకు లబ్ది చేకూరేలా అప్పటి సీఎం వ్యవరించి ప్రజలను మోసగించారని.. అందుకోసం జగన్ పై, అప్పటి మంత్రి బాలినేని, ఇంధన కార్యదర్శి శ్రీకాంత్, గౌతమ్ అదానీలపై కేసులు నమోదు చేసి విచారించాలని ఫిర్యాదులో కోరారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati pipe burning case: అమరావతి పైపుల దహనం వెనుక కుట్ర - పోలీసుల అదుపులో నిందితుడు!
అమరావతి పైపుల దహనం వెనుక కుట్ర - పోలీసుల అదుపులో నిందితుడు!
AP Cabinet Meeting: ఏపీలో కొత్తగా 96 కోర్టులు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ఏపీలో కొత్తగా 96 కోర్టులు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
Nikhil Siddhartha : 6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
Pemmasani warning to Jagan: ఒక్క మాటతో చంపేయగలం - జగన్‌కు కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్
ఒక్క మాటతో చంపేయగలం - జగన్‌కు కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Embed widget