అన్వేషించండి

Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్

Telugu News: 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు కూడా ఇకపై ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వస్తారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Union Cabinet Decisions: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో అమలు అవుతున్న ఆయుష్మాన్ భారత్ విషయంలో మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలో 70 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికి ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించనుంది. వారు కూడా ఇకపై ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వస్తారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. ఈ ఆయుష్మాన్ భారత్ వల్ల రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనున్న సంగతి తెలిసిందే. తాజా నిర్ణయం కారణంగా 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు, 4.5 కోట్ల కుటుంబాలకు ఈ ప్రయోజనం చేకూరుతుందని కేబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. ఇప్పటికే ఈ పథకం కింద ఉన్న కుటుంబాలు వారి కుటుంబాల పెద్దలకు రూ.5 లక్షల అదనపు కవరేజీని పొందుతారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో లబ్ధిదారుల సామాజిక-ఆర్థిక స్థితి గతులతో సంబంధం లేకుండా 70 ఏళ్లు, అంతకంటే వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్లు అందరూ ఆయుష్మాన్ భారత్ (AB PM-JAY) ప్రయోజనాలను పొందేందుకు అర్హులని ఆయన తెలిపారు. అర్హులైన సీనియర్ సిటిజన్లకు ఈ పథకం కింద ఇకపై కొత్తగా ప్రత్యేకంగా ఓ కార్డు జారీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అయిన కుటుంబాల నుంచి 70 ఏళ్లు, లేదా  అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్‌లు ఏడాదికి రూ.5 లక్షలదాకా అడిషనల్ టాప్-అప్ కవర్ పొందుతారు.

మరో 5 కీలక నిర్ణయాలు

ఆయుష్మాన్ భారత్ ను 70 ఏళ్ల పైబడిన వారికి కూడా వర్తింపజేయడంతో పాటు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మరో 5 కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. జల విద్యుత్ ప్రాజెక్టులకు మౌలిక సదుపాయాలను కల్పించే విషయంలో సవరణలు చేశారు. 31,350 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం కూడా రూ.12,461 కోట్ల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచేందుకు రూ.10,900 కోట్లతో ‘పీఎం ఈ-డ్రైవ్’ అనే పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీని సాయంతో దేశవ్యాప్తంగా 88,500 ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rammohan Naidu: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
SLBC Tunnel Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
Kiran Abbavaram: 'స్టోరీ చెప్పండి.. బైక్ తీసుకెళ్లండి' - హీరో కిరణ్ అబ్బవరం బంపరాఫర్, మీరూ ట్రై చేయండి!
'స్టోరీ చెప్పండి.. బైక్ తీసుకెళ్లండి' - హీరో కిరణ్ అబ్బవరం బంపరాఫర్, మీరూ ట్రై చేయండి!
Sankranthiki Vasthunam On Zee5 OTT: జీ 5కి డబ్బులే డబ్బులు... ఓటీటీలోనూ రికార్డులు - కాసులు కురిపించిన 'సంక్రాంతికి వస్తున్నాం'
జీ 5కి డబ్బులే డబ్బులు... ఓటీటీలోనూ రికార్డులు - కాసులు కురిపించిన 'సంక్రాంతికి వస్తున్నాం'
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rammohan Naidu: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
SLBC Tunnel Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
Kiran Abbavaram: 'స్టోరీ చెప్పండి.. బైక్ తీసుకెళ్లండి' - హీరో కిరణ్ అబ్బవరం బంపరాఫర్, మీరూ ట్రై చేయండి!
'స్టోరీ చెప్పండి.. బైక్ తీసుకెళ్లండి' - హీరో కిరణ్ అబ్బవరం బంపరాఫర్, మీరూ ట్రై చేయండి!
Sankranthiki Vasthunam On Zee5 OTT: జీ 5కి డబ్బులే డబ్బులు... ఓటీటీలోనూ రికార్డులు - కాసులు కురిపించిన 'సంక్రాంతికి వస్తున్నాం'
జీ 5కి డబ్బులే డబ్బులు... ఓటీటీలోనూ రికార్డులు - కాసులు కురిపించిన 'సంక్రాంతికి వస్తున్నాం'
Nani Vs Vijay Devarakonda: విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
Gorantla Butchaih Chowdary: టీడీపీలో సీనియర్, ఎన్టీఆర్‌కు భక్తుడిని.. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
టీడీపీలో సీనియర్, ఎన్టీఆర్‌కు భక్తుడిని.. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
Samsung A56: భారత మార్కెట్లోకి 3 కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్న శాంసంగ్- స్పెసిఫికేషన్లు, ధరలు పూర్తి వివరాలిలా
భారత మార్కెట్లోకి 3 కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్న శాంసంగ్- స్పెసిఫికేషన్లు, ధరలు పూర్తి వివరాలిలా
Embed widget