అన్వేషించండి

Suicides: షాకింగ్ రిపోర్ట్, భారత్‌లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు - ఆ రాష్ట్రాల్లో మరీ దారుణం

Student Suicides: భారత్‌లో విద్యార్థుల ఆత్మహత్యలు జనాభా కన్నా వేగంగా పెరుగుతున్నాయని NCRB రిపోర్ట్ వెల్లడించింది. ఈ సమస్య మహమ్మారిలా పట్టి పీడిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

Student Suicides in India: భారత్‌లో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఏడాది లెక్కల వారీగా చూస్తే జనాభా కన్నా వేగంగా ఆత్మహత్యలే పెరుగుతున్నాయని NCRB రిపోర్ట్ వెల్లడించింది. విద్యార్థుల ఆత్మహత్యల సమస్య దేశాన్ని ఓ మహమ్మారిలా పట్టి పీడిస్తోందని అసహనం వ్యక్తం చేసింది. ఇటీవలే ఈ నివేదికను విడుదల చేసింది. ఏటా ఆత్మహత్యలు 2% మేర పెరుగుతున్నట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం ఏటా 4% మేర పెరుగుతున్నట్టు వెల్లడించింది. 20 ఏళ్లలో ఈ ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నట్టు తెలిపింది. 

"గత రెండు దశాబ్దాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. 4% మేర పెరుగుదల కనిపిస్తోంది. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ. 2022 లో 53% మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్లంతా అబ్బాయిలే. అయితే...2021-22 మధ్య కాలంలో ఈ సూసైడ్స్ సంఖ్య 6% తగ్గింది. అటు మహిళా విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం 7% మేర పెరిగింది. ఏటా జనాభా రేటు కన్నా వేగంగా ఈ ఆత్మహత్యలే పెరుగుతున్నాయి. గత పదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 6,654  నుంచి 13,044 కి పెరిగింది"

- NCRB రిపోర్ట్

ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ..

మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశం మొత్తం నమోదవుతున్న వాటిలో ఇవే మూడోవంతు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29% మేర ఆత్మహత్యలు నమోదవుతున్నట్టు ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఈ జాబితాలో రాజస్థాన్‌ పదో స్థానంలో ఉంది. అక్కడి కోటా ప్రాంతంలో ఈ మధ్య కాలంలో సూసైడ్స్ పెరుగుతున్నాయి. FIRల ఆధారంగా ఈ లెక్కలు తేల్చింది NCRB. అయితే...ఇంకా FIR నమోదు కాని కేసులు ఎన్నో ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా కేసుల లెక్కలు తేల్చడంలో నిర్లక్ష్యం జరుగుతోందన్న వాదనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. దీన్నో జాతీయసమస్యగా తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాసంస్థలూ ఈ ఆత్మహత్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఈ నివేది సూచించింది. (Also Read: Gujarat Rains: గుజరాత్‌ని ముంచెత్తుతున్న వరదలు, మూడు రోజుల్లోనే విలయం - 28 మంది మృతి)

"విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరముంది. ఇదంతా విద్యా సంస్థల్లోనే జరగాలి. వాళ్ల కెరీర్ గురించి ముందుగానే అవగాహన కల్పించాలి. వాళ్ల సిలబస్‌లోనే ఇందుకు సంబంధించిన అంశాలు జోడించాలి. ఈ తరహా ఇనిషియేషన్ తీసుకుంటేనే పరిస్థితుల్లో మార్పు వస్తుంది"

- నిపుణులు

పురుషులు, మహిళలను పోల్చి చూస్తే మహిళల్లో సూసైడ్ రేట్ ఎక్కువగా ఉంటోంది. 61% మంది మహిళా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు తేలింది. అయితే..మొత్తంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే అటు మహిళలతో పాటు పురుషుల్లోనూ 5% మేర సూసైడ్ రేటు పెరిగింది. ఇవి తగ్గుముఖం పట్టాలంటే కౌన్సిలింగ్ ఒక్కటే సరైన మార్గం అని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. 

Also Read: Crime News: రాత్రి గాఢ నిద్రలో, తెల్లవారి లేచే సరికి దారుణ హత్య - మహిళ మర్డర్ మిస్టరీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Exit trafficking case: ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?
ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?
Cyberabad Gandipet land scam 2026: గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!
గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
CM Vijay Condoles Ajith: అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
IPL Best Ever Opening Pair: టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ.. మాజీ క్రికెట‌ర్ అనాల‌సిస్
టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ..
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Embed widget