అన్వేషించండి

Nagababu As MLC: ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారు చేసిన పవన్ కళ్యాణ్

Andhra Pradesh News | ఏపీలో త్వరగా జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా జనసేన నేత నాగబాబు పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ ఓ ప్రకటన చేసింది.

AP MLC Elections | అమరావతి: శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్నటి వరకూ ఎమ్మెల్సీ అభ్యర్థి నాగబాబు పేరు ప్రచారం కాగా, బుధవారం ఉదయం ఆయన రాజ్యసభ స్థానం కోసం చూస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఊపందుకున్న సమయంలో జనసేన పార్టీ వదంతులకు చెక్ పెట్టింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నాగబాబు ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నుంచి సమాచారం వచ్చింది. దాంతో నాగబాబు నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారని పి.హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా..

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ, తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ స్థానాలు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు ఫిబ్రవరి 27న జరిగాయి. అంతలోనే ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు, తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్ కమిషన్ (EC) ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెలాఖరులో మొత్తం 10 స్థానాలు ఖాళీ కానున్నాయి. మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, మార్చి 20న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలు ప్రకటించనుంది ఈసీ. మార్చి 29న ఏపీలో 5 మంది ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు, తెలంగాణలో 5 మంది ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. 

ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసీ షెడ్యూల్ విడుదల, తేదీల వివరాలు

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల - మార్చి 3, 2025
- నామినేషన్లకు చివరి తేదీ - మార్చి 10, 2025 సోమవారం
- నామినేషన్ల పరిశీలన - మార్చి 11, 2025
- నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు - మార్చి 13, 2025
- ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ - మార్చి 20, 2025 ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
- ఓట్ల లెక్కింపు - మార్చి 20న సాయంత్రం 5 గంటలకు

ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందా..
ఏపీలో ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, పి.అశోక్‌బాబు, జంగా కృష్ణమూర్తి , దువ్వారపు రామారావు,  తిరుమలనాయుడు పదవీకాలం మార్చి 29న ముగియనుంది. వీరిలో జంగా కృష్ణమూర్తి మినహా మిగతా ఎమ్మెల్సీలు టీడీపీ నుంచి ఎన్నికైన వారే. ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి సైతం టీడీపీలో చేరడం తెలిసిందే. రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవి కాలం ముగియనుండగా.. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉన్న కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ఈ 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను దక్కించుకోనున్నాయి. జనసేన నుంచి నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసింది. ఆయన త్వరలో ఏపీ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 

Also Read: AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీలో కీలక పరిణామం- జగన్ ను క్షమించి వదిలేస్తున్న: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Breaking News: విజయవాడలోని మధురానగర్‌లో బిర్యాని షాపు దగ్ధం! 
విజయవాడలోని మధురానగర్‌లో బిర్యాని షాపు దగ్ధం! 
YSRCP Nellore Politics: నెల్లూరు వైసీపీలో తీవ్ర సంక్షోభం - జగన్ సంచలన నిర్ణయం?
నెల్లూరు వైసీపీలో తీవ్ర సంక్షోభం - జగన్ సంచలన నిర్ణయం?
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Jana Nayagan Box Office Collection Day 2: 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్! 
కలెక్షన్లలో విజయ్‌కు భారీ దెబ్బ... వంద కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... కానీ రెండో రోజు అంతేనా?
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి!
తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి!
Embed widget