అన్వేషించండి

Delhi Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం- రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సహా ప్రముఖులు సంతాపం

PM Modi Expresses Condolences on Delhi Railway Station Stampede | ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

President Murmu PM Modi Expresses Condolences | న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. మహాకుంభమేళాకు వెళ్లాలని ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వచ్చిన భక్తులు తొక్కిసలాటలో మృతిచెందారు. శనివారం రాత్రి రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట (New Delhi Railway Station Stampede)లో ఆదివారం ఉదయం వరకు 14 మంది మహిళలు సహా 18 మంది మృతిచెందగా, మరో 25 మంది వరకు స్థానిక లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఓ వైపు రెండు రైళ్లు ఆలస్యం కావడం, మరోవైపు ప్రయాగ్‌రాజ్ కు వెళ్లే రైళ్లు కనిపించాయని.. స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా 14, 15 ప్లాట్‌ఫాంలకు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగి విషాదం నెలకొందని అధికారులు తెలిపారు. ఊపిరాడక కొందరు ప్రయాణికులు అల్లాల్లాడిపోయారు.

మహా కుంభమేళాకు వెళ్లాలనుకుంటే మహా విషాదం..

మహా కుంభమేళాకు వెళ్లాలని ఢిల్లీ రైల్వేస్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు తొక్కిసలాట జరిగి మృతిచెందిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడమే తొక్కిసలాటకు కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం జరగడం బాధాకరం. ఆ మృతుల కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని రాష్ట్రపతి ముర్ము ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

ప్రధాని మోదీ విచారం..

‘న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో మరణాలు సంభవించడం బాధాకరం. తమ కుటుంబసభ్యులను కోల్పోయిన వారి గురించే నా ఆలోచనలు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. ఈ తొక్కిసలాటలో బాధితులకు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు’ అని ప్రధాని మోదీ పోస్ట్ చేశారు.

Also Read: Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమేంటి - ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే.. 

ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్

లోక్‌సభ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటపై స్పందించారు. తొక్కిసలాట జరిగి పలువురు చనిపోవడం, కొందరు గాయపడటం చాలా బాధాకరం అన్నారు. ఈ ఘటన మరోసారి రైల్వేశాఖ వైఫల్యాన్ని, మోదీ ప్రభుత్వ అసమర్థతను  చూపుతుందన్నారు. మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్‌కు భారీ సంఖ్యలో భక్తులు వెళుతున్నారని తెలిసినా, రైల్వే స్టేషన్‌లో మెరుగైన ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రశ్నించారు. 

Also Read: New Delhi Stampede Compensation: న్యూఢిల్లీలో తొక్కిసలాట ఘటన, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ భారీ పరిహారం- గాయపడితే రూ.2.5 లక్షలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 2 Exam Postpone: గ్రూప్‌ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా! కాసేపట్లో కీలక ప్రకటన
గ్రూప్‌ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా! కాసేపట్లో కీలక ప్రకటన
BRS MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Andhra Pradesh CM Phone Number:చంద్రబాబుకు సమస్య చెప్పుకోవాలనుకుంటున్నారా ? ఇదిగో ఫోన్ నెంబర్
చంద్రబాబుకు సమస్య చెప్పుకోవాలనుకుంటున్నారా ? ఇదిగో ఫోన్ నెంబర్
Revanth Reddy on SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 2 Exam Postpone: గ్రూప్‌ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా! కాసేపట్లో కీలక ప్రకటన
గ్రూప్‌ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా! కాసేపట్లో కీలక ప్రకటన
BRS MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Andhra Pradesh CM Phone Number:చంద్రబాబుకు సమస్య చెప్పుకోవాలనుకుంటున్నారా ? ఇదిగో ఫోన్ నెంబర్
చంద్రబాబుకు సమస్య చెప్పుకోవాలనుకుంటున్నారా ? ఇదిగో ఫోన్ నెంబర్
Revanth Reddy on SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్
Kash Patel as FBI Director: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్‌, మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్‌, మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు
Actor Prudhvi Raj: వేసవిలో 11 సార్లు నీళ్లు తాగండి- పృథ్వీ ఆరోగ్య సలహాలు!
వేసవిలో 11 సార్లు నీళ్లు తాగండి- పృథ్వీ ఆరోగ్య సలహాలు!
Odela 2 Teaser: నీరూ, నిప్పూ, గాలీ... అన్నీ నా కోపానికి దాసోహమే...  పవర్ ఫుల్‌గా తమన్నా 'ఓదెల 2' టీజర్... చూశారా?
నీరూ, నిప్పూ, గాలీ... అన్నీ నా కోపానికి దాసోహమే... పవర్ ఫుల్‌గా తమన్నా 'ఓదెల 2' టీజర్... చూశారా?
India vs Pakistan: ఇటీవ‌ల పాక్ పై భార‌త్ దే పైచేయి.. చివ‌రిసారిగా ఇండియా చేతిలో పాక్ ఘోర ప‌రాభవం.. రేప‌టి మ్యాచ్ లో ఓడితే ఇంటికే!
ఇటీవ‌ల పాక్ పై భార‌త్ దే పైచేయి.. చివ‌రిసారిగా ఇండియా చేతిలో పాక్ ఘోర ప‌రాభవం.. రేప‌టి మ్యాచ్ లో ఓడితే ఇంటికే!
Embed widget