అన్వేషించండి

Revanth Reddy on SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్

SLBC Tunnel Collapse | శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ కూలిన ఘటనలో కొందరు కార్మికులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో లోపల 50 మంది వరకు ఉన్నారని నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు.

Telangana CM Revanth Reddy on SLBC tunnel collapse | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద జరిగిన ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  టన్నెల్‌ వద్ద  14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలడంతో అందులో పనిచేస్తున్న పలువురికి గాయాలయ్యాయి. ఇందులో ఇంజినీర్లు, సిబ్బంది ఉన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే  అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, నాగర్‌కర్నూల్ ఎస్పీ, అగ్నిమాపక శాఖ, ఇరిగేషన్ విభాగం అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, కొందరు అధికారులు ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రమాదం జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాంతానికి బయలుదేరారు. 

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలి కార్మికులకు గాయాలు

నాగర్‌కర్నూల్‌: ఎస్‌ఎల్‌బీసీ లోని ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్‌ వద్ద ప్రమాదం జరిగింది. మూడు మీటర్ల మేర పై కప్పు కూలడంతో కొందరు కార్మికులు లోపల చిక్కుకుపోయారు. మార్నింగ్‌ షిఫ్ట్‌లో 50 మంది వరకు కార్మికులు ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నారు. దోమలపెంట సమీపంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో టన్నెల్ పైకప్పు మూడు మీటర్ల మేర కూలడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. 

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ పైకప్పు కూలి కార్మికులు గాయపడటంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ హుటాహుటిన సంఘటనా స్థలికి బయలుదేరారు. సహాయక చర్యలపై అధికారులతో ఆరా తీసిన ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో టన్నెల్ లో ఘటన జరిగిన చోటుకు వెళ్తున్నారు. టన్నెల్ లోపలికి నీళ్లు వచ్చినట్లు తెలిసినట్లు చెప్పారు. ముగ్గురు కార్మికులకు గాయాలు కాగా, వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు. గాయపడిన వారు జేపీ కంపెనీ కార్మికులు అని సమాచారం. 

Also Read: SLBC Tunnel Collapse: కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌, సొరంగంలో చిక్కుకున్న 50 కార్మికులు 

నల్గొండ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించేందుకు దాదాపు 44 కిలోమీటర్ల మేర ఇన్‌ లెట్‌, అవుట్‌ లెట్‌ సొరంగాలు తవ్వాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకూ 34 కిలోమీటర్ల మేర పని పూర్తయింది. ఇంకా 10 కిలోమీటర్ల మేర పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు 2026 జూన్ వరకు పూర్తి చేసి, నల్గొండ వాసులకు సాగు, తాగునీరు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 18న పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం తవ్వకాలు చేస్తుంటే, ప్రమాదవశాత్తూ టన్నెల్ పైకప్పు మూడు మీటర్ల మేర కూలడంతో విషాదం నెలకొంది.

మంత్రి కోమటిరెడ్డి విచారం

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంపై మంత్రి కోమటిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు టన్నెల్‌ పనుల్లో భాగంగా శ్రీశైలం నుంచి దేవరకొండ వైపు వెళ్లే టన్నెల్ 14 కిలోమీటర్ వద్ద (దోమలపెంట వద్ద) సి పేజ్ ను పూడ్చివేసిన కాంక్రీట్ సెగ్మెంట్ స్లిప్ కావడంతో ప్రమాదం జరిగిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి  టన్నెల్‌ వద్ద ఘటనపై అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Good news for vehicle buyers in Telangana: తెలంగాణ వాహనదారులకు బంపర్ ఆఫర్ - రెండో వాహనంపై 2 శాతం అదనపు పన్ను రద్దు!
తెలంగాణ వాహనదారులకు బంపర్ ఆఫర్ - రెండో వాహనంపై 2 శాతం అదనపు పన్ను రద్దు!
Gaddar Awards 2026: గద్దర్ అవార్డుల్లో గోల్‌మాల్... రెండు కోట్లు నొక్కేశారా? బీఆర్ఎస్ నేత సంచలన ట్వీట్
గద్దర్ అవార్డుల్లో గోల్‌మాల్... రెండు కోట్లు నొక్కేశారా? బీఆర్ఎస్ నేత సంచలన ట్వీట్
Madhavi Latha BJP leader: ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రేయర్ రూంలో హైదరాబాద్ బీజేపీ నేత మాధవీలత ప్రార్థనలు - ముస్లింల నమాజ్‌కు ఆటంకం కలిగించారని విమర్శలు
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రేయర్ రూంలో హైదరాబాద్ బీజేపీ నేత మాధవీలత ప్రార్థనలు - ముస్లింల నమాజ్‌కు ఆటంకం కలిగించారని విమర్శలు
Driving License Rules: తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇక 3 దశల విధానం- LLR ముందు ఎగ్జామ్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇక 3 దశల విధానం- LLR ముందు ఎగ్జామ్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే

వీడియోలు

RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
Embed widget