అన్వేషించండి

KTR Latest News: డేటా సెంటర్లతో నీటి, విద్యుత్ కొరత- బిగ్ ఇష్యూని తెరపైకి తీసుకొచ్చిన కేటీఆర్ 

KTR Latest News: పర్యావరణాన్ని, సాంకేతికతను సరిగా అనుసంధానించకపోతే ప్రమాదం ముంచుకొస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. డేటా కేంద్రాలనే ఉదాహరణగా పేర్కొన్నారు.

KTR Latest News: ప్రపంచంలో టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందితోంది. మానవుడి అవసరాలకు మించి జరుగుతోంది. సాంకేతికత పెంచుకుంటూ వెళ్తున్నప్పటికీ అది కలిగించే సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదు. అలాంటి వాటిలో డేటా సెంటర్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా డేటా సెంటరర్ల ఏర్పాటు చేసేందుకు కూడా వివిధ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి డేటా సెంటర్ల ఏర్పాటుతో అనేక సమస్యలు వస్తాయని పోరాటాలు చేస్తున్న వాళ్లు కూడా ఉన్నారు.

ఇదే ఇష్యూను బెంగళూరులో జరిగిన  'ఎంట్రప్రెన్యూర్ టెక్ & ఇన్నోవేషన్ సమిట్ - 2025'లో మాజీ మంత్రి కేటీఆర్ లేవనెత్తారు. టెక్నాలజీకి రెండు వైపు పదును ఉంటుందని దాన్ని వాడుకోవడంలోనే కాకుండా దాని నుంచి వచ్చే సమస్యల పరిష్కరానికి కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక అభివృద్ధి పర్యావరణానికి హాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. ఈ విషయాల గురించి చెబుతూనే ప్రతి రోజూ భారీగా డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారని వాటి మూలంగా వచ్చే సమస్యలను మాత్రం ఎవరూ అడ్రెస్ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.  

డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీగా విద్యుత్, వాటర్ అవసరం అవుతాయని కేటీఆర్ తెలిపారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో కలిగి దుష్ప్రయోజనాలపై అధ్యయనం ఉండటం లేదని  ఇది ప్రమాదకరమని అన్నారు. ఐఓటీ, మోబైల్ యాప్‌లు, డేటా స్టోరేజ్ రోజురోజుకు పెరుగుతోందని దఇది పర్యావరణానికి కేడు చేస్తాయో ఆలోచించాలన్నారు. వాటికి విరుగుడు చర్యలు కూడా తీసుకోవాలని సూచించారు.  

Also Read: దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!

డేటా సెంటర్ల వల్ల వచ్చే నష్టాలు ఏంటీ?
యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ మే 2021 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ డేటా విపరీతంగా పెరుగుతుందని దీని కారణంగా 2010తో పోలిస్తే 146 రెట్లు పెరుగుతుందని అంచనా వేశారు. సర్వర్లు, రౌటర్లు, స్టోరేజ్ సిస్టమ్‌లు, క్లౌడ్-ఆధారిత కంప్యూటింగ్, డిజిటల్ స్టోరేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ గేమింగ్, స్ట్రీమింగ్ మ్యూజిక్, సినిమాలు, డేటా అనలిటిక్స్, ఇతర సేవలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అందుకే డేటా సెంటర్‌ మరిన్ని అవసరం అవుతాయని చెబుతున్నారు. 

గ్లోబల్ డేటా బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ అయిన Statista.com నుంచి వచ్చిన సమాచారం ప్రకారం డేటా సెంటర్ పరిశ్రమలో యుఎస్ ప్రపంచ అగ్రగామిగా ఉంది. ఈ డేటా సెంటర్ల నిరంతరం పని చేస్తూ ఉండాలి. భారీ భవనాల్లో ఉండే ఈ డేటా కేంద్రాలను కూల్ చేయడానికి భారీగా నీరు, విద్యుత్ అవసరం. నీరు రెండు రకాలుగా ఇక్కడ అవసరం అవుతుంది. డేటా సెంటర్లు పని చేయడానికి అవసరమైన విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి అవసరవుుతంది. రెండు సర్వర్లు, ఇతర డేటా సెంటర్ పరికరాల నుంచి వెలువడే వేడిని కూల్ చేయడానికి  యూజ్ చేస్తారు.  

ఇలా డేటా సెంటర్‌లకు నీటిని వినియోగించడం వల్ల ఆ ప్రాంతాల్లో వాటర్ క్రైసిస్ వస్తోంది. అందుకే చాలా దేశాల్లో వీటికి వ్యతిరేకంగా ఉద్యమాలు వస్తున్నాయి. డేటా సెంటర్‌ల కోసం ఎంత నీరు వినియోగిస్తున్నారు అనేది మాత్రం ఇంత వరకు ఎవరూ చెప్పలేదు. కానీ ది డాల్స్, ఒరెగాన్‌లో, సుదీర్ఘమైన న్యాయ పోరాటం తర్వాత గూగుల్ డేటా సెంటర్లు 355 మిలియన్ గ్యాలన్లకు పైగా వినియోగిస్తోందని తేలింది. కానీ అందుకు తగ్గట్టుగా పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు  తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇలా బింధువులుగా ఉన్న ఉద్యమాలు రేపటి భవిష్యత్‌లో మరింత ఉద్ధృతం అయ్యే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. పర్యావరణాన్ని, సాంకేతికతను అనుసంధానించి అభివృద్ధి జరగాలని అభిప్రాయపడ్డారు. 

Also Read: వివాదాలను పరిష్కరించాలని ఎమ్మార్ విజ్ఞప్తి - లీగల్ ఏజెన్సీకి రేవంత్ ఆమోదం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Assembly Elections: కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
Bihar Stampede: బీహార్‌లో తొక్కిసలాట జరిగిన 'శీతలామాత' ఆలయం విశిష్టత ఏంటి?
బీహార్‌లో తొక్కిసలాట జరిగిన 'శీతలామాత' ఆలయం విశిష్టత ఏంటి?
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Jayalalithaa Residence: హైదరాబాద్‌లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్.. అసలు కారణం ఇదే..!
హైదరాబాద్‌లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్.. అసలు కారణం ఇదే..!

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Kerala Assembly Elections: కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
Donald Trump: దారిలోకి రాని ఇరాన్! ట్రంప్‌లో పెరిగిపోతున్న అసహనం! మిత్రదేశాలకు తీవ్ర హెచ్చరిక!
దారిలోకి రాని ఇరాన్! ట్రంప్‌లో పెరిగిపోతున్న అసహనం! మిత్రదేశాలకు తీవ్ర హెచ్చరిక!
IT Rules 2021 Amendments:డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?
డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Embed widget