అన్వేషించండి

Hyderabad Latest News: దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!

Hyderabad Latest News:తెలంగాణలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి చేరబోతోంది. ఆ దిశగా సర్వం సిద్దమైంది. ఆలయ అభివృద్దితోపాటు, ఆదాయం లెక్కలు పక్కాగా ఉంటాయా?

Hyderabad Latest News: పాతబస్తీలోని ఛార్మినార్‌ను ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ హిందువుకూ ఓ సెంటిమెంట్. మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటైన ఆలయం కావడం వల్లనో, లేక కోరిన కోర్కెలు తీర్చే మహిమగల దేవతగా పేరొందడం వల్లనో, భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం దర్శానికి నిత్యం భక్తులు భారీగా తరలివస్తుంటారు. అంతేకాదు బిజెపి కేంద్ర పెద్దలు అమిత్ షా, నడ్డా వంటి కీలక నేతలు సైతం హైదరాబాద్ వచ్చారంటే తప్పకుండా ఛార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోకుండా వెళ్లరు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం బిజెపి నేతలకు ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు ఇటీవల కాలంలో పొలిటికల్ పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లకు, ప్రమాణాలకు భాగ్యలక్ష్మీ ఆలయం వేదికగా మారింది. అంతలా హిందువుల సెంటిమెంట్ ఈ ఆలయంతో పెనవేసుకుని ఉంది. హిందూ, ముస్లింల ఐక్యతతోపాటు, మత విధ్వేషాలు చెలరేగకుండా చూడాల్సిన సున్నితమైన ప్రదేశం కూడా ఈ భాగ్యలక్ష్మి ఆలయం. ఇంతలా ప్రధాన్యత ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం తాజాగా దేవాదాయశాఖ ఆధీనంలోకి వెళ్లనుంది. ఇకపై హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయ నిర్వహణ దేవాదాయశాఖ పరిధిలోకి రానుంది. ఈ మేరకు దేవాదాయ శాఖను ట్రైబ్యూనల్ ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

భాగ్యలక్ష్మీ ఆలయ చరిత్ర గురించి మాట్లడుకుంటే..1960 సంవత్సరంలో చార్మినార్ వద్దనున్న ఈ  అమ్మవారి ఆలయ పరిధిలో బస్సు ప్రమాదం జరగడంతో అమ్మవారి విగ్రహం కూలిపోయింది. స్థానిక భక్తులు విరాళాలు సేకరించి అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించారు. అంతకుముందు పోచమ్మ పేరుతో ఉన్న అమ్మవారి పేరును అప్పటి నుంచి భాగ్యలక్ష్మి అమ్మవారిగా మార్చారు. అలా నాటి నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసే మహంత్ రామ్‌చంద్ర దాసు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్ మోహన్ దాసు అనే వ్యక్తిని పూజారిగా నియమించారు. టెంపుల్ ట్రస్టీ మీద గతంలో ఉన్న సుప్రీంకోర్టు తీర్పు కారణంగా హెరిడెటరీ ట్రస్టీ ఆర్డర్స్‌తో ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకొని ఆదాయాన్ని రాజ్ మోహన్‌దాసు ఒక్కరే అనుభవిస్తూ వచ్చారు. దీనిపై మహంత్ రామ్‌చంద్ర దాసు కుమార్తె భాగ్యలక్ష్మీ ఆలయం అజామాయిషీ చేస్తున్న వారిపై కోర్టును ఆశ్రయించారు. కోట్లాది రూపాయాల ఆలయ నిధులను ప్రస్తుత నిర్వహకులు దుర్వినియోగం చేస్తున్నట్టు సాక్షాధారాలను కూడా ట్రైబ్యూనల్ దృష్టికి తీసుకెళ్లడంతో భాగ్యలక్ష్మి ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగించాలని తాజాగా తీర్పు ఇచ్చినట్టు దేవాదాయశాఖ అధికార వర్గాల సమాచారం.

ప్రస్తుతం ఉన్న భాగ్యలక్ష్మి ఆలయ నిర్వహణ బాధ్యతను మహంత్ మనోహర్ దాసు, మహంత్ రామ్‌చంద్రదాసు నుంచి దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోనుంది. 1960 దశకం నుంచి వీరు ఆలయ నిర్వహణ భాధ్యతలు చూస్తున్నారు. ఇప్పుడు నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆలయానికి తక్షణమే ఈఓను నియమించి ఆలయంలో ఎటువంటి అవకతవకలులేకుండా , అభివృద్దిలో ముందుకు తీసుకు వెళ్ళాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ ఆలయ ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదులపై కోర్టు విచారణ అనంతరం ఈ ఆదేశాలు జారీ అయినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఇప్పటి వరకూ ఆలయ ఆదాయం, ఖర్చులు ఇతర వివరాలను సేకరించడంతోపాటు భక్తుల విరాళాలు, నిధుల దుర్వినియోగంపై విచారణ జరపడంతోపాటు, ఒకవేళ అవకతవకలు జరిగితే తగిన చర్యలు తీసుకోవాలని ట్రైబ్యునల్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

Also Read: హైదరాబాద్‌లో 120 దేశాల సుందరీమణులు - మే 7 నుంచి 31వరకు అంతర్జాతీయ మిస్ వరల్డ్ పోటీలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

T20 world cup India vs usa: అమెరికాపై టీమిండియా ఘన విజయం.. సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్, రాణించిన సిరాజ్, అర్షదీప్, అక్షర్
అమెరికాపై టీమిండియా ఘన విజయం.. సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్, రాణించిన సిరాజ్, అర్షదీప్, అక్షర్
Nara Lokesh: భారత క్వాంటమ్ టెక్నాలజీకి పునాది అమరావతి క్వాంటమ్ వ్యాలీ.. రాష్ట్రానికి 3 బలాలు, భారీ ఉద్యోగాలు: నారా లోకేష్
భారత క్వాంటమ్ టెక్నాలజీకి పునాది అమరావతి క్వాంటమ్ వ్యాలీ.. రాష్ట్రానికి 3 బలాలు, భారీ ఉద్యోగాలు: నారా లోకేష్
Forensic Science Lab Fire Update: ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంలో కీలక కేసుల సాక్ష్యాలన్నీ బుగ్గి - అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందా?
ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంలో కీలక కేసుల సాక్ష్యాలన్నీ బుగ్గి - అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందా?
Telangana Municipal Elections 2026: సొంత అభ్యర్థులతో జగిత్యాలలో జీవన్ రెడ్డి ప్రచారం - డైరక్ట్ తిరుగుబాటే - సీనియర్ నేత గీత దాటేశారా?
సొంత అభ్యర్థులతో జగిత్యాలలో జీవన్ రెడ్డి ప్రచారం - డైరక్ట్ తిరుగుబాటే - సీనియర్ నేత గీత దాటేశారా?

వీడియోలు

Ind vs USA Match Preview T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ పోరాటం ప్రారంభం | ABP Desam
Harshit Rana out Siraj In T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ కు హర్షిత్ దూరం..సిరాజ్ కి ఎంట్రీ | ABP Desam
Ayush Mhatre Speech U19 World Cup Win | రోహిత్, హర్మన్ వారసత్వం కొనసాగించామన్న ఆయుష్ | ABP Desam
Vaibhav Sooryavanshi U19 World Cup Final | ఏడాదిలో వీర విధ్వంసం సృష్టించిన వైభవ్ | ABP Desam
Private Travels Bus Fire at Kanchikacherla | కంచికర్ల దగ్గర తగలబడిన ప్రైవేట్ బస్సు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 world cup India vs usa: అమెరికాపై టీమిండియా ఘన విజయం.. సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్, రాణించిన సిరాజ్, అర్షదీప్, అక్షర్
అమెరికాపై టీమిండియా ఘన విజయం.. సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్, రాణించిన సిరాజ్, అర్షదీప్, అక్షర్
Nara Lokesh: భారత క్వాంటమ్ టెక్నాలజీకి పునాది అమరావతి క్వాంటమ్ వ్యాలీ.. రాష్ట్రానికి 3 బలాలు, భారీ ఉద్యోగాలు: నారా లోకేష్
భారత క్వాంటమ్ టెక్నాలజీకి పునాది అమరావతి క్వాంటమ్ వ్యాలీ.. రాష్ట్రానికి 3 బలాలు, భారీ ఉద్యోగాలు: నారా లోకేష్
Forensic Science Lab Fire Update: ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంలో కీలక కేసుల సాక్ష్యాలన్నీ బుగ్గి - అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందా?
ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంలో కీలక కేసుల సాక్ష్యాలన్నీ బుగ్గి - అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందా?
Telangana Municipal Elections 2026: సొంత అభ్యర్థులతో జగిత్యాలలో జీవన్ రెడ్డి ప్రచారం - డైరక్ట్ తిరుగుబాటే - సీనియర్ నేత గీత దాటేశారా?
సొంత అభ్యర్థులతో జగిత్యాలలో జీవన్ రెడ్డి ప్రచారం - డైరక్ట్ తిరుగుబాటే - సీనియర్ నేత గీత దాటేశారా?
SIP Investment Plan: దీర్ఘకాలంలో లాభాల కోసం సిప్ ఒక్కటే బెస్ట్.. తెలివిగా ఇన్వెస్ట్‌మెంట్ రూట్ తెలుసుకోండి
దీర్ఘకాలంలో లాభాల కోసం సిప్ ఒక్కటే బెస్ట్.. తెలివిగా ఇన్వెస్ట్‌మెంట్ రూట్ తెలుసుకోండి
Pawan Kalyan: పవన్ కల్యాణ్ దృష్టిలో పడితే జెట్ స్పీడే - సోషల్ మీడియాలో పిల్లల పోస్టు చూసి రోడ్ మంజూరు
పవన్ కల్యాణ్ దృష్టిలో పడితే జెట్ స్పీడే - సోషల్ మీడియాలో పిల్లల పోస్టు చూసి రోడ్ మంజూరు
Indian couple: పెళ్లి ఖర్చుతో ఇల్లు కొని అందులోనే పెళ్లి చేసుకున్నారు - ఈ జంట ప్లానింగ్ అదుర్స్ !
పెళ్లి ఖర్చుతో ఇల్లు కొని అందులోనే పెళ్లి చేసుకున్నారు - ఈ జంట ప్లానింగ్ అదుర్స్ !
Tata Curvv EV కొంటే రూ. 3.80 లక్షల వరకు డిస్కౌంట్‌ - Punch, Tiago పైనా ప్రయోజనాలు
టాటా ఎలక్ట్రిక్‌ కార్లపై ధమాకా ఆఫర్లు - కామన్‌ మ్యాన్‌ కార్లన్నీ డిస్కౌంట్‌ లిస్ట్‌లో ఉన్నాయ్‌!
Embed widget