Bijapur Encounter: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఎన్కౌంటర్! మంగుడు, హితేష్ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Bijapur Encounter: నిఘా వర్గాల సమాచారం మేరకు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.

Bijapur Encounter: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతమైన దక్షిణ భాగంలో మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం అందడంతో అక్కడ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున భద్రతా బలగాలు, సాయుధ మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) నేతృత్వంలో జరుగుతున్న ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది, తెల్లవారుజాము నుంచే అడపాదడపా కాల్పుల జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు, 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. కొనసాగుతున్న గాలింపు చర్యల సమయంలో ఎన్కౌంటర్ స్థలం నుంచి ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం కుంట ఏరియా కార్యదర్శి మంగుడుతోపాటు హితేష్ అనే అగ్రనేతలు హతమైనట్టు తెలుస్తోంది.
పోలీసు అధికారుల ప్రకారం, వామపక్ష తీవ్రవాదానికి కంచుకోటగా పరిగణించే దక్షిణ బస్తర్ ప్రాంతంలో సాయుధ మావోయిస్టు కేడర్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. భద్రతా బలగాలు రాత్రికి ఆ ప్రాంతంలోకి ప్రవేశించాయి. తెల్లవారుజామున 5.00 గంటల ప్రాంతంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీనికి ప్రతిగానే భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు.
తెల్లవారుజామున గాలింపు సమయంలో ఎదురుకాల్పులు
డీఆర్జీ బృందం దక్షిణ బీజాపూర్లోని అటవీ ప్రాంతంలోకి మరింత దూరం వెళుతున్నప్పుడు, మావోయిస్టు కేడర్ల నుంచి వారిపై కాల్పులు జరిగాయి, దీంతో అటవీ ప్రాంతం కాల్పు మోతతో మారుమోగింది. భద్రతా సిబ్బంది ప్రతిఘటించడంతో, చాలా గంటల పాటు కాల్పుల జరుగుతున్నాయి. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు దిగ్బంధించాయి. దట్టమైన అడవి చాటున ఏ మావోయిస్టులు తప్పించుకోకుండా ఉండేలా అదనపు బలగాలను మోహరించారు.
ఈ ఆపరేషన్ వివరాలను అందిస్తూ, బస్తర్ ఐజీ పి సుందర్రాజ్ మాట్లాడుతూ, “బీజాపూర్ జిల్లాలోని దక్షిణ ప్రాంతంలో సాయుధ మావోయిస్టులు ఉన్నారనే నిఘా సమాచారం ఆధారంగా గాలింపు చర్యలు ప్రారంభించాం. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బృందం దక్షిణ బస్తర్ ప్రాంతంలో ఆపరేషన్లో ఉంది. తెల్లవారుజామున 5.00 గంటల నుంచి డీఆర్జీ , మావోయిస్టుల మధ్య అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు, గాలింపు చర్యల సమయంలో ఎన్కౌంటర్ స్థలం నుంచి ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.”
ట్రెండింగ్ వార్తలు





















