అన్వేషించండి

Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి

Rayadurgam Land Record Price | రంగారెడ్డి జిల్లాలోని రాయదుర్గంలో TGIIC నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ఎకరా భూమి రికార్డు స్థాయిలో రూ.264 కోట్లు పలికింది.

Rayadurgam Land Auction | హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని TGIIC భూములు రికార్డు ధర పలికాయి. తాజాగా నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ఎకరా భూమి రూ.264 కోట్ల భారీ ధర పలికింది. MSN రియాలిటీ సంస్థ అంత ధర పలికి భూములు దక్కించుకుంది. అధిక ధర పలికి మొత్తం 5.25 ఎకరాలను అదే సంస్థ వేలంలో సొంతం చేసుకుంది. దాదాపు 3 నెలల కిందట జరిగిన వేలంలో ఇదే సర్వే నెంబర్‌లో ఎకరా భూమి ఏకంగా రూ.237 కోట్లు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రికార్డు బద్ధలుకొట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు తొక్కుతోంది. భూముల వేలానికి సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేయడంతో సర్వే నంబర్ 83/1లోని 5.25 ఎకరాలను ఆన్‌లైన్లో వేలం వేశారు.


రాయదుర్గం భూముల వేలానికి సుప్రీంకోర్టు లైన్ క్లియర్
రంగారెడ్డి జిల్లాలోని రాయదుర్గం పాన్‌మక్తాలో 11 ఎకరాల టీజీఐఐసీ (TGIIC) భూముల వేలం ప్రక్రియను నిలిపివేసుందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం నాడు నిరాకరించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఇందులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. గతంలో స్టే ఇచ్చిన కంచ గచ్చిబౌలి భూములకు, వేలం వేసే ప్రాంతానికి 5 కి.మీ దూరం ఉందని, రెండింటికీ సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వీ స్పష్టం చేయడంతో జువ్వాడి ప్రణయ్ సింహారావు దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం తిరస్కరించింది. ఇంకా ఈ విషయంపై ఏమైనా వివాదాలుంటే తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించింది.

ఇప్పటికే ఈ వేలంపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జీలు కూడా ఇదివరకే నిరాకరించారు. ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ (ఎల్‌ఆర్‌టీ)ను ఆశ్రయించినట్లు లేదా విచారణ పెండింగ్‌లో ఉన్నట్లు ఆధారాలు లేవని జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ పేర్కొనగా, ఎస్. రవీంద్రనాథ్ దాఖలు చేసిన మరొక పిటిషన్‌పై జస్టిస్ నగేష్ భీమపాక ప్రభుత్వం, హెచ్‌ఎండీఏలను కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబరు 19కి వాయిదా వేయడం తెలిసిందే. దీంతో ఎకరాకు రూ.175 కోట్ల కనీస ధరతో టీజీఐఐసీ చేపట్టిన ఆన్‌లైన్ వేలానికి మార్గం సుగమమైంది. అయితే టీజీఐఐసీ (TGIIC) ఆన్‌లైన్లో భూమల వేలం నిర్వహించగా రికార్డు స్థాయిలో ఎకరా 264 కోట్లు పలికింది. దాదాపు మూడు నెలల కిందట నిర్వహించిన వేలంలో ఇక్కడి భూమి ఎకరా రూ. 237 కోట్లు పలికిన విషయం తెలిసిందే. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Embed widget