అన్వేషించండి

Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?

Land Pooling: అమరావతి ల్యాండ్ పూలింగ్ రెండో విడత ప్రారంభమయింది. కానీ తొలి దశలో ఉన్నంత ఉత్సాహం రైతుల్లో ఇప్పుడు ఉందా అన్నదే పెద్ద ప్రశ్న.

AP Capital Amaravati 2nd Phace Land Pooling: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన రెండో విడత భూసమీకరణ (LPS 2.0) ప్రక్రియ  శనివారం నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. దాదాపు 16,666 ఎకరాల మేర భూమిని సేకరించడమే లక్ష్యంగా ఏపీసీఆర్‌డీఏ (APCRDA) ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో రాజధాని పనులు నిలిచిపోయినప్పుడు తీవ్ర ఆందోళన చెందిన రైతులు, ఇప్పుడు మళ్లీ పనులు శరవేగంగా ప్రారంభం కావడంతో ఈ రెండో విడత ప్రక్రియపై సానుకూల స్పందన వ్యక్తం చేస్తున్నారని సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి.  అయితే మొదటి విడతలో చూపించినంత ఉత్సాహం ఇప్పుడు చూపిస్తారా అన్నది భూసమీకరణ ప్రారంభించిన తర్వాత స్పష్టత రానుంది. 

రాజధాని అభివృద్దిపై ఆశావహంగా రైతులు

రాజధాని విస్తరణ జరిగితేనే తమ ప్రాంతం ఆర్థికంగా బలోపేతం అవుతుందని నమ్ముతున్న రైతులు, ప్రభుత్వంతో సహకరించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో రైతుల్లో ఉన్న చిన్నపాటి సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం గట్టి భరోసా ఇస్తోంది. భూములిచ్చే రైతులకు మొదటి విడతలో కల్పించిన ప్రయోజనాలనే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. భూమి రకాన్ని బట్టి  నివాస ,  వాణిజ్య ప్లాట్లను కేటాయించడంతో పాటు, ఏటా చెల్లించే కౌలును  చెల్లిస్తారు.  భూములిచ్చిన రైతులకు కచ్చితమైన గడువులోగా అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగిస్తామని, రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎటువంటి నిధుల కొరత లేకుండా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రైతులకు హామీ ఇచ్చారు.

భారీ ప్రాజెక్టుల కోసం భూమి సేకరణ 

ఇప్పుడు సేకరించబోయే ఈ 16,666 ఎకరాల భూమిని ప్రభుత్వం కేవలం ప్లాట్ల కోసం కాకుండా, రాజధాని మనుగడకు అవసరమైన భారీ ప్రాజెక్టుల కోసం ఉపయోగించనుంది. ప్రధానంగా రాజధాని చుట్టూ నిర్మించబోయే ఇన్నర్ రింగ్ రోడ్డు, క్వాంటం వ్యాలీ, అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ,  ఐటీ హబ్‌ల వంటి మెగా ప్రాజెక్టులు ఈ స్థలాల్లోనే రూపుదిద్దుకోనున్నాయి. అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా, ఆర్థిక ,  విజ్ఞాన నగరంగా తీర్చిదిద్దేందుకు ఈ భూమి అత్యంత కీలకం. రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే రైల్వే నెట్‌వర్క్ ,  ఇండస్ట్రియల్ కారిడార్ల కోసం కూడా ఈ భూమిని కేటాయిస్తారు.

గతంలోలా ఆసక్తి చూపిస్తారా?                    

రాజదానిగా అమరావతిని ప్రకటించి ల్యాండ్  పూలింగ్ ప్రకటించినప్పుడు రైతులంతా ముందుకు వచ్చారు. అయితే ఇప్పుడు అంత ఆసక్తి చూపిస్తారా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రస్తుతం అమరావతి నిర్మాణం ప్రస్తుతం రైతుల అంచనాలకు తగ్గట్టుగానే శరవేగంగా సాగుతోంది.  ఇప్పటికే అమరావతిలో ఐకానిక్ టవర్స్   పనులు పునఃప్రారంభం కావడం రైతుల్లో నమ్మకాన్ని రెట్టింపు చేసింది. గత ఐదేళ్లలో నిలిచిపోయిన కట్టడాలను పూర్తి చేయడంతో పాటు, వరద నియంత్రణ కోసం పంపింగ్ స్టేషన్లు , గ్రావిటీ కెనాల్స్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇది తమ భూముల విలువను పెంచడమే కాకుండా, భావితరాలకు గొప్ప ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని రాజధాని రైతులు ఆశాభావంతో ఉన్నారు. అంందుకే రైతులంతా ముందుకు  వస్తారని ప్రభుత్వం నమ్మకంగా ఉంది.              

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
NTR Jr On Balakrishna Injury: బాబాయ్ బాలయ్య కోలుకోవాలని అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు... ఫోనులో మావయ్యకు లోకేష్ పరామర్శ
బాబాయ్ బాలయ్య కోలుకోవాలని అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు... ఫోనులో మావయ్యకు లోకేష్ పరామర్శ

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget