అన్వేషించండి

Water dispute Committee: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కమిటీ -హఠాత్తుగా కేంద్రం కీలక నిర్ణయం

Andhra Pradesh and Telangana: ఏపీ, తెలంగాణ మధ్య తరచూ వస్తున్న జల వివాదాలు, ప్రాజెక్టుల అంశాలను పరిష్కరించేందుకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది.

Water issues between Andhra Pradesh and Telangana:  తెలంగాణ ,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న నదీజలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ ఒక కీలక అడుగు వేసింది. ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ ,  ప్రాజెక్టుల నిర్వహణపై తలెత్తుతున్న విభేదాలను సాంకేతిక, పరిపాలనాపరంగా పరిష్కరించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని నోటిఫై చేసింది. ఈ కమిటీ ఏర్పాటు ద్వారా వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర జలసంఘం (CWC) ఛైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీపై అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

ఈ కమిటీలో నీటి వనరుల రంగానికి చెందిన కీలక అధికారులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. కృష్ణా , గోదావరి నదీ యాజమాన్య బోర్డులు KRMB, GRMB ఛైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ  చీఫ్ ఇంజినీర్, అలాగే సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు రెండు రాష్ట్రాల జలవనరుల శాఖకు చెందిన ఉన్నతాధికారులను కూడా ఈ కమిటీలో భాగస్వామ్యం చేశారు. వివాదాస్పద ప్రాజెక్టులు ,  నీటి పంపకాలపై ఈ కమిటీ ఇచ్చే నివేదిక రెండు రాష్ట్రాల మధ్య జల జగడాలను ముగించడానికి మార్గం చూపనుంది.

ఎవరెవరు ఉంటారంటే ? 
 
ఈ కమిటీకి కేంద్ర జలసంఘం (CWC) ఛైర్మన్ నాయకత్వం వహిస్తారు. ఇందులో కీలక బాధ్యతలు నిర్వహించేందుకు ఇరు రాష్ట్రాలు.  కేంద్రానికి చెందిన ప్రతినిధులను సభ్యులుగా నియమించారు.  రాష్ట్రాల ప్రతినిధులు: తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు , కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB),  గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) ఛైర్మన్లు. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (NWDA) చీఫ్ ఇంజినీర్ ,  సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) కి చెందిన చీఫ్ ఇంజినీర్లు సభ్యులుగా ఉంటారు. 

కమిటీ ప్రధాన లక్ష్యాలు

ఈ కమిటీ ప్రధానంగా రాష్ట్ర విభజన చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం పెండింగ్‌లో ఉన్న అంశాలపై దృష్టి సారిస్తుంది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నికర పంపిణీ, శ్రీశైలం ,  నాగార్జునసాగర్ వంటి ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటు, ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతల బదిలీ వంటి అంశాలను ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ముఖ్యంగా బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ , పోలవరం వంటి వివాదాస్పద అంశాలపై సాంకేతిక నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తుంది.

ప్రాధాన్యత,  పర్యవసానాలు

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి , ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.  గతంలో ట్రిబ్యునళ్లలో విచారణలు ఏళ్ల తరబడి సాగగా, ఇప్పుడు ఈ సాంకేతిక కమిటీ ద్వారా త్వరితగతిన సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు, గోదావరి బోర్డు కార్యాలయాన్ని తెలంగాణకు తరలించే ప్రక్రియపై కూడా ఈ కమిటీ సమన్వయం చేయనుంది. ఈ కమిటీ నిర్ణయాలు రెండు రాష్ట్రాల రైతులకు మేలు చేకూర్చడంతో పాటు, అనవసరమైన రాజకీయ ఘర్షణలను తగ్గించగలవని కేంద్రం ఆశిస్తోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
BRS Assembly Boycott: బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ - అసెంబ్లీలోని గాంధీభవన్‌లా నిర్వహిస్తున్నారని ఆగ్రహం
బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ - అసెంబ్లీలోని గాంధీభవన్‌లా నిర్వహిస్తున్నారని ఆగ్రహం
Maoists Surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ కు షాక్.. వీడియో కోసం ఇన్ స్టాగ్రామ్‌కు లేఖ రాసిన పోలీసులు
యూట్యూబర్ అన్వేష్ కు షాక్.. వీడియో కోసం ఇన్ స్టాగ్రామ్‌కు లేఖ రాసిన పోలీసులు
Advertisement

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
BRS Assembly Boycott: బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ - అసెంబ్లీలోని గాంధీభవన్‌లా నిర్వహిస్తున్నారని ఆగ్రహం
బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ - అసెంబ్లీలోని గాంధీభవన్‌లా నిర్వహిస్తున్నారని ఆగ్రహం
Maoists Surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ కు షాక్.. వీడియో కోసం ఇన్ స్టాగ్రామ్‌కు లేఖ రాసిన పోలీసులు
యూట్యూబర్ అన్వేష్ కు షాక్.. వీడియో కోసం ఇన్ స్టాగ్రామ్‌కు లేఖ రాసిన పోలీసులు
IndiGo Flights Diverted: శంషాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
IndiGo Flights Diverted: శంషాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
Team India schedule 2026: ఈ ఏడాది టీమిండియా పూర్తి షెడ్యూల్ చూశారా.. కీలకంగా టీ20 వరల్డ్ కప్
ఈ ఏడాది టీమిండియా పూర్తి షెడ్యూల్ చూశారా.. కీలకంగా టీ20 వరల్డ్ కప్
Shanmukh Jaswanth : ప్రియురాలిని పరిచయం చేసిన షణ్ముఖ్ జశ్వంత్? - గాడ్స్ ప్లాన్ అంటూ పోస్ట్... ఆమె ఎవరు?
ప్రియురాలిని పరిచయం చేసిన షణ్ముఖ్ జశ్వంత్? - గాడ్స్ ప్లాన్ అంటూ పోస్ట్... ఆమె ఎవరు?
Discount on Railway Ticket Bookings : రైలు టికెట్లను ఆన్‌లైన్‌లో ఇలా బుక్ చేసుకోండి.. డిస్కౌంట్ వస్తుంది, సంక్రాంతి నుంచి ప్రారంభం
రైలు టికెట్లను ఆన్‌లైన్‌లో ఇలా బుక్ చేసుకోండి.. డిస్కౌంట్ వస్తుంది, సంక్రాంతి నుంచి ప్రారంభం
Embed widget