అన్వేషించండి

Water dispute Committee: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కమిటీ -హఠాత్తుగా కేంద్రం కీలక నిర్ణయం

Andhra Pradesh and Telangana: ఏపీ, తెలంగాణ మధ్య తరచూ వస్తున్న జల వివాదాలు, ప్రాజెక్టుల అంశాలను పరిష్కరించేందుకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది.

Water issues between Andhra Pradesh and Telangana:  తెలంగాణ ,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న నదీజలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ ఒక కీలక అడుగు వేసింది. ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ ,  ప్రాజెక్టుల నిర్వహణపై తలెత్తుతున్న విభేదాలను సాంకేతిక, పరిపాలనాపరంగా పరిష్కరించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని నోటిఫై చేసింది. ఈ కమిటీ ఏర్పాటు ద్వారా వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర జలసంఘం (CWC) ఛైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీపై అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

ఈ కమిటీలో నీటి వనరుల రంగానికి చెందిన కీలక అధికారులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. కృష్ణా , గోదావరి నదీ యాజమాన్య బోర్డులు KRMB, GRMB ఛైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ  చీఫ్ ఇంజినీర్, అలాగే సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు రెండు రాష్ట్రాల జలవనరుల శాఖకు చెందిన ఉన్నతాధికారులను కూడా ఈ కమిటీలో భాగస్వామ్యం చేశారు. వివాదాస్పద ప్రాజెక్టులు ,  నీటి పంపకాలపై ఈ కమిటీ ఇచ్చే నివేదిక రెండు రాష్ట్రాల మధ్య జల జగడాలను ముగించడానికి మార్గం చూపనుంది.

ఎవరెవరు ఉంటారంటే ? 
 
ఈ కమిటీకి కేంద్ర జలసంఘం (CWC) ఛైర్మన్ నాయకత్వం వహిస్తారు. ఇందులో కీలక బాధ్యతలు నిర్వహించేందుకు ఇరు రాష్ట్రాలు.  కేంద్రానికి చెందిన ప్రతినిధులను సభ్యులుగా నియమించారు.  రాష్ట్రాల ప్రతినిధులు: తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు , కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB),  గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) ఛైర్మన్లు. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (NWDA) చీఫ్ ఇంజినీర్ ,  సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) కి చెందిన చీఫ్ ఇంజినీర్లు సభ్యులుగా ఉంటారు. 

కమిటీ ప్రధాన లక్ష్యాలు

ఈ కమిటీ ప్రధానంగా రాష్ట్ర విభజన చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం పెండింగ్‌లో ఉన్న అంశాలపై దృష్టి సారిస్తుంది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నికర పంపిణీ, శ్రీశైలం ,  నాగార్జునసాగర్ వంటి ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటు, ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతల బదిలీ వంటి అంశాలను ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ముఖ్యంగా బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ , పోలవరం వంటి వివాదాస్పద అంశాలపై సాంకేతిక నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తుంది.

ప్రాధాన్యత,  పర్యవసానాలు

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి , ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.  గతంలో ట్రిబ్యునళ్లలో విచారణలు ఏళ్ల తరబడి సాగగా, ఇప్పుడు ఈ సాంకేతిక కమిటీ ద్వారా త్వరితగతిన సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు, గోదావరి బోర్డు కార్యాలయాన్ని తెలంగాణకు తరలించే ప్రక్రియపై కూడా ఈ కమిటీ సమన్వయం చేయనుంది. ఈ కమిటీ నిర్ణయాలు రెండు రాష్ట్రాల రైతులకు మేలు చేకూర్చడంతో పాటు, అనవసరమైన రాజకీయ ఘర్షణలను తగ్గించగలవని కేంద్రం ఆశిస్తోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bengal Elections 2026: ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
PM Modi Meeting CMs: నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
Tunguska Missile System: భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
Advertisement

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
Varun Tej Bhari : వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
Telangana Latest News: తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
Rishab Shetty : వారిద్దరినీ అన్ ఫాలో చేసిన రిషబ్ శెట్టి - హోంబలే ఫిల్మ్స్‌తో విభేదాలు!... కాంతార 3 పరిస్థితి ఏంటి?
వారిద్దరినీ అన్ ఫాలో చేసిన రిషబ్ శెట్టి - హోంబలే ఫిల్మ్స్‌తో విభేదాలు!... కాంతార 3 పరిస్థితి ఏంటి?
Andhra Pradesh Delimitation Politics: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?
Best Courses After Intermediate : ఇంటర్ తర్వాత ఈ ట్రెండింగ్ కోర్సులు ఎంచుకోండి.. అద్భుతమైన కెరీర్ అవకాశాలు మీ సొంతమవుతాయి
ఇంటర్ తర్వాత ఈ ట్రెండింగ్ కోర్సులు ఎంచుకోండి.. అద్భుతమైన కెరీర్ అవకాశాలు మీ సొంతమవుతాయి
Embed widget