అన్వేషించండి

Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం

New Pattadar passbooks: ఏపీ రైతులకు రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వం జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాలను పంపిణీ చేసింది.

New Pattadar passbooks Good news for AP farmers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి కూటమి ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా  రాజముద్ర తో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి ఫోటోతో జారీ చేసిన పాసుపుస్తకాలపై ప్రజల్లో వ్యక్తమైన తీవ్ర అసంతృప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, వాటి స్థానంలో అధికారిక రాజముద్ర ఉన్న పుస్తకాలను అందజేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు ఈ పంపిణీ కార్యక్రమం పండుగలా సాగాలని దిశానిర్దేశం చేశారు. 

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రీ-సర్వేలోని లోపాలను సరిదిద్ది, భూ యజమానులకు పూర్తి భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత పాలకులు పాసుపుస్తకాలపై తమ ఫోటోలను ముద్రించుకోవడానికే ఏకంగా రూ. 22 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేశారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. వివాదాలు లేని స్థలాలను కూడా అసంబద్ధ రీ-సర్వేతో వివాదాస్పదం చేశారని, అటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించి రైతులకు క్లీన్ టైటిల్స్ అందించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో 22 లక్షల కొత్త పాసుపుస్తకాలను  సిద్ధం చేసి పంపిణీ ప్రారంభించారు.    

  
రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ ,  ఇతర మంత్రులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం పలు కీలక సూచనలు చేశారు. వివాదాస్పదమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఇప్పటికే రద్దు చేయడం ద్వారా ప్రజల్లో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించామని ఆయన గుర్తు చేశారు. భూమే ప్రాణంగా బతికే రైతులకు ఎటువంటి భూ సమస్యలు లేకుండా చేయడం ప్రథమ కర్తవ్యమని, నిర్దిష్ట గడువు పెట్టుకుని రెవెన్యూ ఇబ్బందులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి కూడా ఒక రోజు పాల్గొననున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా వేలాది గ్రామాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా మొదలైంది. జగన్ బొమ్మ ఉన్న పుస్తకాల స్థానంలో అధికారిక రాజముద్రతో కూడిన కొత్త పుస్తకాలు అందుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకం అనేది కేవలం ఒక పత్రం మాత్రమే కాదని, అది రైతు ఆత్మగౌరవానికి, ఆస్తి హక్కుకు భరోసా అని ఈ సందర్భంగా నాయకులు పేర్కొంటున్నారు. రాబోయే వారం రోజుల్లో లక్షలాది మంది రైతులకు వీటిని అందజేయడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.   

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget