అన్వేషించండి

Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌

Road Safety Cess in Telangana : తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలదారులకు షాక్ ఇచ్చింది. బైక్‌లకు రూ. 2,000, కార్లకు రూ. 5,000 సెస్సుతో పాటు లైఫ్‌ ట్యాక్స్‌ నిబంధనల్లోనూ మార్పులు చేసింది.

Telangana New Road Safety Cess: తెలంగాణలో కొత్త వాహనం కొనడం ఇకపై మరింత భారం కానుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమే దీనికి కారణం. రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా "రహదారి భద్రతా సెస్సు" అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు, మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఎంత సెస్సు అంటే?
కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై, తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి కొత్త ద్విచక్ర వాహనంపై రూ. 2,000, కార్లపై రూ. 5,000, భారీ వాహనాలపై రూ. 10,000 రహదారి భద్రతా సెస్సు వసూలు చేస్తారు. దీంతో కొత్త వాహనాల కొనుగోలుపై కొంత అదనపు భారం పడనుంది.

ఎవరికైనా మినహాయింపు ఉందా?
సామాన్య ప్రజలకు కొంత ఊరట కలిగించేలా.. ఆటోలు, ట్రాక్టర్లు, వ్యవసాయ అవసరాలకు వాడే వాహనాలకు ఈ సెస్సు నుంచి మినహాయింపు ఇచ్చారు. రైతులు, చిన్న వ్యాపారులపై అదనపు భారం పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

సరుకు వాహనాలకు కొత్త లెక్క
ఇప్పటివరకు సరుకు రవాణా వాహనాలపై ఉన్న త్రైమాసిక పన్నును రద్దు చేస్తూ, దాని స్థానంలో 7.5 శాతం జీవితకాల పన్ను (లైఫ్‌ ట్యాక్స్‌)ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రవాణా రంగంలో పన్ను విధానం పూర్తిగా మారనుంది.

ఇతర రాష్ట్రాల వాహనాలపై కూడా పన్ను
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పాత వాహనాలపైనా, వాటి వయసును బట్టి 4 శాతం నుంచి 6.5 శాతం వరకు పన్ను వసూలు చేయనున్నారు. రాష్ట్రానికి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

డ్రైవింగ్ లైసెన్స్‌లో కఠిన నిబంధనలు
రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచేందుకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను కూడా కఠినతరం చేయనున్నారు. కంప్యూటర్ ఆధారిత డ్రైవింగ్ పరీక్షలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో నిజంగా డ్రైవింగ్ నైపుణ్యం ఉన్నవారికే లైసెన్స్ లభించే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వానికి భారీ ఆదాయం
ప్రస్తుతం తెలంగాణలో ఏటా సుమారు 9 లక్షల కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఈ కొత్త రహదారి భద్రతా సెస్సు ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ. 300 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని రోడ్డు భద్రత చర్యలు, ట్రాఫిక్ మౌలిక వసతుల మెరుగుదలకు వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది.          

మొత్తానికి, తెలంగాణలో కొత్త వాహనం కొనాలంటే ఇకపై ఈ అదనపు సెస్సును కూడా ఖర్చులో లెక్కలో పెట్టుకోవాల్సిందే. రోడ్డు భద్రతే లక్ష్యంగా వచ్చిన ఈ నిర్ణయం వాహన కొనుగోలుదార్లపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.          

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.                 

టాప్ హెడ్ లైన్స్

BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!
కియా సిరోస్‌ EVకి అదిరిపోయే డిమాండ్‌.. 650కి పైగా బుకింగ్స్‌, ఒక్కరోజులోనే 150 డెలివరీలు
ఈ EV డిమాండ్‌ మామూలుగా లేదుగా! ఒక్కరోజులో 150.. ఇది నేషనల్‌ రికార్డ్‌

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget