Budget 2024 LIVE Updates: ఉద్యోగులకు గుడ్ న్యూస్- స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ. 75వేలకు పెంపు
Union Budget 2024 LIVE Updates: మోదీ ప్రభుత్వం మూడోసారి ప్రవేశ పెడుతున్న బడ్జెట్పై భారీ అంచనాలున్నాయి. బడ్జెట్కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకునేందుకు ఈ లైవ్బ్లాగ్ని ఫాలో అవ్వండి.
LIVE

Background
Union Budget 2024 LIVE Updates: 8 మంది బీజేపీ ఎంపీలున్నా, 8 రూపాయలు కూడా తేలేదు: కేటీఆర్
తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను ప్రజలు గెలిపించినా, కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో రాష్ట్రానికి 8 రూపాయలు కూడా కేటాయించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో మరోసారి రాష్ట్రానికి మొండిచేయి చూపించారని, కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
Budget 2024 LIVE Updates: ఏ రూపంలో అయినా నిధులు నిధులే - ఏపీకి సూపర్ బడ్జెట్!
కేంద్ర బడ్జెట్ ప్రకటన తర్వాత దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలు కావడంతో.. ఈ రెండు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించారని మాట్లాడుకుంటున్నారు. బీహార్ గురించి పక్కన పెడితే ఈ కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకమే అని అంటున్నారు. ఎన్నో సమస్యల్లో ఉన్న ఏపీకి ఊపిరి పోసేలా నిధుల కేటాయింపు ఉందని వినిపిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
Budget 2024 LIVE Updates: మహిళలకు వరాల జల్లు
Budget 2024 LIVE Updates: మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్లు మంజూరు చేశారు నిర్మలా సీతారామన్. ఈశాన్య ప్రాంతంలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 100కు పైగా శాఖలు ఏర్పాటు చేయనున్నారు. దేశ ఆహార భద్రత కోసం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయాలని భావించారు. కేంద్ర బడ్జెట్ 2024-25 ఎంఎస్ఎంఈలు, కార్మిక ఆధారిత తయారీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎంఎస్ఎంఈలకు చేయూత ఇచ్చేందుకు ముద్ర రుణ పరిమితి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు
Budget 2024 LIVE Updates: ఉద్యోగులకు గుడ్ న్యూస్ స్టాండర్డ్ డిడక్షన్ 75వేలకు పెంపు
Budget 2024 LIVE Updates: ఉద్యోగులకు గుడ్ న్యూస్ స్టాండర్డ్ డిడక్షన్ 75వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Budget 2024 LIVE Updates: ఆదాయపు పన్నుపై కీలక ప్రకటన
Budget 2024 LIVE Updates: ఆదాయపు పన్నును సులభతరం చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సకాలంలో టీడీఎస్ చెల్లించకపోవడం ఇకపై నేరం కాదన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

